Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూర్ రూరల్
మండలంలోని అంతారం తండా సమీప ంలోని భూకైలాస్ ఆలయంలో శివరాత్రి ఉత్స వాల సందర్భంగా శనివారం(మూడోరోజు) శివపార్వతులను పల్లకి సేవలో ఊరేగింపుగా తీసుకెళ్లి వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఈ కల్యాణానికి పరిసరాల ప్రాంతాలకు చెంది న సందర్శకులతో పాటు కార్నటక ప్రాంతానికి చెందిన సందర్శకులు పెద్ద ఎత్తున హాజర య్యారు. ఈ సందర్భంగా ప్రతిష్టాపకులు వా సు పవర్ శంకర్ పవన్ మాట్లాడుతూ 10 ఏండ్లుగా ఈ ఆలయంలో ఘనంగా శివరా త్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవా లకు హాజరయ్యే వారికి మూడు రోజుల పాటు అన్నదానం చేస్తున్నామని చెప్పారు. ఆదివారం జాతర ఉత్సవాలు ముగు స్తాయని తెలిపారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.