Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సమాజంలో మీడియా పాత్ర కీలకమని, అది ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. శనివారం రాచకొండ కమిషనరేట్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం ఉండదన్నారు. మరీ ముఖ్యంగా పోలీసుల నియామకాల్లో, బదిలల్లో రాజకీయ ఓత్తిళ్లకు తావులేదన్నారు. నేర పరిశోధనలలో ఇతర రాష్ట్రాలకు సైతం సహకరిస్తున్నామన్నారు. కొన్ని మీడియాలో అసత్య కథనాలు ప్రచారం అవుతున్నాయన్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసినవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ శాఖలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేదని, అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు సూచించారు. పోలీసుల పను తీరుపై కొన్ని వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలపై సీపీ స్పందించారు. ఆధారాలు లేకుండా వస్తున్న కథనాలు పోలీస్ వ్యవస్థను అవమా నపరిచే విధంగా ఉన్నా యన్నారు. ఓ పత్రికలో వచ్చిన వార్తను సీపీ తీవ్రంగా ఖండించారు. శనివారం పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్, తరుణ్ జ్యోషీతోపాటు జాయింట్ పోలీస్ కమిషనర్ పి.విశ్వప్రసాద్, అవినాష్మహంతీ, అదనపు డీసీపీ సునితా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. సమాజంలో మీడియాపాత్ర గొప్పదన్నారు. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. అసత్య కథనాలు ప్రచురించడం సరికాదన్నారు. తెలంగాణ పోలీసు శాఖకు దేశవ్యాస్తంగా మంచి పేరు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. కానీ ఆరేండ్లుగా ఎలాంటి చిన్న సంఘటన సైతం చోటు చేసుకోలేదని తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయ జోక్యం ఎప్పుడూ లేదన్నారు. నగరంలో నిర్వహించే బుతుకమ్మ, గణేష్ ఉత్సావాలతోపాటు రంజాన్, క్రిస్మస్, న్యూ ఇయిర్ వేడుకలతోపాటు అన్ని పండుగులు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేశామని గుర్తు చేశారు. నగరంలో నిర్వహించే రాలీలు, ధర్నాలు, సభలు సమావేశాలల్లో సైతం ఎలాంటి చిన్న అల్లర్లకు తావులేదన్నారు. అన్ని కార్యక్రమాలను ప్రశాంత వాతారవణంలో పూర్తి చేశామన్నారు. విశ్వనగరంగా పేరొందిన నగరంలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ నివసిస్తున్నారని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. నగరంలో శాంతి భద్రతలు భేష్గా ఉన్నాయని, షీ టీమ్స్, భరో సెంటర్ల పనితీరుతో దేశవిదేశాలలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగర పౌరులకు అందిస్తున్న సేవలు ఏ ఇతర రాష్ట్రాల్లో అమల్లో లేవన్నారు. తెలంగాణ సాధిస్తే శాంతిభద్రతలు పరిరక్షించలేరని ఎద్దేవా చేసిన వారు సైతం నేడు ప్రశంసలు గుప్పిస్తున్నారన్నారు. పోలీసుల పనితీరులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని తెలిపారు. పోలీస్ శాఖలో ఒక్కరిద్దరు తప్పుచేస్తే అది అందరికి రుద్దడం సరికాదన్నారు. పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. నగరంలో జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్రపతి నుంచి అవార్డు దక్కిందని గుర్తు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఐదు లక్షలకుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నగరంలో అమలు చేస్తున్న టెక్నాలేజీతోపాటు కంమాడ్ కంట్రోల్ పనితీరుపై ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి పరిశీలిస్తున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నామని, దాని ఫలితంగా నగర పోలీసులకు జాతీయ అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు ఎన్నో దక్కాయన్నారు. ప్రజలకు ఉపయోగ పడే కథనాలు రాయాలని, ఊహించుకుని తప్పుడు కథనాలు రాయడం మంచిది కాదని సూచించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.