Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-షాబాద్
మండలం సర్దార్నగర్ పశువుల సంతలో కరోనా వ్యాధిని కట్టడి చేసే జాగ్రత్తలు కరువయ్యాయి. మంగళవారం నిర్వహించిన పశువుల సంతలో ప్రజలు మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటిం చకుండా గుంపులు గుంపులుగా ఉంటూ వ్యాపారాలు నిర్వహిస్తునా, అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నిర్లక్ష్యంతోనే షాబాద్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. సంతలు, షాపింగ్ మాళ్లు, ఇతర మార్కెట్ సముదాయాల్లో తప్పనిసరిగా భౌతికదూరం పాటించి మాస్కులు ధరించాలని, తరుచూ శానిటై జర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలనే నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సర్దానగర్ మార్కెట్ లోని పశువుల సంతలో ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ ప్రబలే ప్రమాదం ఉందనీ పలువు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సర్దార్నగర్ పశువుల సంతలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.