విద్యాలయం అంటేనే విజ్ఞానం. పిల్లలను సన్మా ర్గంలో నడిపే మహావృక్షం. వారు వేసుకునే యూనిఫాం పేద, మధ్య తరగతి అంతరాలు లేవని చెప్పేందుకే. చిన్నతనంలో పిల్లలది కల్మషం లేని హృదయం. ఉదయమే పాఠశాలకు వచ్చి చదువుకుని, ఆడుకుని, పా డుకుని ఇంటికెళ్లడమే వారి లోకం. మరే ప్రపంచంతో వారికి సంబంధం లేదు. పలకా, బలపం మాత్రమే తె లుసు. అంటరానితనం, వివక్ష అనే పెద్ద మాటలు వారి కి అర్థం కావు. అలాంటి పాఠశాలలో విద్యార్థులకు కుల, మతాలు లేవని చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కులం అనే బీజం నాటాడు. మనుషులంతా ఒక్కటేనని చెప్పా ల్సిందిపోయి మానవత్వం మరిచాడు. 'దళిత కులంలో పుట్టావు.. నీకు చదువు రాదు' అని చితకబాదాడు. దీం తో విద్యార్థి స్పృహ కోల్పోయాడు. విద్యా బుద్ధులు నేర్పి చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పడంతో విద్యార్థి సంఘా ల నాయకులు ఆందోళన చేశారు. ఉపాధ్యాయుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల ని డిమాండ్ చేశారు.
అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామ దళిత కులానికి చెందిన లింగాల బాబు-భీమా దంపతులకు జాని(14), జశ్వంత్ (11) కుమారులు. బాబు వికలాంగుడు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కూలీ పనులకు వెళ్తూ జీవిస్తున్నారు. ప్రయివేటులో పిల్లలను చదివించే స్థోమత లేదని హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు ఎస్సీ కులానికి చెందిన వారని చెప్పి అడ్మిషన్ ఇవ్వలేదు. తండ్రి ఎంఈఓకు మొరపెట్టుకోగా అవకాశమిచ్చారు. ఇది మనసులో పెట్టుకున్న హెడ్మాస్టర్ విద్యార్థులను పలుమార్లు కులం పేరుతో దూషిస్తూ చితకబాదాడు. ఆ ఊరికి బస్సు సౌకర్యం సరిగా లేదు. దీంతో విద్యార్థులు కొన్నిసార్లు పాఠశాలకు వెళ్లలేకపోయేవారు. ఆగష్టు 10న జానీని 'మీరు ఎస్సీలురా.. బడికి సక్కగ రారురా..చెబితే వినరురా.. చెప్పినా సదువు రాదురా.. మీతోటి తలకాయ నొప్పి ఉంటదిరా.. పక్క స్కూల్లో ఎస్సీ హెడ్మాస్టర్ ఉంటదిరా.. అక్కడ సదువుకోరా..ఇక్కడ సీటు లేదురా..' అని దూషిస్తూ విచక్షణా రహితంగా కొట్టడంతో విద్యార్థి స్పృహ కోల్పోయాడు. తోటి విద్యార్థుల ముందు తక్కువ కులంలో పుట్టావని తిట్టడంతో విద్యార్థి స్కూల్కు వెళ్లనంటున్న పరిస్థితి. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని మరుసటిరోజు విద్యార్థి తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. డీఈఓకు, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశాడు.
ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకుని అధికారులు అసలు కులమనేది లేదని, అందరూ సమానమని విద్యార్థులకు అవగాహన కల్పించకపోవడం సరికాదనే చర్చ తల్లిదండ్రుల్లో నడుస్తోంది. సమస్యను మొగ్గలోనే తుంచకపోవడంతో ఆయన నాటిన కులభీజం ఇప్పుడు విద్యార్థుల్లో ఊడల మర్రిలా నాటుకుపోయింది. సదరు ప్రధానోపాధ్యాయుడు స్కూల్లో 'అరెరు మంగలోడా, సాకలోడా, మాదిగోడా, తెనుగోడా' అని తిడుతున్నట్టు ఇతర బాధిత విద్యార్థులు చెప్పడం చూస్తే కుల వివక్షను అర్థం చేసుకోవచ్చు. ఘటన జరిగి రెండున్నర నెలలు గడుస్తున్నా కలెక్టర్ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉందని, విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఈఘటనపై మానవహక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల డ్రెస్ కోడ్ను కూడా మార్చాడు. రాష్ట్రమంతా ఏకరూప దుస్తులు ఒకేలా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ప్రయివేటు స్కూల్ మాదిరిగా యూనిఫాంను తనకు నచ్చిన రంగుతో మార్చడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు అదనపు భారమైంది. ఇవన్నీ చూస్తున్నప్పటికీ మండల విద్యాధికారి పట్టించుకోలేదనే విమర్శ పలువురిలో వ్యక్తమవుతోంది.
ఏడ్చినా హెడ్మాస్టర్ పట్టించుకోలేదు...
పిల్లలను ప్రయివేటు స్కూల్లో చదివించే ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్తే హెడ్మాస్టర్ పట్టించుకోలేదు. ఎస్సీలను జాయిన్ చేసుకోము అని చెప్పాడు. చేతులు జోడించి ఏడ్చినా వినలేదు. దీంతో ఎంఈఓ సారును కలిస్తే పిల్లల్ని తీసుకున్నడు. అప్పటి నుంచి పిల్లల్ని రోజూ కులం పేరుతో దూషిస్తూ కొడుతున్నడు. తక్కువ కులపోల్లమని హేళన చేసిన పెద్ద సారుపౖౖె చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి.
- లింగాల బాబు, విద్యార్థి తండ్రి, పోతారం(జే)
అందరి ముందట తిట్టిండు...
స్కూల్లో జాయిన్ అయిదామని వెళ్లిన రోజే 'మీది ఏం కులం అని' హెడ్మాస్టర్ అడిగిండు. మా నాయినమ్మ చనిపోతే స్కూల్కు వెళ్లనందుకు కులం పేరుతో అందరి ముందట తిట్టి కొట్టిండు. తోటి విద్యార్థులను కూడా కులం పేరుతో కోపనికస్తడు. పాఠశాలకు వెళ్దామంటేనే భయమైతంది.
లింగాల జాని, బాధిత విద్యార్థి, పోతారం (జే)
పై అధికారులకు నివేదించాం...
కులం పేరుతో దూషించిన విషయమై స్కూల్లోనే విచారణ చేశాం. విద్యార్థి, తండ్రితో మాట్లాడి రికార్డు చేశాం. హెడ్మాస్టర్పై ఎస్ఐ ఇచ్చిన రిపోర్టును కూడా జత చేశాం. డీఈఓ, కలెక్టర్ చూడాల్సి ఉంది. స్కూల్లో కులం పేరుతో దూషించడమనేది సరికాదు. దీనిపై ఉన్నతాధికారులు చెప్పినట్టు చేస్తాం.
శ్యాంప్రసాద్రెడ్డి, ఉప విద్యాధికారి, సిద్దిపేట జిల్లా
- ఎన్.అజయ్కుమార్
Authorization