Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-పరిగిరూరల్
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. మంగళవారం
మండల పరిధిలోని సయ్యద్ పల్లి, రాపోల్ గ్రామల్లో రైతు వేదిక నిర్మాణ పనులకు జెడ్పీటీసీ హరిప్రియారెడ్డి, ఎంపీపీ కరణం అరవిందరావులతో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు వ్యవసాయం దండుగ అనే కాలం నుంచి వ్యవసాయాన్ని లాభసాటి దశకు తీసుకువస్తున్నట్టు తెలిపారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 5 వేల ఎకరాలకు క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసే, క్లస్టర్ పరిధిలోని రైతులు తమ సాధక బాధలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడూ, అందుబాటులో ఉండి పరిష్కరిస్తారని తెలియజేశారు. వ్యవసాయంపై రైతులకు తీసుకోవలసిన జాగ్రత్తలు, అవగాహనపై ఈ వేదికల ద్వారా సహాయం అందుతుందన్నారు. రైతులను కంటికి రెప్పలా కాపాడుతూ, అడగకముందే రైతుబంధు, రుణమాఫీతో పాటు ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు, రైతుబీమాలను అమలు చేస్తుందన్నారు.కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో రాపోల్ సర్పంచ్ కావలి జంగయ్య యాదవ్, సయ్యద్ పల్లి గ్రామ సర్పంచ్ కెవిఆర్ కె రెడ్డి,జెడ్ పి కో ఆప్షన్ సభ్యులు హాపీజ్, పీఎసీఎస్ చైర్మెన్ శ్యామ్ సుందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాజేందర్, వ్యవసాయ అధికారులు వీరప్ప, ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు, సురేందర్, ఎంపీటీసీ రవిసాగర్, పీఎసీఎస్ వైస్ చైర్మెన్ భాస్కర్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మెన్ వెంకటయ్య, సయ్యద్ పల్లి ఉపసర్పంచ్ ఫారుక్, రాపోల్ ఉపసర్పంచ్ విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.