ఫంక్షన్ నిర్వాహకులు సంపన్నులు కనుక వారు పోలీసుల నుండి తేలికగానే బయటపడతారు. ఎటొచ్చీ చావు వాయిద్యకారులకే. వాయిద్యకారులకు సీజన్ను బట్టే పని. ఏడాదిలో సగానికి పైగా పని ఉండదు. పని దొరికినప్పుడు ఇలాంటి చిక్కులెదురైతే, పోలీసుల వల్ల మరురోజు వాయించడానికి వెళ్లలేకపోతే కుటుంబమంతా పస్తులుండాలి. టెన్షన్తో ప్రశాంతత కోల్పోవాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం, పోలీసులు తగినంత ప్రచారంలోకి తేలేదు. అలా తేకపోవడం ఒక లోపం. ఆ లోపానికి వాయిద్యకారులెందుకు బలవ్వాలి. ఫంక్షన్ నిర్వాహకులకు పోలీసులు ఈ విషయం చెప్పాలి. పోలీసులు ఒక కరపత్రంగా సుప్రీం ఉత్తర్వులను బ్రాస్బ్రాండ్ షాపులకు, అడ్డాలకు అందచేస్తే దాన్ని వారు ఫంక్షన్ నిర్వాహకులకు ఇస్తారు. బ్యాండ్ పరికరాలమీద సమయంపై ఉన్న పరిమితులేమిటో ఫంక్షన్ నిర్వహించే వారికి కూడా తెలుస్తాయి. అవేమీ చేయకుండా, తేలిగ్గా దొరకుతారు గదా అని పోలీసులు వాయిద్యకారులపై పడటం ఎందుకు?
వాయిద్యకారులకు ఓ కొత్త సమస్య వచ్చిప డింది. రాత్రి పది దాటింతర్వాత పబ్లిక్ స్థలాల్లో వా యిద్యాలు వాయించరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులి చ్చింది. ఈ ఉత్తర్వులు వాయిద్యకారులకు, ప్రత్యేకించి బ్యాండ్ వాయించే వారికి మరిన్ని కష్టాలు తెచ్చి పె ట్టింది. సుప్రీం ఇచ్చిన ఆ తీర్పును ఎవరైనా ఆహ్వానిం చాల్సిందే. రాత్రి పది తర్వాత నిద్రపోయే సమయంలో వాయిద్యాల చప్పుడు ఎవరి కైనా ఇబ్బంది కలిగిస్తుంది. సాంప్రదాయ వాయిద్యాలకు తోడు డీజే అది సృష్టించే భరించరాని శబ్దకాలుష్యం ఎంత సహనశీ లి నయినా చిర్రెత్తేట్టు చేస్తుంది. గుండెజ బ్బున్న వారికైతే డీజెలతో గుండె జారుతు న్నట్లనిపిస్తుంది. చుట్టూ అనేక అంతస్థుల భవనాలు, మధ్యలో డీజేతో బ్యాండ్మే ళం, ఆ ప్రతిధ్వనులు భయంకరం. కనుక సుప్రీం ఉత్తర్వులు న్యాయ సమ్మతమే. వాటి అమలు అత్యవసరం.
అయితే ఈ ఉత్తర్వులను ఎలా అమ లు చేయాలి, ఎవరిమీద అమలు చేయా లి అన్నది అసలు సమస్య. పోలీసులు ప్ర జల ఫిర్యాదు మీద గానీ, స్వంత చొరవ తోగానీ రాత్రి పది దాటిన తర్వాత వా యించే వారిని పట్టుకెళ్తున్నారు. సున్నితం గా చూసుకోవాల్సిన సంగీత సాధనాలను సీజ్ చేస్తున్నారు. కేసులు బనాయిస్తున్నా రు. బెయిల్ దొరికే వరకు వాయిద్యకారు లకు చెర తప్పడం లేదు. పది దాటిన తర్వాత వాయించి ఊరేగింపు వెళ్లే వీధు ల్లోని ప్రజలందరికీ నిద్రా భంగం, ప్రశాంతకు భంగం కల్పించేది వాయిద్యకారులా? ఫంక్షన్ జరిపేవారా? పోలీసులు దీన్ని పట్టించుకోవాలి. అది జరగడం లే దు. మేము తేలికగా కన్పిస్తాం గనుక మమల్ని తీసు కెళ్లి పోలీస్ స్టేషన్లలో, చెరలో పెడుతున్నారు అని బ్యాండ్ దళాలు చెపుతున్నాయి. వారి మాటల్లో నమ్మ శక్యం గానిదేదీలేదు. బ్యాండ్ వాయిద్యకారులు నోరు లేనివారు. వారి నోరు బుగ్గలు సంగీతాన్ని పలికిస్తా యి తప్ప తమను తాము రక్షించుకోగల నాలుక ఆ నోట్లో లేదు.
హోంమంత్రి నాయని నర్సింహారెడ్డితో బ్యాండ్ వాయిద్యకారుల సంఘం ఆధ్వర్యంలో తమ కష్టాలను మొరపెట్టుకొన్నాయి. ఆయన తన సహజశైలిలో స్పందించా రు. ''మిమల్ని ఎవరయా పట్టుకెళ్లేది. ఎవ రూ ఏమీ చేయరు పోండి నేను మాట్లాడుతా ను గదా'' అంటూ భరో సా ఇచ్చి పంపారు. ఆయన ఇచ్చిన భరోసా ఆచరణలోకి రాలేదు. మంత్రి మాట చెల్లుబాటు కాలేదు కనుక తమ గోడును పోలీసు ఉన్నతాధికారుల ముందు వెళ్లబోసుకుందామంటే వారేమో సమయం ఇవ్వడం లేదు. కొత్వాల్ సాబుకు నూటొక్క పనులు. నిజమే మరి మేమెవరికి చెప్పుకోవాలి? ఇది బ్యాండ్ వాయిద్యకారుల ప్రశ్న. సామాజికంగా, రాజకీయంగా బలహీ నులైన వారిని పట్టించుకునేదెవ్వరు.
పది తర్వాత కూడా వాయించడం బ్యాం డ్ వాయిద్యకారులకీ ఇష్టముండదు. రాత్రి పొద్దుపోయేదాకా వాయించి పొద్దున్నే మరో పెండ్లికి వెళ్లి వాయించడం సులభం కాదు. బ్యాండు వాయిద్యంలో డీజే పెట్టినా కీబోర్డు పెట్టి నా సంగీతం మాయమై శబ్దం మిగులుతుంది. ఈ శ బ్దం కోసం కాదు గదా ఏండ్లతరబడి క్లార్నెట్, ట్రంపె ట్లపై సాధన చేసేది. సంగీతం సంగతి ఎలా ఉన్నా తన కుటుంబం పొట్టనింపే సంగతైతే వాయిద్యకారు డు చూసుకోవాల్సిందే కదా? ఫంక్షన్ జరిపేవాడు డీజే పెట్టమని పట్టుబడ్తాడు. సిటీల్లో నాలుగిళ్ల అవత ల ఉన్నావాడికి మనమెవరో తెలుసుకొనే ఆసక్తి ఉండ దు. నీ సంపాదనా సంపత్తి వాడికి అనవసరం. అ యినా తన సంపత్తి చాటుకోవడానికి పెండ్లి ఊరేగిం పు ఓ సాధనమని పంక్షన్ జరిపేవాడి భావన. డీజే కు తోడు చెవులు దద్దరిల్లే పటాకులు. తన సంతోషం ఇతరులకు ప్రాణసంకటం. ఇది సివిక్సెన్సుకు సం బంధించిన విషయం. ఇక బ్యాండు వాయిద్యం దగ్గరి కి వచ్చే సరికి పది తర్వాత కూడా వాయిస్తే గానీ ఒ ప్పుకొన్న డబ్బు ఇవ్వడు. హైదరాబాద్లాంటి నగరం లో వ్యాపారులు తమ అంగళ్లుమూసి ఇంటికెళ్లి శుభ్రంగా రెడీ అయి వచ్చాకగానీ ఊరేగింపు ఆరంభం కాదు. ఈ బ్యాండ్మేళంలోకి తీన్మార్కు పనికొచ్చే తాష వచ్చి చేరింది. తాష కూడా మంచి వాయిద్యమే. మంచి ఊపునిస్తుంది. గానీ దానికి వేళాపాళా ఉండా లిగా? తాష నిషాలో ఎగిరేవాడిని ఆపడం బ్యాండ్ దళం వల్ల అయ్యే పనికాదు. తాష శబ్దం పెంచుతూ వెళ్లమని వళ్లూ మరిచి ఎగిరేవాడు ఒత్తిడి చేస్తాడు. ఫంక్షన్ నిర్వాహకులూ అతన్నే సపోర్టు చేస్తారు. బ్యాండ్వాయిద్యకారుల పని అడకత్తెరలో పోకచెక్క అవుతుంది. చుట్టు పక్కల వారి ఫిర్యాదుపై పోలీసు లు ఎప్పుడు ప్రత్యక్షమవుతారో భయపడ్తూ బ్యాండు దళం వాయిస్తుండాలి. ఇదిలా ఉంటే రోడ్డుమీద వెళ్లే వాడు కూడా వచ్చి ఎగరడం మొదలెడ్తాడు. మొదలే నిషాలో ఉండే వాడికి తాష నిషా కూడా ఎక్కిందంటే వాడిని పట్టుకోవడం ఎవడితరంకా దు పోలీసులకు తప్ప. పోలీసులు వ స్తున్న సూచనలు కన్పిస్తే వాడు జా రుకొంటాడు. వాయిద్యకారులే. వారే బుక్ అవుతుంటారు.
ఫంక్షన్ నిర్వాహకులు సంప న్నులు కనుక వారు పోలీసుల నుం డి తేలికగానే బయటపడతారు. ఎ టొచ్చీ చావు వాయిద్యకారులకే. వా యిద్యకారులకు సీజన్ను బట్టే పని. ఏడాదిలో సగానికి పైగా పని ఉండ దు. పని దొరికినప్పుడు ఇలాంటి చి క్కులెదురైతే, పోలీసుల వల్ల మరు రోజు వాయించడానికి వెళ్లలేకపోతే కుటుంబమంతా పస్తులుండాలి. టె న్షన్తో ప్రశాంతత కోల్పోవాలి. సు ప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం, పోలీసులు తగినంత ప్రచారంలోకి తేలేదు. అలా తేకపోవడం ఒక లో పం. ఆ లోపానికి వాయిద్యకారులెం దుకు బలవ్వాలి. ఫంక్షన్ నిర్వాహకు లకు పోలీసులు ఈ విషయం చెప్పా లి. పోలీసులు ఒక కరపత్రంగా సు ప్రీం ఉత్తర్వులను బ్రాస్బ్రాండ్ షాపులకు, అడ్డాలకు అందచేస్తే దాన్ని వారు ఫంక్షన్ నిర్వాహకులకు ఇ స్తారు. బ్యాండ్ పరికరాలమీద సమయంపై ఉన్న పరి మితులేమిటో ఫంక్షన్ నిర్వహించే వారికి కూడా తెలు స్తాయి. అవేమీ చేయకుండా, తేలిగ్గా దొరకుతారు గ దా అని పోలీసులు వాయిద్యకారులపై పడటం ఎం దుకు? ఈ అంశంపై బ్యాండ్ వాయిద్యకారులు సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 22న ఒక సభ జరుపుకొని తమ గోడు వెళ్లబోసుకొన్నారు. బలహీ నులకు సంబంధించిన ఈ అంశంపై ప్రభుత్వం, పో లీసు ఉన్నతాధికారులు గమనించి తగిన నిర్ణయాలు చేసి వాటిని అమలు చేయాలి. 'బంగారు తెలంగాణ' లో బ్యాండోళ్ల సంకటాన్ని దూరం చేయాలి.
- ఎస్.వినయకుమార్
సెల్: 9989718311
Authorization