వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలోగానీ సాహిత్యంలోగానీ ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో హిందూ అనే పదమే కనిపించదు. కాబట్టి హిందూ అన్న పదం గానీ, హిందూజాతి అన్న పదాలు గానీ పూర్తిగా కల్పితమైనవి. ఈ మనువాద రాజకీయాలకు బీజాలు 1925లోనే పడ్డాయి. ఆనాటి ఆర్ఎస్ఎస్ నాయకుడు గోల్వాల్కర్ హిందూ జాతిని, హిందూ మతాన్నీ, హిందూ సంస్కృతినీ భారతదేశంలో ఉన్నవారంతా ఖచ్చితంగా స్వీకరించాలనీ అలా స్వీకరించడానికి నిరాకరించినవారు విదేశీయులుగా పరిగణించబతారనీ లేదా హిందూ జాతికి తప్పకుండా లొంగి ఉండాలని ప్రకటించాడు. నేడు దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు రోజోరోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వేల సంత్సరాలుగా ఈ అగ్రకుల హిందూ మతోన్మాదుల చేతుల్లో దాడులకు గురవుతూనేఉన్నారు. ప్రస్తుతం ఆ దాడుల రూపాలు మారుతున్నవి అంతే తేడా. ఒక వైపు అంబేద్కర్ జయంతులను నిర్వహించడానికి పోటీపడుతున్న కొన్ని రాజకీయ పార్టీలు ఒక్క రోజైనా ఈ దాడుల మీద స్పందించలేదు. అంబేద్కర్పై కపట ప్రేమను చూపిస్తున్నారు. ఈ చరిత్రలో మాయని గాయాలెన్నో ఉన్నవి.
''పోరాటం మరింత పోరాటం, త్యాగం మరింత త్యాగం, ఇదేనాసందేశం, త్యాగాలను బాధలను లెక్కచేయని పోరాటం, మరింత పోరాటం ఒక్కటే మీకు విముక్తి కలిగిస్తుంది. ఇంకేది చేయలేదు''.
-డా||బి.ఆర్.అంబేద్కర్
డిసెంబర్, 25, 1927భారతదేశ చరిత్రలో చారిత్రాత్మకమె ౖన రోజు. బ్రాహ్మణవాద రాజ్యాంగమైన మనుస్మతిని సరిగ్గా 88 సంవత్సరాల క్రితం ఇదే రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తగులబె ట్టారు. అంటరానివారికి, శూద్రులకు చదువునూ, సంపదనూ, సమానత్వాన్నీ, హక్కులనూ నిరాకరించి బానిసత్వం, బహిష్క రణలతో మనిషిని మనిషిగా చూడని ఈ హైందవ సమాజాన్ని నిలదీసారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రుత్వంలను నిషేధించి న మనుధర్మశాస్త్రాన్ని తగులబెట్టారు. ఈకుల వ్యవస్థలకు కారణ మైన హిందూమత పునాదులను ధ్వంసం చేసే వరకూ శూద్రు లు, అంటరానివాళ్ల బతుకులు మారవన్నారు. అందుకే 1935 సంవత్సరంలో ''నేనుహిందువుగా పుట్టాను కానీ హిందువుగా మాత్రం మరణించకూడదని నిశ్చయించుకున్నాను'' అని ప్రకటిం చారు. అందుకే బాబాసాహెబ్ తన జీవిత చరమాంకంలో బ్రహ్మ ణులపైన, హైందవంపైన తిరుగుబాటు చేసి ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం, సౌబ్రాత్రుత్వాన్ని ప్రకటించిన బుద్ధిజాన్ని స్వీకరిం చారు. వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలోగానీ సాహిత్యం లోగానీ ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో హిందూ అనే పదమే కనిపించదు. కాబట్టి హిందూ అన్న పదం గానీ, హిందూజాతి అన్న పదాలు గానీ పూర్తిగా కల్పితమైనవి. ఈ మనువాద రాజకీయాలకు బీజాలు 1925లోనే పడ్డాయి. ఆనాటి ఆర్ఎస్ఎస్ నాయకుడు గోల్వాల్కర్ హిందూ జాతిని, హిందూ మతాన్నీ, హిందూ సంస్కతినీ భారతదేశంలో ఉన్నవారంతా ఖచ్చితంగా స్వీకరించాలనీ అలా స్వీకరించడానికి నిరాకరించిన వారు విదేశీయులుగా పరిగణించబతారనీ లేదా హిందూ జాతికి తప్పకుండా లొంగి ఉండాలని ప్రకటించాడు.
నేడు దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు రోజోరోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వేల సంత్సరాలుగా ఈ అగ్రకుల హిందూ మతోన్మాదుల చేతుల్లో దాడులకు గురవుతూనేఉన్నారు. ప్రస్తుతం ఆ దాడుల రూపాలు మారుతున్నవి అంతే తేడా. అంబేద్కర్ రింగ్టోన్ పెట్టుకున్నాడ ని సాగర్ అనే యువకుడిని చంపిన ఘటన మనం మహారాష్ట్ర లో చూసాం. ఒక వైపు అంబేద్కర్ ఇల్లు కొంటూ, బుద్ధగయను సందర్శిస్తూ, అంబేద్కర్ జయంతులను నిర్వహించడానికి పోటీపడుతున్న ఈ రాజకీయ పార్టీలు ఒక్క రోజైనా ఈ దాడుల మీద స్పందించలేదు. అంబేద్కర్పై కపట ప్రేమను చూపిస్తున్నా రు. ఈ చరిత్రలో మాయని గాయాలెన్నో ఉన్నవి. చుండూరు దళితులపై దాడిచేసిన హంతకులను నిర్దోషులుగా విడుదల చేయడంలో న్యాయవ్యవస్థలో కూడా ఎంత కుల వివక్ష దాగి ఉందో అర్థమవుతుంది. హర్యానాలో జితేందర్ అనే దళిత యువకుడిని సజీవ దహనం చేసే ఉద్దేశంతో అతడి ఇల్లు తగుల బెట్టారు. అతని ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ విషయంపై వి.కె.సింగ్ను మీడియా వివరణ కోరగా ''కుక్కలు చనిపోతే నేను స్పందించాలా?'' అని అన్నాడంటే ఈ అగ్రకుల దురహంకారం ఎంత ఉన్నదో అర్డంచేసుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరెలో దళిత రచయిత హుతంగి ప్రసాద్ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పుస్తకం రాసినందుకు అతనిపై దాడిచేసి చేతివేళ్లు నరకడానికి ప్రయత్నించారు. తెలంగాణలో నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో కులాంతర వివాహం చేసుకున్నారని కూతురిని నరికి చంపారు. ఆంధ్రప్రదేశ్ దేవరంపాడులో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూమిని దౌర్జన్యంగా అక్రమంగా అనుభవిస్తూ వారి పొలాల్లో పంటను తొక్కించడమే కాకుండా మిగిలిన పంటను కోసుకుందామని వెళ్లిన వారిపైన రెండు ట్రాక్టర్ల మనుషులతో దాడి చేయించాడు. మధ్యప్రదేశ్లో దళిత యువకుడు తన పెండ్లిలో గుర్రం ఎక్కాడనే కారణంతో అగ్రకులాల వాళ్లు రాళ్లతో దాడిచేశారు. చిగురుమామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో దళితులు వండిన మధ్యాహ్నభోజనం తినమని పిల్లలు రోజూ స్కూల్ నుండి వెళ్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో పద్నాలుగేండ్ల దళిత బాలికపై అత్యాచారం, రోడ్డుపై వెళితే నీడపదిందని బాలికపై దాడులు, హర్యానాలోని దౌలత్పూర్లో యువకుడి సజీవదహనం, తమిళనాడులోని మధురైలో దళితులు గుడిలో పూజచేసారని, లక్షింపేట దళితులపై భూమికోసం దాడులు ఇలా రాసుకుంటూ పోతే పేజీలు చాలవేమో. ఒకవైపు రాజ్యాంగమే మాకు స్ఫూర్తి అని చెబుతూనే మనువాదులు ఆ రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. రాజ్యాంగాన్ని మార్చాలని లేక ఆ రాజ్యాంగం స్థానంలో మతగ్రంధాలను పెట్టాలనుకుంటున్న వారు ఈ దేశాన్ని హైందవీకరించాలనుకుంటున్నారు. గోవింద్ పన్సారే, దబోల్కర్, కల్బుర్గి ఇంకా ఇతర రచయితలను, ఉద్యమకారులను చంపుతున్నారు. తినే తిండిమీద ఆంక్షలు విధిస్తూ దాడులు చేస్తున్నారు. దాద్రిలో అఖ్లాక్ అనే వ్యక్తిని ఆవు మాంసం తిన్నాడని నిందలు మోపి మరీ చంపారు. జమ్మూ కాశ్మీర్లో రషీద్ అనే ఎమ్మెల్యేను అసెంబ్లీ సాక్షిగా కొట్టారు. హర్యానాలో ఐదుగురు దళితులను వాళ్ల వత్తిలో భాగమైన ఆవు చర్మాన్ని వలుస్తున్నారని రాళ్లతో కొట్టి, తల్వార్లతో నరికి చంపారు. ''బీఫ్ తింటాను'' అని ప్రకటించినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యను తలనరుకుతామంటూ బహిరంగంగా ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీలో దళిత బహుజనుల ఆహారమైన పెద్దకూర తింటామంటే తల్వార్లతో దాడిచేస్తామని, దాద్రీఘటన పునరావతమవుతుందని ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోగా పెద్దకూర పండుగనే అడ్డుకున్నారు.
ఇక విశ్వవిద్యాలయాలపై దాడి చేస్తున్న తీరును మనం అర్థం చేసుకోవచ్చు. 2004లో హెచ్సీయూలో పదిమంది దళిత విద్యార్థులను నిషేధించారు. ఈఎఫ్ఎల్యూలో ముగ్గురు విద్యార్థుల నిషేధం. మద్రాస్ ఐఐటీలోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్పై నిషేధం, హెచ్సీయూలో అంబే ద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్కు చెందిన ఐదుగురు విద్యా ర్థులపై నిషేధం విధించాయి. ఆధునిక అగ్రహారాల్లాంటి ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలల్లో విద్యార్థులపై వివ క్షను తట్టుకోలేక జరుగుతున్న ఆత్మహత్యలకు లెక్కేలేదు. ఈ మనువాదుల కండ్లు ఇప్పుడు రిజర్వేషన్స్ మీద పడ్డా యి. ఇస్తే మాకూ ఇవ్వండి లేదా అందరికీ తీసివెయ్యండని గగ్గోలుపెడుతున్నారు. దేశమంతా వ్యాపారరంగంలో విస్తరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉన్న కాస్తోకూస్తో రిజర్వేషన్స్ కూడా తీసెయ్యాలని అంటున్నారు. పరిశ్రమలు, గనులు, వ్యవసాయ, కాంట్రాక్టు, వైద్యం, విద్య,రక్షణ,సైన్సు మరియు టెక్నాలజీ మొదలైన రంగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వాటాలు ఎంతో లెక్కతీయవలసిన అవసరం ఉంది. ఇంకా వీటిలో సమాన వాటా కోసం పోరాడవలసిన అవసరం ఉంది.ఇక రాజకీయాధికారం గురించి మాట్లాడితే ఇప్పటివరకు ఎన్నికైన దళిత నాయకులు 63 సంవత్సరాల పార్లమెంట్ చరిత్రలో దళితుల సమస్యలపై మాట్లా డింది చాలా పరిమితం. సంవత్సరానికి కొన్ని వేల సంఖ్యలో దాడులు జరుగుతూ, హత్యలకూ, మానభంగాలకు గురవుతుంటే మాట్లాడలేని ఈ బానిసలను చెంచాలు అంటారు. ప్రయివేటై జేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పేరు మీద ఈ దేశాన్ని ప్రపంచానికి తాకట్టు పెట్టడంతో పెల్లుబెక్కిన ఆందోళనలు ఇంకోవైపు పెరుగుతున్న ఈ చైతన్యాన్ని జీర్ణించుకోలేని ఈ అగ్రకుల పెట్టుబడిదారులు ప్రజల చైతన్యాన్ని అడ్డుకోవడానికి మతం అనే అయుధంతో అడ్డుకట్ట వేయడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజైన డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసి చరిత్రలో దాన్ని బ్లాక్ డేగా చేసారు. అంటే ఈ మనువాదులు ఎంత పక్కాగా వ్యక్తులపై, భావజాలాలపై దాడులు చేస్తారనేది ఈ సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలను మతీకరణ చేసే ప్రయత్నాలు రోజురోజుకూ ముమ్మరమవుతున్నాయి. రాజ్యాంగమే మన పవిత్ర గ్రంధం అంటూనే రాజ్యాంగంలోని 'లౌకిక' అన్న పదం తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో మొత్తం రాజ్యాంగాన్నే మార్చాలన్న కుట్రను మనం మర్చిపోరాదు.
ఒకప్పుడు దళిత, బహుజనులు చదివితే నాలుక కోసిన, వింటే చెవుల్లో సీసం పోసిన మనువాదం ఇప్పుడు చదువుకుం టున్న వారిని విశ్వవిద్యాలయాల నుండి నిషేధిస్తున్నది. మేము చెప్పిందే తినాలి, మాకు నచ్చిందే రాయాలి లేదా రాస్తే చేతులు నరుకుతాము కుదిరితేమనుషులనే చంపుతాము అంటూ ఆధునిక మనువాదాన్ని అమలు పరచాలనుకుంటున్నారు. ఆ రోజు స్త్రీల హక్కులను, స్వేచ్ఛను నిషేధించిన మనువాదం ఈ రోజు స్త్రీలపై దాడులకు, అత్యాచారాలకు, నగంగా ఉరేగింపులకు పాల్పడుతున్నది. మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరం అంటారు కానీ ఈ దేశంలో ఇన్ని దాడులు జరుగుతున్నా కొంతమంది మేధావులు మాట్లాడరు. ఎందుకంటే ఆ మేధావులకూ కులం ఉంది. అందుకే కులం పేరున జరిగే దాడులకు స్పందించరు. ఈ రోజు సంస్కతి, సాంప్రదాయం అనే నినాదం మీద హిందుత్వశక్తులు పుంజుకుంటున్నాయి. అంబేద్కర్ కూడా సంస్కతి, సాంప్రదాయాల గురించి చెప్పాడు కానీ అంబేద్కర్ చెప్పిన సంస్క తి ప్రజాస్వామ్యమైనది, సాంప్రదాయాలు హేతుబద్దమైనవి.
ఎక్కడైతే ప్రజల హక్కులు హరించబడతాయో అక్కడ అంబేద్కర్ సిద్ధాంతాల అవసరం ఏర్పడుతుంది. యూరప్లోని జిప్సీలుగా పలవబడే నల్లజాతి రోమాలు బానిస బతుకు విముక్తి కోసం, గాజా హక్కుల కోసం, వర్ణ వివక్ష ఎదుర్కొంటున్న అమెరికా నల్లజాతీయుల సమానత్వం గురించి మనం అంబేద్కర్ రచనల నుండి, అయన జీవిత పోరాటాల నుండి అర్థం చేసుకోవచ్చు. ఆయన అనుచరులు అనుసరిస్తున్న మార్గాలు, గమ్యాలు గందరగోలంగా తయారయ్యాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియాలో కులం, అంటరానితనం, అసమానత్వాన్ని నిర్మూలించడం కోసం సామాజిక, సాంస్కతిక విప్లవ అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అంబేద్కర్ రచనలు నేటి దళిత, ప్రజాస్వామ్య ఉద్యమాలకు అనుసంధానించి విశ్లేషనాత్మకంగా అధ్యయనం చేయాలి. పసిపిల్లల నుండి పండు ముసలి వరకు మనువాదం వాళ్ల మెదళ్లలో పేరుకుపోయింది. మనువాదం కాగితాల్లో కాదు ప్రజల మెదళ్లలో తగులబడాలి. నేడు మనువాదం పరిశ్రమ. పాలనా, మేధో రంగాలలో విస్తరించి ఉంది. మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి.
- మట్టా క్రిష్ణయ్య
సెల్ : : 9866338308
Authorization