ఇస్లాంలో పురుషుడికి ఉన్నన్ని వెసులుబాట్లు స్త్రీలకు లేవు. భిన్నత్వంలో ఏకత్వమనేది భారత దేశపు ఆత్మ. ఏ దేశంలో లేని గొప్ప సంస్కృతి భారత్లో పరిఢవిల్లుతోంది. అటువంటి సమయంలో పరమత సహనం అత్యంత ముఖ్యమైన అంశం. మిగిలిన మతాల మాదిరిగానే ఇస్లామ్ను కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఏర్పరుచుకున్న కంచెను ఇతర మతస్తులూ తొలగించుకోవాలి. అలాగే ముస్లింలు కూడా విశాల దృక్పథంలో అర్థం చేసుకుని, ఈ తీర్పును అభివృద్ధికి అవకాశంగా మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంతో మరోసారి ఇ స్లామిక్ నిబంధనలు, ఉ ల్లంఘనలతో దేశవ్యాప్తం గా చర్చ జరుగుతోంది. మత మౌఢ్యాన్ని అవలం బించే కొందరు ప్రతి మ తంలోనూ కనిపిస్తుంటా రు. లేకపోతే మదర్సాల వేద పాఠశాలలు, సెయింట్స్ పేరుతో పాఠశాలలు ఉండేవేకావు. మతాల ఉనికి ఇప్పటికీ ఉందంటే వాటిని పట్టించుకునేవారు ఉండడంవల్లే అని చెప్పవచ్చు. పురుషాధిపత్య సమాజం కావడంతో ప్రతిమతంలోనూ మహిళలకు పరిపూర్ణ స్వేచ్ఛ లభించలేదు. జనాభాపరంగా మైనారిటీలు కావడంతో వీరిలో ముందుకు వస్తున్న మహిళల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. దేశంలో జరిగే అనేక సంఘ వ్యతిరేక చర్యలలాంటిదే తలాక్ ఎ బిద్దత్ వ్యవహారం కూడా. వరకట్నం, లంచం, దొంగతనం, దాడులకు దిగడం, అత్యాచారాలు ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకాలే.
అసలు విధానం
తలాక్ అన్నా విడాకులు అన్నా ఒకే అర్థం. తలాక్ విధానం లో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి పూర్తిగా దంపతుల క్షేమం కోరే ఏర్పాటు చేసినది. పొరపాటుగానో, ఏమరుపాటుగానో భర్త తలాక్ ఆవేశంలోనో చెప్పి ఉంటే దానిని సరి చేసుకునే అవకాశం ఇచ్చి మరీ పెట్టినదే. అది కూడా భార్య రుతుకాలంలో ఉన్నప్పుడు చెప్పకూడదనే నిబంధన ఉంది. అలా భార్య రుతు సమయంలో లేనప్పుడు ఒక తలాక్ చెప్పి నెల రోజులపాటు వేచి చూడాలి. అ ప్పటికీ తన పొరపాటు గ్రహించే అవకాశం అతడికి ఉంటుంది. అయినా అతడి అభిప్రాయంలో మార్పు రాకపోతే మరో నెలలో మరో రుతుక్రమం గడిచిన తరువాత తలాక్ అని చెప్తారు. ఆ నె లలో కూడా అతడి అభిప్రాయం మారుతుందేమోనని వేచి చూ సే అవకాశం ఉంది. అప్పటికీ అతడి అభిప్రాయం స్థిరంగా ఉండి మూడోసారి రుతుక్రమం అయిపోయిన తరువాత మూడోసారి తలాక్ చెప్పాల్సి ఉంటుంది. ఇంకో పద్ధతి ఉన్నా స్థూలంగా ఈ ప ద్ధతినే పోలి ఉంటుంది. తలాక్ చెప్తున్న ప్రతిసారీ ఇరువురి తరఫు న ఇద్దరు సాక్షులు ఉండాలనే విషయం విస్మరించరానిది. ఈ త లాక్ చెప్తున్న మూడు నెలల కాలంలో ఆమె భర్త ఉన్న ఇంట్లోనే ఉండే అధికారం ఉంది. ఈ పద్ధతిని ఇద్దత్ అంటారు. ఇద్దత్ కా లంలో ఆమె గర్భవతిగా ఉంటే ఆ బాధ్యతంతా భర్తే చూసుకోవా లి. ఇక తలాక్ను వాట్సప్లో పంపించడం, ఫోన్లో చెప్ప డం, పోస్టు ద్వారా చెప్పడం ఒకేసారి మూడుసార్లు తలాక్ చెప్ప టం అనే అంశాలన్నీ ఇస్లాం విధానానికి పూర్తి వ్యతిరేకమే. ఇంట ర్నెట్ వచ్చిన కొత్తలో స్కైప్ ద్వారా వివాహాలు జరపడం మొదలు పెట్టారు. ఈ నికాV్ాలే ఇలాంటి తలాక్లకు తావిచ్చాయి కానీ, ఇ స్లాం పుట్టినప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేదనే విషయాన్ని మర్చి పోకూడదు. దేశంలో 15శాతం జనాభా ఉండగా ఇటువంటి వి వాహాలు 0.01శాతం జరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోర్టు చెప్పిందేమిటి?
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇస్లాంలో లేని ఒక పద్దతికి స్వస్తి చెప్పడంలాంటిదే. తలాక్ ఎ బిద్దత్ పేరుతో అసలు తలాక్ విధానాన్ని పాటించకుండా ఫాస్ట్ట్రాక్ను తీసుకొచ్చిన ప్రబుద్ధులకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుంది. ఆరు నెలలపాటు తలాక్ ఎ బిద్దత్ను రద్దు చేయాలని కూడా స్పష్టం చేసింది. కోర్టు తీర్పును అనుసరిస్తూ, ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ జరిగే తలాక్ ఎ బిద్దత్కు కళ్ళెం పడిందనుకుందాం. కానీ దీనివలన ఒనగూరిన ప్రయోజనాలేమిటో బోధపడట్లేదు. ఒకరిపై మరొకరికి ఇష్టం లేకుండానే కాపురం చేయగల్గుతారా? కోర్టు తీర్పును ఆధారం చేసుకున్న ఐదుగురు మహిళలు కూడా మళ్ళీ భర్తతో కలిసి ఉండేందుకు కానీ, అత్తామామలతో సయోధ్య కుదుర్చుకుని ఉంటామని కానీ సుముఖత వ్యక్తం చేయలేదు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఒకరు, ఉద్యోగం చేసుకుంటానని మరొకరు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు.
లింగ సమానత్వమంటే?
తలాక్ ఎ బిద్దత్ను రద్దు చేయడం ద్వారా లింగ సమాన త్వం వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. విడాకులు తీసుకోవ డంలో ఒక పద్ధతి నిలుపుదల చేయడంవల్ల లింగసమానత్వం ఎ లా వస్తుంది. మూడుసార్లు తలాక్ చెప్పిన తరువాత ఆమె అంటే ఇష్టంలేని ఆ ఇంట్లో ఆమె ఉండగలుగుతోందా? లింగ సమానత్వ విషయంపై చాలామంది ముల్లాలను అడిగినా ఒకే సమాధానం వినిపిస్తోంది. ఏ మతాల్లోనూ మహిళకు లేని గౌరవం ఇస్లాంలో కల్పిస్తుంది అని. పురుషాధిక్య భావజాలం వారితో అలా చెప్పించి ఉండొచ్చు. వారి ఉద్దేశ్యంలో ''భర్తకు విధేయురాలై ఉండడం, భ ర్త ఆస్తులకు రక్షకురాలిగా ఉండడం, భర్త ఆజ్ఞలను శిరసావహిం చడం'' వారికి ఇస్లాం కల్పించిన విశేష హక్కులట. ఇస్లాం రూపు దిద్దుకున్న సమయంలో ఈనాటి అభివృద్ధిలేదు. అందుబాటులో ఉన్న విధానాలతోనే ఇవి రూపొందించబడ్డాయి. ఏ మతంలోనై నా కాలక్రమేణా వస్తున్న మార్పులకు అనుగుణంగానే స్త్రీకి స్వేచ్ఛ లభిస్తూ వచ్చిందనే విష యాన్ని ఇక్కడ గమనంలోకి తీసుకోవా లి. ఇంతగా అభి వృద్ధి చెం దామని చెప్పుకుం టున్న ఈ తరంలోనూ గర్భస్త దశలోనే ఆడపిల్ల నలిగిపోవడం ద్వా రానే లింగ సమానత్వం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం మూఢత్వాన్ని ఇస్లామ్ మాత్రమే పెంచి పోషిస్తోందని చెప్పడం అజ్ఞానమే అవుతుంది.
రాజకీయ ప్రయోజనాలు
దేశంలో ఉన్న 15శాతం ముసల్మానులను ఆకర్షించేందుకు ప్రతిపార్టీలోనూ ఒక ప్రణాళిక ఉంటుంది. అటువంటి ప్రణాళిక బీజేపీకి కూడా ఉంటుంది. గోధ్రా అంశాన్ని ఇప్పటికీ మరువలేని ముసల్మానులకు తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదనే సంకేతా లిచ్చేందుకు ఇప్పుడు తలాక్ అంశాన్ని ఉపయోగించుకుంటున్న ది. ఇదే బీజేపీ గతంలో యూనిఫాం సివిల్ కోడ్ పేరుతో రచ్చ చే సిన విషయాన్ని మరువలేము. ఈ తీర్పు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో జరగనున్న ఎన్నికలకు ప్రచారాస్త్రమనేది నిస్సందే హం. షరియత్లో లేని విధానాన్ని అవలంబిస్తూ అదే ఇస్లాం అని చిత్రీకరిస్తున్న మిడిమిడి జ్ఞానం ఉన్న వారిని తీవ్రంగా తప్పుప డు తున్న మౌల్వీ అర్షద్ అభిప్రాయం ప్రకారం హిందూ వివాహ వ్య వస్థలోనూ ఎన్నో అంశాలున్నాయన్నారు. నూరేళ్ళు తోడుంటా న ని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమెకు చె ప్పాపెట్టకుండా పారిపోతే ఆ భార్య పరిస్థితి ఏమి టని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై న్యాయ నిపుణులు విజరు భాస్కర్ జెల్లా మాట్లాడు తూ చట్ట ప్రకారం అటువంటి స్త్రీనాలుగేండ్ల తరువాత వేరే వివా హం చేసుకోవచ్చు. 1939 యాక్టు ప్రకా రం ఆమె పోషణకు సం బంధించిన విషయంపై కోర్టు ద్వారా కోరవచ్చు. అయితే ముస్లిం మహిళలు మాత్రం అలా నాలుగేండ్లపాటు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఖులా, ఇద్దత్ సమయాల తరువాత వివాహం చేసుకునే సౌలభ్యం ఉంది అని షానవాజ్ వివరించారు.
ఇవీ కావాల్సినవి
రాళ్లూ, రప్పలు నిండిన రహదారిపై నుంచి ఒ కే ఒక చిన్న రాయిని తొలగించడంలాంటిది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. ఇస్లాంలో పురుషుడికి ఉన్నన్ని వెసులుబాట్లు స్త్రీలకు లేవు. భిన్నత్వంలో ఏకత్వమనేది భారత దేశపు ఆత్మ. ఏ దేశంలో లేని గొప్ప సంస్కృతి భారత్లో పరిఢవిల్లుతోంది. అటువంటి సమ యంలో పరమత సహనం అత్యంత ముఖ్యమైన అంశం. మిగిలి న మతాల మాదిరిగానే ఇస్లామ్ను కూడా ఆదరించాల్సిన అవస రం ఉంది. మానసికంగా ఏర్పరుచుకున్న కంచెను ఇతర మతస్తు లూ తొలగించుకోవాలి. అలాగే ముస్లింలు కూడా విశాల దృక్ప థంలో అర్థం చేసుకుని, ఈ తీర్పును అభివృద్ధికి అవకాశంగా మ లుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళలకు విస్తృత స్థాయిలో ఉన్న అవకాశాలను వినియోగించుకుని అభివృద్ధి పథంలో నడిపించాలి. ట్రిపుల్ తలాక్ తీర్పు నేపథ్యంలో కేంద్రం చట్టం చేసే దిశగా ఆలోచించాలి. ఇందుకు ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ఇస్లామిక్ సంస్థల మేధావులతో సమాలోచనలు జరపాలి. కేవలం తలాక్ ఎ బిద్దత్పై మాత్రమే కాకుండా ముస్లిం మహిళల అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకు ముస్లిం సమాజమంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-నస్రీన్ ఖాన్
సెల్ : 96524 32981
Authorization