Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు రూరల్
మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి సుమారు రెండు కిలోమీటర్లు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డును మరమ్మతులు చేయాలని పలుసార్లు గ్రామస్తులు అధికారులను ప్రజాప్రతి నిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. దీంతో ఆ రోడ్డు గుండా వెళ్లే గ్రామస్తులు ప్రయాణికులకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యను పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మరమ్మ తులు చేస్తామనే సమాధానం చెబుతు న్నారే తప్ప పనులు మాత్రం జరగడం లేదని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఆ రోడ్డుపై ఉదయం సమ యంలో నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నామ ని పలువురు గ్రామస్తులు, ప్రయా ణికులు వాపో తున్నారు. అయితే రాత్రి వేళల్లో ఆ రోడ్డుపై అసలే వెళ్లడానికి రాకుండా పోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రోడ్లను మరమ్మతు లు చేసిప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. రహదారిలో వెళ్లడానికి నిత్యం ఇబ్బందులు పడు తూ నడవాల్సి వస్తుందని, ప్రస్తుతం గ్రామా నికి 108 వాహనం కూడా రాలేని పరిస్థితి ఏర్పడి ందని పలువురు వాపోతున్నారు. ఆ రోడ్డుకు మర మ్మతులు చేయాలని పలుసార్లు అధికారుల దృష్టి కి తీసుకెళ్లినా ఫలితం లేదని, చేస్తామని సాకులు చెబుతున్నారే తప్ప పనులు చేయడం లేదు. ప్ర యాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.