- కులం పేరుతో దూషిస్తూ.... చితక బాదిన వైనం
- జడ్చర్లలో జడలు విప్పిన ఆధిపత్యం
- కేసు పెట్టినా పట్టించుకోని పోలీసులు
''అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టొద్దు. మీ ఇంటిదగ్గర ఏర్పాటు చేసుకోండి, ఇదేమైన మీ తాత జాగీరా, మీ ఇష్టమొచ్చిన విగ్రహాలు పెట్టడానికి. మీ జాతి మూల పురుషుడైతే పల్లకిలో ఊరేగించండి. కాని ఇక్కడికి వచ్చి మీరు విగ్రహాలు... పూలదండ లంటూ... పెద్దరికం చేయకండి, మరోసారి విగ్రహం అంటూ ఇక్కడికొస్తే... బరితేపూజ చేస్తాం'' అంటూ... అగ్రకులాల వారు దళితులకు హెచ్చరిక లు చేస్తున్నారు. ఎదురుతిరిగితే దాడులకు పాల్పడు తున్నారు. జడ్చర్ల మండల కేంద్రంలో ఈనెల 1న జరిగిన హోళీ పండుగ రోజు దళిత యువకులపై ఆధిపత్య కులాలవారు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు పెట్టినా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదంటే దళితులపై పోలీసులు సైతం ఎంత వివక్ష చూపుతు న్నారో మనకు తెలుస్తోంది.
దళిత జాతి ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని జడ్చర్ల పట్టణంలో ఎస్సీ కాలనీకి వెళ్లే ప్రధాన కూడలిలో పెట్టాలని నిర్ణయం చేశారు. ''మేము ప్రతి ఏటా ఇక్కడ గణేష్ విగ్రహం పెడతాం. మీరు అంబేద్కర్ విగ్రహాన్ని ఎలా పెడతా రు'' అని ఆధిపత్య కులాల వారు వారించారు. ఆధిపత్యవాదులు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తెచ్చి మూడు నెలల క్రితం చౌరస్తాలో పెడితే... అడ్డుకున్నారు. మంత్రికి సైతం ఆధిపత్యవాదులు ఫిర్యా దు చేయడంతో రంగంలోకి దిగిన మం త్రి లక్ష్మారెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని తీసు కెళ్లాలని మున్సిపాల్టీ సిబ్బందిని ఆదేశిం చడంతో అధికారులు విగ్రహాన్ని అక్కడి నుండి తరలించినట్టు సమాచారం. వి గ్రహం ఏర్పాటు సమస్య వచ్చినప్పుడల్లా అడ్డుకోవడంతో కొన్ని నెలలుగా విగ్ర హం మున్సిపాల్టీ కార్యాలయంలో చెత్తకుండీల మధ్యనే ఉంది.
రెక్కాడితే గాని డొక్క నిండని ని రుపేదలు ఇక్కడి దళితులు. హోళీ పం డుగ రోజు సంతోషంతో వారు రంగుల తో హోళీ ఆడారు. మధ్యాహ్నం అలసి పోయిన దళిత యువకులు వచ్చి చౌర స్తాలో టీ తాగుతుండగా ఆధిపత్యవాదులు కూడా అక్కడికి చేరుకున్నారు. మీరు అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే మేము కూడా మరో విగ్రహాన్ని అక్కడే పెడ తామని హెచ్చరించారు. మా కాలనీకి వెళ్లే రహదా రిలో మీరెలా విగ్రహాన్ని పెడతారని ప్రశ్నించడంతో దళితులపై చేయి చేసుకున్నారు. టీ కొట్టునుండి బయటకు తీసుకొచ్చి ''మాదిగ కొడుకుల్లారా..' అని దుర్భాషలాడుతూ చితకబాదారు. బీసీలు అధికంగా ఉండటమేగాక హోళీ రోజు బాగా తాగి ఉన్నారు. స్థానికులు విడిపించేందుకు ప్రయత్నించినా వదలకుండా దాడి చేశారు. దళిత యువకులైన గిరిధర్, గణేష్, శివ, కృష్ణ, మహేష్లను చితకబాదారు. పండ్ల రాజు, పండ్ల యాదయ్య, బొర్ర శ్రీనివాసులు, శేఖర్, చిలుకూరి శ్రీను, బండ్ల హన్మంతులు కలిసి దాడి చేశారు. వీరిపై అదే రోజు కేసు పెట్టినా ఇప్పటివరకు నమోదు చేయకుండా పోలీసు అధికారులు తాత్సారం చేస్తున్నారు.
దళితులపై దాడి చేస్తే... కేసు నమోదు చే యడంలో ఎందుకు తా త్సారం చేస్తు న్నారో అర్థం కావడం లేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంఘటన జరిగిన రోజు కేసు పెడితే...సంఘటన జరిగిన స్థలానికి ఏఎస్ఐ వచ్చి పరిశీలించాడు కానీ ఇప్పటికీ కేసు నమోదు కాలేదు. ఎస్సీలపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయడం లేదు. కాని అదే ఎస్సీలు దాడి చేయకున్నా కౌంటర్ కేసు పేరుతో వారిపై కేసులు నమెదు చేసి జైలుకు పంపుతున్నారు. తెలకపల్లి మండలం నడిగడ్డ, కార్వంగ, తాళ్లపల్లి గ్రామాలలో దాడులు జరిగితే దళితులపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తే... దళితులపైనే కౌంటర్ కేసు నమోదు చేశారు. గంట్రావుపల్లిలో దళితుడి హత్యను ప్రశ్నించినందుకు రమేష్ అనే దళిత సర్పంచును అరెస్టు చేసి జైలుకు పంపారు. జిల్లాలో నిత్యం ఇలాంటి ఘటనలు జరగుతున్నా... పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దాడులు చేసినా పట్టించుకోవడం లేదు
హోళీ పండుగ రోజు మాపై దాడులు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కులం పేరుతో దూషిస్తూ... దాడి చేసిన వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. దీంతో దాడులకు పాల్పడిన వారు తిరిగి ఎప్పడు విరుచకపడుతారోనని అందోళనగా ఉంది.
కురుమయ్య, దళితుడు, జడ్చర్ల
విడిపించడానికి వెళ్లిన నన్నూ కొట్టారు
దళితులను అగ్రకులాల వారు కొడుతుంటే నేను విడిపించడానికి పోయాను. నన్ను కూడా చితక బాదారు. కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఎంత వేడుకున్నా వదల్లేదు. పోలీసుల ముందు దాడులు చేసినా నివారించలేదు. వారిపై చర్యలు తీసుకోకుంటే మరోసారి దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి.
గిరిధర్, జడ్చర్ల పాతబస్తీ
- పరిపూర్ణం
సెల్ : 9490099324
Authorization