ఎన్ని ప్రభుత్వాలు మారినా అడవి బిడ్డలకు కనీస సహకారం అందడం లేదు. ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చే నాయకులు ఆ తర్వాత ముఖం చాటేయ డమే ఇందుకు కారణం. దీంతో ఏ దిక్కూలేని జీవచ్ఛవా లుగా అడవి బిడ్డలు జీవనం సాగిస్తున్నారు. కనీసం అనారోగ్యాల బారిన పడిన సందర్భంలోనూ మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం కూడా వారికి లేని దుర్భ ర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అడవి ఆడ తల్లులు గర్భం దాల్చితే వారు నరకం అనుభవిస్తుం టారు. కనీసం సరైన రోడ్డు సదుపాయం కూడా లేకపోవడంతో ఎక్కడో 20కి.మీ. దూరంలో ఉన్న వైద్యశాలకు కాలినడకన వెళ్లాల్సిన దుర్భర స్థితి. మార్పు ఎన్నటికి వచ్చేనో అర్థం కాని పరిస్థితుల్లో గిరిజన ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాల్లో పిట్టల్లాగా బతుకుతు న్న గిరిజన గర్భిణుల దీనగాధ. గుట్టల్లో గొడుగులాంటి గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న గిరిజనం దారుల్లేని దారిద్య్రం పుణ్యమాని నెలలు నిండిన అడవి బిడ్డలకి ఇప్పటికీ వదలని పడిషం పట్టిన మంత్రసానే దిక్కు. ఒకపక్క రాష్ట్రంలో, దేశంలో నాగరిక సమాజం సింగపూర్లా విలసిల్లుతున్నదని గొప్పలు చెప్పుకుంటు న్న ప్రభుత్వాలు ఇటువంటి సన్నివేశాలు ఏజెన్సీలో పునరావృతమైతే ఇది దివాలాకోరు ప్రభుత్వంగా చెప్పు కోవచ్చు. ఇవాళ భాగ్యనగరంలో మెట్రోలు తిరిగినంత మాత్రాన ఇది బంగారు తెలంగాణ అని ఎలా అనగల రు? బంగారు తెలంగాణ అంటే తెలంగాణ నాలు గున్నర కోట్ల మంది ప్రజలు సుఖసంతోషాలతో జీవిం చాలి. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలి. రెండు పూటలా కడుపునిండా భోజనం చేయాలి. కాని నేడు ఏజెన్సీలో గిరిజన గర్భవతులకి తగిన పౌష్టికాహారం అందుతుందా? అడవిలో దొరికే ఆహారం తక్కువైంది. మార్కెట్లో దొరికే ఆహారం కొనాలంటే డబ్బులు కావాలి. ఈ విధంగా పౌష్టికాహార లోపం వల్ల పురిట్లోనే పిల్లలు, తల్లులు కూడా చాలామంది చనిపోతున్నారు. సేల్స్ డిపో సరుకుల కోసం 20 మైళ్ల దూరం గర్భ సంచితో నడిచి సరుకులను మోసుకొని వెళ్లాల్సి వస్తుంది. నవమాసాలు మోసి ప్రసవించే సమయంలో వైద్యం అందక, రోడ్లు సరిగా లేక అంబులెన్స్లు రాక కండ్ల ముందే అడవిలో అతలాకుతలమై చనిపోతుంటే మన స్సు చలించిపోయే పరిస్థితి ఇప్పటికీ కనబడుతుంది. దీనంతటికీ కారణం ఏజెన్సీలో రోడ్డు సౌకర్యం లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఏజె న్సీలో ఖనిజ సంపద దోచుకోవడానికి ఎంత ఖర్చు అ యినా వెచ్చించి కొండలు పిండి చేసైనా దారులు వేసు కొనే ప్రభుత్వాలు ఆదివాసీ గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి చూస్తే విడ్డూరం.
ఇంకోపక్క గిరిజన స్త్రీలపై అత్యాచారాలు జరిగినా సకాలంలో ఏజెన్సీలో వైద్యం సదుపాయానికి దిక్కులే దు. జిల్లాలో హెల్త్ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకో వడమే మిగిలింది. మరోపక్క ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏల ద్వారా వందల కోట్లు వైద్యానికి ఖర్చు పెడుతుందని గొప్పలు చెప్పే ప్రభుత్వాలు గూడాలలో దోమ తెరలకే దిక్కులేదు. వర్షాకాలం వ్యాధులు సంభ వించినప్పుడు ఏ ఒక్కరోజూ అడవులలో ఉండే గూడాల కు వెళ్లి క్యాంపులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. గర్భవతులు ప్రసవానికి ముందు ప్రసవం తరువాత నెలవారి సూదిమందుల కోసం సుమారు 20 మైళ్ల దూ రం తమ బిడ్డలను చంకలో వేసుకొని కాలి నడకన ఉద యం బయలుదేరితే సాయంత్రంకల్లా ప్రాథమిక ఆరో గ్యకేంద్రానికి రావాల్సి వస్తుంది. కష్టమైన, నష్టమైన తప్పదని భావించి వస్తే ఆ రోజు సూదులు వేసే డాక్టరు వస్తారో? రారో? కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వర్షాకా లంలో చుట్టూ వాగులు, వంకలు, కొండలూ, కోనల నడుమ గర్భిణుల ఆర్తనాదాలు, అప్పుడు మంత్రసానే దేవుడు. వారివి తాడు బొంగరం లాంటి జీవితాల్లా మా రిపోయాయి. అటువంటి సందర్భంలో జోలెకట్టి కావడి వేసుకొని వాగుల గుండా మోసుకొచ్చిన సందర్భాలు ఎన్నో. సరైన రోడ్డు సౌకర్యం లేక ఎడ్ల బండ్ల మీద ఆరోగ్య కేంద్రానికి తరలించే క్రమంలో అడవిలో నొప్పు లతో అనారోగ్యంతో ప్రసవించిన వారు ఎందరో.. ఈ విధంగా ఈనాటి ప్రభుత్వం ఏజెన్సీ గిరిజన మహిళ ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది. ఓట్లు వేసి గెలిపిం చిన నాయకులేమో ఏసీ కార్లలో తిరుగుతుంటే గిరిజన బిడ్డలేమో ఎండలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నా రు. వర్షాకాలం దోమలవల్ల మలేరియా, టైపా యిడ్ జ్వ రాలు వచ్చి గూడాలు గూడాలే మంచం పడితే ఏ ఒక్క నాడు ప్రభుత్వం చొరవచూపి వైద్య సిబ్బందిని పంపిం చి దోమల మందు పిచికారి చేసిన సందర్భాలు లేవు.
- పెనుక ప్రభాకర్
సెల్ : 9494283038
Authorization