Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిల్లేడ్ చౌదరిగూడెం
సోషల్ లీడర్షిప్ కార్యక్రమంలో భాగం గా శనివారం మండలానికి వచ్చిన ట్రైయినీ ఎస్ఐలు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు మం డలంలో పర్యటించి అక్షరాస్యత, నవ సమాజ నిర్మాణం కోసం పౌరులు పాటించాల్సిన నియమనిబంధలపై అవగాహన కల్పించనున్న ట్టు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటినట్టు చెప్పారు. శిక్షణ ఎస్ఐలు అజిత్, అనిల్, అస్లాం, రోహిత్, తులసీ రాం, శ్రావణ్, సుమం జలి, శ్రీలత, చౌదరిగూడెం సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ అనిల్, సింగిల్విండో డైరెక్టర్ జబ్బార్, వార్డు సభ్యులు సైదు, మక్సూడ్, నాయకులు ఎజాజ్ అలీ, శేఖర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.