పెరియార్ హేతువాద భావాలు చాలా తీవ్రమైనవి. ఆయన తన ఉద్యమాన్ని కూడా అంతే తీవ్రంగా నడిపించాడు. ''దేవుని విగ్రహం గనుక ప్రజలు తాకటంతో మలినమైతే అలాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగులగొట్టి మంచి రోడ్ల నిర్మాణానికి ఉపయోగించాలి. అలా కాకపోతే నడి ఒడ్డు మీద వేసుకుంటే బట్టలుతకటానికైనా వాడుకోవచ్చు'' లాంటి మాటలు ప్రజలను కొత్త దారిలో ఆలోచించేలా చేశాయి. తీవ్రమైన విమర్శతో, పదునైన అభివ్యక్తితో తన ప్రసంగాలు, రచనలు అనేక మందిని హేతువాదులుగా మార్చాయి. 1925 నవంబర్ 23న ఆయన ప్రారంభించిన 'ఆత్మగౌరవ ఉద్యమం (సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్) విస్తృతమైన కార్యక్రమాలు చేయటం ద్వారా ప్రజల మద్దతు విశేషంగా సంపాదించగలిగింది. అందులో భాగంగానే బ్రాహ్మణులు, మంత్రాలు లేని పెండ్లీలకు రూపకల్పన కూడా చేశారు.
''మన జీవితాన్ని నడిపించే భౌతిక శక్తులేవో, వాటిని అనుకూలంగా ఉపయోగించుకునేందుకు అవసరమైన విజ్ఞానమేమిటో అందరూ గ్రహించాలి. అర్థంలేని మతవిశ్వాసాలు, కాల దోషం పట్టిన ఆచారాలు, వాటిని వ్యాప్తిలో ఉంచే సినిమాలు, సాహిత్యాలు, ఇతర క్షుద్ర కళలు, దేవుళ్లు, బాబాలు, భక్తులు, ప్రచారాలు, ఇలాంటి భూతాలు మన జీవితాలను పట్టి పీల్చి పిప్పి చేస్తున్నాయి. నాగరిక ప్రపంచంలో వీటికి స్థానం లేదు. వీటి నుంచి జాతి విముక్తి పొందటమే గొప్ప అభ్యుదయం'' అంటాడు కొడవటిగంటి కుటుంబరావు. (సంస్కృతి వ్యాసాలు, పుట 369). సరిగ్గా ఇలాంటి దృక్పథంతోనే సమాజం పట్ల గల మహత్తర బాధ్యతతో, మనుషుల మీద వల్లమాలిన ప్రేమతో సమస్త మూఢ విశ్వాసాల మీద, అర్థం లేని మతాచారాల మీద బుద్దుడి దగ్గరి నుంచి (అంతకుముందు చార్వాకుల దగ్గరి నుంచి) నేటి రావిపూడి వెంకటాద్రి దాకా పోరాడుతున్న వాళ్లు అనేకులున్నారు. ఆధునిక యుగానికి సబంధించినంత వరకు ఈ రంగంలో ప్రజలను చైతన్యవంతం చేయటం కోసం తన నిండు జీవితాన్ని దారపోసిన మొట్టమొదటి వ్యక్తి పెరియార్. ఆయన పూర్తి పేరు ఈరోడ్ వెంకట రామస్వామి నాయకర్. పెరియార్ ఆయనకు ప్రజలిచ్చిన బిరుదు. దీనర్థం పెద్ద మనిషి, ఋషి లేదా జ్ఞాని.
శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంతగా అభివృద్ధి చెందిన దశలో డేరాబాబా లాంటివాళ్లు పుట్టుకురావటం, బంగారం, డబ్బులను రెట్టింపు చేస్తామని పూజ మధ్యలో మత్తు పదార్థాలిచ్చి ఇళ్లంతా చోరీ చేయటం లాంటివి అనేకం. దేవుడి చుట్టూ అల్లుకున్న విశ్వాసాల కారణంగా ఇలాంటివి ముందుకు రావటం మనం చూస్తున్నాం. ఇప్పుడే పరిస్థితి ఇట్టా ఉంటే ఏమాత్రం చదువు, శాస్త్ర విజ్ఞానం లేని 90 ఏండ్ల కిందట ఎలా ఉండేదో ఊహించటం అంత కష్టమైన పనేంకాదు. అదిగో అలాంటి ఎడ్డి కాలంలో ప్రజలను చైతన్యం చేయటానికి ప్రధానంగా మూడు రంగాలను ఆయన ఎంచుకున్నాడు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడటం, మత విశ్వాసాలు, మూఢ నమ్మకాల వల్ల కలుగుతున్న నష్టాల మీద ప్రచారం చేయటం, స్త్రీల హక్కుల గురించి కొట్లాడటం. ఈ మూడు రంగాలకు సంబంధించినంత వరకు అపసవ్య ధోరణులన్నీ సమాజానికి బ్రహ్మణిజం నేర్పిన విలువల వల్ల ప్రతిఫలించినవే కావటం వల్ల సహజంగానే పెరియార్కు బ్రాహ్మణిజం ప్రధాన శత్రువైంది. తర్వాతి కాలంలో కాళోజీలాగే ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్లి న్యాయ పోరాటం చేసేవాడు. అయితే పెరియార్ తన జీవితకాలంలో ఎక్కువ సమయం కేటాయించింది మాత్రం హేతువాద ప్రచారోద్యమం కోసమే.
పెరియార్ హేతువాద భావాలు చాలా తీవ్రమైనవి. ఆయన తన ఉద్యమాన్ని కూడా అంతే తీవ్రంగా నడిపించాడు. ''దేవుని విగ్రహం గనుక ప్రజలు తాకటంతో మలినమైతే అలాంటి దేవుడు మనకు అవసరం లేదు. ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగులగొట్టి మంచి రోడ్ల నిర్మాణానికి ఉపయోగించాలి. అలా కాకపోతే నడి ఒడ్డు మీద వేసుకుంటే బట్టలుతకటానికైనా వాడుకోవచ్చు'' లాంటి మాటలు ప్రజలను కొత్త దారిలో ఆలోచించేలా చేశాయి. తీవ్రమైన విమర్శతో, పదునైన అభివ్యక్తితో తన ప్రసంగాలు, రచనలు అనేక మందిని హేతువాదులుగా మార్చాయి. 1925 నవంబర్ 23న ఆయన ప్రారంభించిన 'ఆత్మగౌరవ ఉద్యమం (సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్) విస్తృతమైన కార్యక్రమాలు చేయటం ద్వారా ప్రజల మద్దతు విశేషంగా సంపాదించగలిగింది. అందులో భాగంగానే బ్రాహ్మణులు, మంత్రాలు లేని పెండ్లీలకు రూపకల్పన కూడా చేశారు.
సకల మూఢ విశ్వాసాలకు కారణం మతం పేరిట చలామణిలో ఉన్న గ్రంథాలే. ఆ కారణంగానే పెరియార్ రామాయణాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. దాన్ని ఆయన బూటకమైన, చిత్రవిచిత్రమైన ఒక చెత్త చరిత్ర అనేవాడు. అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేసిన విధంగానే పెరియార్ రామాయణ గ్రంథాన్ని కాలబెట్టాడు. ఒక వర్గం వారికి సమస్త ఆధిపత్యాలను ధారాదత్తం చేస్తూ శూద్రులు, అతిశూద్రుల పేరిట 95 శాతం ప్రజలకు ఏవిధమైన హక్కులు లేకుండా చేసి వాళ్లు కుక్కలు, కాకులతో సమానమన్న.. ఒక విధంగా జంతువుకంటే తక్కువ చేసి చూపిన అలాంటి పుస్తకాలకు వాళ్ల చేతుల్లో తగిన గుర్తింపే లభించింది. భావజాల పరంగా పెరియార్, అంబేద్కర్లు దాదాపు ఒకే కుదురుకు చెందిన వారు. 1924-25లలో కేరళ రాష్ట్రంలోని వైక్కాం దేవాలయ పరిసరాల్లోకి నిమ్న కులాల వాళ్లను అనుమతించకపోవటం వల్ల జరిగిన పోరాటంలోనూ ఇలాంటివే ఇతర రెండు మూడు సంఘటనల నేపథ్యంలోనూ గాంధీ బ్రాహ్మణీయ భావజాలాన్ని సమర్థిస్తూ వ్యవహరించటం వల్ల పెరియార్ గాంధీ నుంచి దూరమవ్వటమే కాకుండా ఆయన నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా విడిచిపెట్టాడు. అంబేద్కర్ కూడా గాంధీ భావాలతో తీవ్రంగా పోరాడిన విషయం అందరికీ తెలిసిందే.
పెరియార్ తాను పుట్టిన తమిళనాడుతోపాటు దేశమంతా ముఖ్యంగా దక్షిణ భారతదేశమంతా తిరిగి హేతువాద, నాస్తిక భావాలను ప్రచారం చేశాడు. ఉత్తర భారతీయులు దక్షిణ ప్రాంతమ్మీద చూపిస్తున్న అనేకరకాల వివక్షలకు వ్యతిరేకంగా ఆయన పోరాటాలు లేవనెత్తాడు. దక్షిణ భారతదేశమ్మీద హిందీ భాషను బలవంతంగా రుద్దటానకి వ్యతిరేకంగా పోరాడాడు. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా దక్షిణ భారతీయులందరినీ ఐక్యంగా ఉంచటానికి ఆయన పడిన శ్రమ చాలా గొప్పది. అందుకోసం 1921 నుంచి అత్యంత క్రీయాశీల రాజకీయాలు నెరుపుతున్న జస్టిస్ పార్టీ పేరు మార్చి 1944 ఆగస్టు 27న 'ద్రవిడ కజగం'గా సాస్కృతిక రంగానికి మాత్రమే పరిమితం చేశాడు. అనేక సందర్భాలలో తనకు రాజకీయాధికారం కంటే సంస్కరణోద్యమాలే ప్రధానమని ప్రకటించాడు పెరియార్. ఇలాంటి అరుదైన వ్యక్తిని గౌరవిస్తూ ఐక్య రాజ్య సమితి అనుబంధ విభాగం విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ 1970 జూన్ 27న అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి త్రిగుణసేన్ ద్వారా సన్మాన పత్రాన్ని బహూకరింపజేసింది. అందులో పేర్కొన్న విధంగానే పెరియార్ 'నవయుగ ప్రవక్త, ఆగేయాసియా సోక్రటీసు, సంఘ సంస్కరణా పితామహుడు. అజ్ఞానానికి, మూఢనమ్మకాలకు, అర్థరహితమైన ఆచార సాంప్రదాయాలకు ఆగర్భశత్రువు.
సెప్టెంబర్ 17 పెరియార్ జయంతి
- తోకల రాజేశం
సెల్ : 9676761415
Authorization