నేడు అంబేద్కర్ను ప్రపంచమంతా కీర్తిస్తున్నా మన దేశంలో అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. దేశంలో ని మ్నజాతుల బతుకులు బాగు పడాలని, ఆర్థికంగా, సామాజి కంగా, రాజకీయంగా ఎదగాలని ఆయన ఎంతో కృషి చేశారు. ప్రపంచ మేధావుల్లో ఒకరుగా పేరుగాంచినా ఆయన ఎన్న డూ తన స్వలాభం కోసం ప్రయత్నించలేదు. తన జీవితమం తా నిమ్నజాతుల అభివృద్ధి కోసమే ధారపోశాడు. అలాంటి అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్ఠించడాన్ని కూడా నేడు అగ్ర కులాలు సహించటం లేదు. నా భవనం ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టొదని అడ్డు తగలడమే కాదు, ఆవిష్కరణకు సి ద్ధం చేసిన విగ్రహాన్ని 24 గంటలు గడువకముందే తొలగిం చారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే. కోటి ఆశలతో కొత్త రాష్ట్రాన్ని సాధించుకున్న మన రాజధాని నడిబొడ్డున జరిగిందీ సంఘటన.
హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి డివిజన్ పరిధి న్యూ హఫీజ్పేట ప్రేమ్నగర్లోని దళితులు ఆ కాలనీలో అం బేద్కర్ దిమ్మెకు ఓ బొమ్మను, అశోక చక్రం జెండాను ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి సభలు నిర్వహి స్తున్నారు. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించా లని స్థానిక దళితులు నిర్ణయించుకున్నారు. అయితే ఆ రోడ్డు పక్కన నాలాకు అవతలివైపు ఉన్న ప్రభుత్వ భూమిని బీసీ కులానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ఆ స్థలంలో భవన నిర్మాణ పనులకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఇ క్కడ నిర్మాణ పనులకు సైతం ఎలాంటి అనుమతులు తీసుకో లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమ కట్టడాలు.. ఆపై బడాయి పోకడలు
అగ్రకులానికి చెందిన వ్యక్తి ప్రేమ్నగ ర్లో సుమారు 400 చదరపు గజాల ప్ర భుత్వ భూమిని కబ్జా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని పక్కనే ఉన్న నాలా స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. అయి తే తాను నిర్మాణ పనులు చేపట్టబోయే భవ నం ముందు అంబేద్కర్ బొమ్మ ఉండటాన్ని ఇష్టపడని సదరు కబ్జాదారు ఎలాగైనా ఆ దిమ్మెను తొలగించాలని కుట్ర చేశాడు. గత ఫిబ్రవరి 2న అంబేద్కర్ విగ్రహాన్ని తెచ్చి దిమ్మెపై పెట్టి ఓ పక్క ప్రతిష్ఠాపనకు, ఆవి ష్కరణకు ఏర్పాట్లు చేస్తుండగా అదే రోజు రాత్రి అక్రమ నిర్మాణదారుడైన అగ్రకులస్తు డు ఆ బొమ్మను తొలగించి, దిమ్మెను జేసీబీ తో కూల్చివేశాడు. దీనిపై ఆగ్రహించిన సా మాజిక సంస్థలు, స్థానిక నాయకులు రో డ్డుపై రాస్తారోకో నిర్వహించి తమకు న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. ఎ లాంటి అనుమతులు లేకుండా అగ్ర కులా నికి చెందిన వ్యక్తి అక్రమ నిర్మాణం చేప డుతూ అణగారిన వర్గాలను అవమానించే విధంగా అంబేద్క ర్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని నిరసించారు. కానీ పోలీసులు మాత్రం దళితులపైనే కేసు నమోదు చేశారు.
న్యాయం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న ఆక్రమణదారుడు, అగ్రకులస్తుడిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా అధికారులు, పోలీసులు స్పందించటం లేదు. చివరికి జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసినా న్యాయం జగరలేదని స్థానిక దళిత నాయకులు ఆందోళన చెందుతున్నారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా న్యాయం కోసం పోరాడుతున్న తమపైనే అక్రమంగా కేసులు బనాయించడం ఏమిటని అక్కడి దళితులు ప్రశ్నిస్తున్నారు. అక్కడి దళితులు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు, పోలీసుల వద్ద సరైన సమాధానం లేదు. అందుకే సుమారు 9 నెలలుగా న్యాయం కోసం పోరాడుతున్నా అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావటం లేదు. కనీసం అక్కడి దళితులకు జరుగుతున్న అన్యా యంపై ఏ అధికారి కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. పైగా అక్కడ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, ఎలాంటి అనుమతు లు లేకుండా బహుల అంతస్తు నిర్మాణం జరగుతుందని ఆధారా లతో సహా అధికారులకు ఫిర్యాదు చేసి నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిని బట్టి ఆ కబ్జాదారు డికి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని స్థానికులు విమర్శలు గుప్పి స్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారు లు స్పందించి భారత రాజ్యాంగ నిర్మాత డా|| బిఆర్.అంబేద్కర్ విగ్రహా న్ని అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని దళిత సంఘాలు, స్థానిక నాయకులు కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలి
అక్రమ భవన నిర్మాణాన్ని ఆపాలని, తహశీల్దార్కు, జీహెచ్ఎంసీ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి అగ్రకులస్తుడు చేపడుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలి. అతనిపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతించాలి.
ఎం.సంతోష్, షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నాయకులు
ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి
న్యూ హఫీజ్పేట్ ప్రేమ్నగర్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. దళితులపై అక్రమంగా బనాయించిన కేసులను భేషరతుగా ఎత్తివేయాలి. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం.
హనుమంతరావు, ప్రేమ్నగర్ బస్తీ నాయకులు
అధికారులు సహకరించాలి
అగ్రకులస్తుల వైఖరిపై డిప్యూటీ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందించాం. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు అధికారులంతా సహకరించాలి. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. ప్రైవేటు వ్యక్తులే విగ్రహ ప్రతిష్ఠాపనను అడ్డుకుంటున్నారు. దళితులంతా ఐక్యంగా ఉన్నారు. అధికారులు సహకరించాలి.
పి.శోభన్, సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు
రాస్తారోకో చేసినందుకే కేసులు
స్థానిక దళితులపై కేసులు పెట్టిన మాట వాస్తవం. వారు రోడ్డుపై రాస్తారోకో చేసి ట్రాఫిక్కు ఇబ్బందులు సృష్టించినందుకే కేసులు నమోదు చేశాం. అంబేద్కర్ విగ్రహం విషయంలో మేము వారిని వ్యతిరేకించటం లేదు. నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తెచ్చుకుంటే విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తాం.
హరిచందర్రెడ్డి, సీఐ మియాపూర్
ఓగోటి కిరణ్కుమార్
సెల్ : 9666011107
Authorization