Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదర్శ గ్రామాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం
- 30 రోజుల కార్యచరణను గ్రామాలల్లో అమలు చేయాలి
- ఎంపీడీఓ సురేష్ బాబు
నవతెలంగాణ - మర్పల్లి
గ్రామీణ పల్లె సీమలు ఆదర్శ గ్రామాలుగా మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల కార్యచరణ ప్రణాళికను రూపొందించిందని, ఎంపీడీఓ సురేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మండలాభివద్ధే లక్ష్యం పనిచేస్తానని తెలిపారు. పల్లెల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి పల్లెలన్నీ అడవులను తలపించేలా మార్చేందుకు కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్య పనులను చేపట్టి మురికి కాలువలు అన్ని శుభ్రం చేయడం, దోమల నివారణ కోసం పిచ్చి మొక్కలు తొలగించి, దోమల మందు పిచికారి చేయడం జరుగుతుందన్నారు, గ్రామాల్లో మంచినీటి పైపులైన్లు లీకేజీలు వెంటనే మరమ్మతులు చేయించాలని కార్యదర్శులకు ఆయన సూచించారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా మండలంలో రహదారుల వెంట 22 కిలోమీటర్ల మేర 9 వేల మొక్కలు నాటడం జరిగిందన్నారు. వచ్చే సీజన్ కు పంచాయతీకి ఓ నర్సరీ ఏర్పాటు చేసి రైతుకు అవసరం ఉన్న మొక్కలను మాత్రమే పెంచడం జరుగుతుందన్నారు. అందుకు సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ పథకాన్ని 100 శాతం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని తెలిపారు. వాటిని వాడుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ కోసం తవ్విన రోడ్లను వెంటనే మరమ్మతులు చేసే విధంగా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇస్తామన్నారు, మిషన్ భగీరథ పైపులైను వేసిన కాంట్రాక్టరే మరమ్మతు పనులు చేయాల్సి ఉంటుందన్నారు, 30 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మురికి కాలువలు శుభ్రం చేయించి పిచ్చి మొక్కలు తొలగించి మురికి నీటి గుంటలను మొరం మట్టితో పూడ్చటం జరిగిందన్నారు, ఈనెల 22లోగా అన్ని గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా చూస్తామన్నారు. 30 రోజుల కార్యాచరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జిల్లా అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు,