Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
కొత్తగా నిర్వహిస్తున్న డ్రయినేజీ పనుల్లో నాణ్యతను పాటించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం కోకాపేట్ ఐదోవార్డుల్లో రూ .కోటి 50 లక్షలతో అండర్ డ్రయి నేజీ పనులు చేపట్టారు. కమిషనర్ అఖస్మిక తనిఖీ నిర్వహిస్తూ నాణ్యత ప్రమాణాలను పాటిం చాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలను తీర్చేందుకు నిరంతరం అందు బాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని తెలి పారు. బోనాల సంద ర్భంగా గ్రామాల్లో వీది దీపాలు, పరిశుధ్య పనులు చేపడు తున్నట్టు వివరించారు. హరితహారంలో భాగం గా ప్రతిఒక్కరి ఇంట్లో మొక్కలు నాటేందుకు మున్సిపల్ పాలక వర్గంతో కలిసి పని చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.