Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నందిగామ
గ్రామాలభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుం దని షాదనగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని చాకలిగుట్ట తండా, మామిడిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మామిడిపల్లి గ్రామపంచాయతీలోని నసురుల్లాబాద్లో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం, ఆ అంగన్వాడీ కేంద్రంలో హ్యూమన్ పీపుల్ టు పీపుల్ స్వచ్చంద సంస్థ చిన్నారులకు డిజిటల్ తరగతుల కోసం ఏర్పాటు చేసిన టీవీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు ఆట వస్తువులను అంద జేశారు. మామిడిపల్లి గ్రామపంచాయతీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.12.60 లక్షలతో నిర్మిస్తున్న శ్మశానవాటిక పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం గ్రామ పంచా యతీ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం చాకలిగుట్ట తండాలో సర్పంచ్ రాజు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడు కల్లో రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మెన్ ఈట గణేష్, గిరిజనులతో కలిసి ప్రత్యేల పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. పలు కార్యక్రమాల్లో మాజీ ఏఎంసీ చైర్మెన్ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ శివ శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నోముల పద్మారెడ్డి, సర్పంచులు గడ్డం కవిత, చంద్రారెడ్డి, రమేష్ గౌడ్, జెట్ట కుమార్, గోవిందు అశోక్, ఎంపీటీసీ మాధవి, రాజు నాయక్, చేగుర్ పీఎసీఎస్ చైర్మెన్ అశోక్, వైస్ చైర్మెన్ పద్మారావు, సీడీపీవో నాగమణి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ జ్యోతి, నాయకులు ఎమ్మెస్ సత్యనారాయణ, జ్ఞానేశ్వర్, గోపాల్, నరసింహ, సాయి, శరత్ హ్యూమన్ పీపుల్ సంస్థ ప్రతినిధులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.