ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 2015 ప్రకారం కేసు నమోదైన 15 రోజుల్లో జ్యూడిషియల్ కోర్టులో హాజరుపర్చాలి. నేటికీ హాజరు పర్చలేదు. తనపై పైఅధి కారులు వేధింపులకు పాల్పడుతున్నారని శ్రీకాంత్ ఉన్నతాధికారులకు గోడు విన్నవిం చుకున్నప్పుడే వారు స్పందించి ఉంటే ఓ ప్రాణం బలయ్యేదికాదు. కానీ దళితులు, సామా జిక వర్గాల పట్ల అటు పోలీసులతోపాటు, ఇటు పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నందునే ఇలాంటి ఘటనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. 'వారు దళితులని ఏమన్నా బోర్డు తగిలించుకున్నారా?' అని ఇటీవల సీఎం వ్యాఖ్యానించారంటే వందల ఏండ్ల నాటి దళితు ల బతుకులు తిరిగి రావాలని కోరుకుంటున్నారా? అనే అనుమానం కలుగుతున్నది.
దళితులు ఏ స్థాయిలో ఉన్నా కుల దురహంకార వేధిం పులకు గురికాక తప్పడం లేదు. దీనికి ఇటీవల జగిత్యాల జి ల్లా లో యువ ఇంజనీర్ ఆత్మహత్య ఘటనే నిలువెత్తు నిదర్శ నం. అసలే కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువ డక నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యం లో టీఎస్పీఎస్స్సీ నియామకాల ద్వారా ఏడాదిన్నర క్రి తం స హాయ కార్యనిర్వాహక ఇంజనీర్ (ఏఈఈ)గా ఉద్యోగం లో చే రారు. ఎంతో సంతోషంగా సాగిపోతుందనుకున్న జీవితంలో ఉద్యోగ ప్రదేశంలో పైఅధికారుల రూపంలో కుల దురహకారం వెంటాడింది. 'నీవు మాలోడివై దొరలా ప్రవర్తిస్తున్నావు రా.. పిచ్చినా కొడుకువి రా.. ఎన్ని సార్లు చెప్పాలి. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి పంపంచమని చెప్పా కదా. చేతకాదా? లేకుంటే ఇంట్లోనే కూర్చో..' అంటూ నిలబెట్టి దూషణలకు పాల్పడ్డారు. గంటల పాటు దొషిలా చాంబర్లో నిలబెట్టి కులం పేరుతో దూషిస్తూ వేధింపులకు గురిచేశారు. జగిత్యా ల జిల్లా వెల్గటూరు మండలం ఎండపెల్లి గ్రామానికి చెందిన దేవి శ్రీకాంత్(30) తల్లిదం డ్రులు పోచయ్య, శ్రీలతల ప్రథమ కుమారుడు. ఆ మండలంలోనే పీహెచ్డీ చేసిన ఏకైక వ్యక్తి. ఆయన తండ్రి పోచయ్య సింగరేణి మాజి ఉద్యోగి. శ్రీకాంత్ అందరితో కలుపుగో లుగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండేవాడు. హైదరాబాద్ లోని జేఎన్టీయూలో పీహెచ్డీ చేస్తూనే వెలువడిన నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ ద్వారా సబ్ డివిజన్ (ఆసిఫాబాద్-మంచిర్యాల పరిధిలో పీఆర్ఏఈ)లో పంచాయతీ రాజ్ శాఖలో విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు. మూడు నెలల క్రితమే వివాహమైంది.
కమీషన్ వసూలు చేయాల్సిందే
ఉన్నత లక్ష్యాలతో ఉద్యోగంలో చేరిన శ్రీకాంత్ను ఆదిలోనే పైఅధికారుల నుంచి వేధింపులు వెంటాడాయి. కాంట్రాక్టర్ల నుంచి బిల్లులు రాగానే 5శాతం, 10శాతం వసూ లు చేసి తమకు పంపించాలని కింది స్థాయి అధికారులను పైఅధికారులు వేధింపులకు గు రిచేస్తుంటారు. దీనిని కొత్తగా ఉద్యోగంలో చేరిన శ్రీ కాంత్ భరించలేకపోయాడు. తనవల్ల కాదన్నట్టు తన పని తాను చేసుకుపోతున్న శ్రీకాంత్పై ఈఈగా ఉన్న రఘువీరారెడ్డి, ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) సత్య నారాయణరెడ్డి వేధింపులను తీవ్ర తరం చేశారు. ర ఘువీరారెడ్డికి సత్యనారాయణరెడ్డి అండదండలున్న ట్టు అక్కడి ఉద్యోగులు చర్చించుకుంటారు. మామూళ్ల ను వసూలు చేయలేదని శ్రీకాంత్ను ఈఈ తన చాం బర్కు పిలిపించుకొని చీవాట్లు పెట్టేవాడు. మరికొద్ది రోజులకు ఆ చీవాట్లు కులం పేరుతో దూషిం చే స్థాయికి చేరుకున్నాయి. దీనిని శ్రీకాంత్ సహించలేక, త ట్టుకోలేకపోయాడు. ఈఈ తన చాంబర్కు పిలిపిం చుకొని దోషిలా నిలబెట్టి కులం పేరుతో దూషించడాన్ని అవమానకరంగా శ్రీకాంత్ భావించాడు. ఈ విష యమై తోటి సిబ్బందితో చెప్పుకుంటూ మదన పడ్డాడు. దీనికి పైఅధికారితో సంధి చేసుకోవడమే మేలు అంటూ తోటి సిబ్బంది ఉచిత సలహా ఇచ్చారే కాని పైఅధికారు లకు కంప్లైంట్ ఇచ్చేందుకు కలిసి రాలేదు. దీనిపై తన భార్యతో తర చూ చెబుతూ మదనపడేవాడు. తన ఆవేదనను ఎవరితో చెప్పుకున్నా ప రిష్కారం లభించకపోవడంతో ఉ ద్యోగంపై విరక్తి చెంది ఈ నెల (ఆగస్టు) 4న ఎవరికీ చెప్పకుండా బెం గళూరుకు వెళ్లిపోయాడు. అం తకుముందేఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకొని లేఖ రా సి తన జేబులో పెట్టుకున్నాడు. దీని ని గుర్తించిన భార్య శ్రీలక్ష్మి భర్తకు సర్ధిచెప్పి ఆ లేఖను చించేసింది. దీం తో ఆందోళనకు గురైన కుటుంబ స భ్యులు ఎలాగోలా ఆచూకీ కనుగొని ఇంటికి రప్పించే ప్రయ త్నం చేశా రు. గతనెల 7న రాఖీ పండుగ ఉం డడంతో 'అక్కల కోసమైనా ఇంటికి రా కొడుకా..' అంటూ తండ్రి వేడుకో వడంతో శ్రీకాంత్ మెత్తబడ్డాడు. బావలు ఇద్దరు వెళ్లి శ్రీకాంత్ను ఇంటికి తీసుకొచ్చారు. భార్య, కుటుంబ సభ్యులు సర్ధి చెప్పడంతో తిరిగి గతనెల 11న విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత గత మూడు రోజులకు సంబంధిచిన పని దినాలను సెలవులుగా పరిగణించాలని ఈఈ రఘువీరారెడ్డికి విన్నవించుకున్నాడు. కానీ ఈఈ ఇందుకు అంగీకరించలేదు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు ఎందుకు హాజరు కాలేదని హీనాతిహీనంగా తిడుతూ షోకాజ్ నోటిసు జారీ చేశాడు. ఈ సందర్భంగా పైవిధంగా కులం పేరుతో ఇష్టమొచ్చినట్టు తిట్టడం శ్రీకాంత్ను మరింత మనోవేదనకు గురిచేసింది. 'రఘువీరారెడ్డి, ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) సత్యనారాయణరెడ్డిలు ఇక నన్ను వదిలి పెట్టరు' అనే నిర్ణయానికి వచ్చి వీరి చెర నుంచి తప్పించుకోవాలంటే తనకు ఆత్మహత్యే శరణ్యం అనే భావనకు వచ్చాడు. తనకు జరిగిన అవమానాన్ని ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా తెలియజేశాడు. అదేరోజే ఇంటికొచ్చి 'ఈఈ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్న' అంటూ సూసైడ్ లేఖ రాసి జేబులో పెట్టు కున్నాడు. తన భార్యకు కూడా ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేశాడు. అనంతరం వెల్గ టూరు మండలం గుల్లకోట గ్రామ శివారులోని రోడ్డుపక్కన గల వేపచెట్టుకు ఉరి వేసు కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 'ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ వచ్చి వెళ్లాడు. అయితే ఆయన తలచుకుంటే ఈఘటనకు బాధ్యులైన ఉన్నతాధికారులు, నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులు అందరిపైనా చర్యలు తీసుకునేవారు కానీ ఆయన చుట్టపు చూపులా వచ్చిపో యార'ని శ్రీకాంత్ తండ్రి పోచయ్య వాపోయారు. ఓ దళితుడై ప్రజాప్రతినిధిగా ఉండి కూడా తమకు న్యాయం చేయలేకపోయారని ఆయన వాపోయాడు. ఈఘటన జరిగి సు మారు 15 రోజులు కావస్తున్నా ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. ప్రజాసం ఘాల ఆందోళనల నేపథ్యంలో కంటితుడుపు చర్యగా రఘువీరారెడ్డిని సస్పెండ్ చేస్తున్న ట్టు ప్రకటించారు. కానీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 2015 ప్రకారం కేసు నమోదైన 15 రోజుల్లో జ్యూడిషియల్ కోర్టులో హాజరుపర్చాలి. నేటికీ హాజరు పర్చలేదు. తనపై పైఅధి కారులు వేధింపులకు పాల్పడుతున్నారని శ్రీకాంత్ ఉన్నతాధికారులకు గోడు విన్నవిం చుకున్నప్పుడే వారు స్పందించి ఉంటే ఓ ప్రాణం బలయ్యేదికాదు. కానీ దళితులు, సామా జిక వర్గాల పట్ల అటు పోలీసులతోపాటు, ఇటు పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నందునే ఇలాంటి ఘటనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. 'వారు దళితులని ఏమన్నా బోర్డు తగిలించుకున్నారా?' అని ఇటీవల సీఎం వ్యాఖ్యానించారంటే వందల ఏండ్ల నాటి దళితు ల బతుకులు తిరిగి రావాలని కోరుకుంటున్నారా? అనే అనుమానం కలుగుతున్నది. గతంలో దళితులు గ్రామం వెలు పల ఉండి, ఊర్లోకి వెళ్లాలంటే వెనుక తాటిమట్ట, మూతికి ముంత కట్టుకొని చప్పుడు చేస్తూ వెళ్లేవారు. నేడు కూడా దళితులంటే అలాంటి గుర్తింపు ఉండాలని సీఎం కోరుకుంటురా? అని ప్రశ్నించాల్సి వస్తున్నది.
- పగడాల లక్ష్మయ్య
సెల్ : 9849868145
Authorization