వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలోగానీ సాహిత్యంలోగానీ అసలు ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో హిందూ అనే పదమే కనిపించదు. కాబట్టి హిందూ అన్న పదం గానీ, హిందూజాతి అన్న పదాలు గానీ పూర్తిగా కల్పితమైనవి. ఈ మనువాద రాజకీయాలకు బీజాలు 1925లోనే పడ్డాయి. ఆనాటి ఆర్ఎస్ఎస్ నాయకుడు గోల్వాల్కర్ హిందూ జాతిని, హిందూ మతాన్నీ, హిందూ సంస్కతినీ భారతదేశంలో ఉన్నవారంతా ఖచ్చితంగా స్వీకరించాలని, అలా స్వీకరించడానికి నిరాకరించినవారు విదేశీయులుగా పరిగణించబడతారని లేదా హిందూ జాతికి తప్పకుండా లొంగి ఉండాలని ప్రకటించాడు. నాడు హిట్లర్ నాజీలను ఏ విధంగా జాతి పేరు మీద రెచ్చగొట్టి లక్షలాది యూదుల్ని నిర్దాక్షిణ్యంగా ఉచకోత కోయించాడో నేడు ఇండియా కూడా హిందూ జాతి లేక భారతజాతి పేరుమీద వైదిక ఫాసిజం చెలరేగుతూ వేలాది మంది దళితుల్ని, ఆదివాసీలను, శూద్రులను, క్రిస్టియన్లను, ముస్లింలను, హేతువాదులను చంపుతోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతోంది. నడిరోడ్లపై నగంగా ఉరేగిస్తుంది. దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు రోజోరోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ రింగ్టోన్ పెట్టుకున్నాడని సాగర్ అనే యువకుడిని చంపిన ఘటన మహారాష్ట్రలో చూసాం. ఒకవైపు అంబేద్కర్ ఇల్లు కొంటూ, బుద్ధగయను సందర్శిస్తూ, అంబేద్కర్ జయంతులను నిర్వహించడానికి పోటీపడుతున్న కొన్ని రాజకీయ పార్టీలు ఒక్క రోజైనా ఈ దాడుల మీద స్పందించలేదు, పైగా అంబేద్కర్పై కపట ప్రేమను చూపిస్తున్నారు. ఈ చరిత్రలో మాయని గాయాలెన్నో ఉన్నవి. చుండూరు దళితులపై దాడిచేసిన హంతకులను నిర్దోషులుగా విడుదల చేయడంలో న్యాయవ్యవస్థలో కుడా ఎంత కుల వివక్ష దాగి ఉందో అర్థమవుతుంది.
డిసెంబర్, 25 1927న భారతదేశ చరిత్రలో చారిత్రాత్మకమైన రోజు. మనుస్మతిని సరిగ్గా 88 సంవత్సరాల క్రితం ఇదే రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తగులబెట్టారు. అంటరానివారికి, శూద్రులకు చదువునూ, సంపదను, సమానత్వాన్ని, హక్కులనూ నిరాకరించి బానిసత్వం, బహిష్కరణలతో మనిషిని మనిషిగా చూడని ఈ హైందవ సమాజాన్ని నిలదీస్తూ స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వాలను నిషేధించిన మనుధర్మశాస్త్రాన్ని తగులబెట్టారు. కులం చుట్టూ ఈ దేశ పరిస్థితులు ఎలా అల్లుకుని ఉంటాయో బాబాసాహెబ్ అంబేద్కర్ తన రచనలలో వివరిస్తూ, ఈ కుల వ్యవస్థలకు కారణమైన హిందూమత పునాదులను ధ్వంసం చేసే వరకూ శూద్రులు, అంటరానివాళ్ల బతుకులు మారవని అంబేద్కర్ సూచించారు.
వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలోగానీ సాహిత్యంలోగానీ అసలు ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో హిందూ అనే పదమే కనిపించదు. కాబట్టి హిందూ అన్న పదం గానీ, హిందూజాతి అన్న పదాలు గానీ పూర్తిగా కల్పితమైనవి. ఈ మనువాద రాజకీయాలకు బీజాలు 1925లోనే పడ్డాయి. ఆనాటి ఆర్ఎస్ఎస్ నాయకుడు గోల్వాల్కర్ హిందూ జాతిని, హిందూ మతాన్నీ, హిందూ సంస్కతినీ భారతదేశంలో ఉన్నవారంతా ఖచ్చితంగా స్వీకరించాలని, అలా స్వీకరించడానికి నిరాకరించినవారు విదేశీయులుగా పరిగణించబడతారని లేదా హిందూ జాతికి తప్పకుండా లొంగి ఉండాలని ప్రకటించాడు. నాడు హిట్లర్ నాజీలను ఏ విధంగా జాతి పేరు మీద రెచ్చగొట్టి లక్షలాది యూదుల్ని నిర్దాక్షిణ్యంగా ఉచకోత కోయించాడో నేడు ఇండియా కూడా హిందూ జాతి లేక భారతజాతి పేరుమీద వైదిక ఫాసిజం చెలరేగుతూ వేలాది మంది దళితుల్ని, ఆదివాసీలను, శూద్రులను, క్రిస్టియన్లను, ముస్లింలను, హేతువాదులను చంపుతోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతోంది. నడిరోడ్లపై నగంగా ఉరేగిస్తుంది. దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు రోజోరోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ రింగ్టోన్ పెట్టుకున్నాడని సాగర్ అనే యువకుడిని చంపిన ఘటన మహారాష్ట్రలో చూసాం. ఒకవైపు అంబేద్కర్ ఇల్లు కొంటూ, బుద్ధగయను సందర్శిస్తూ, అంబేద్కర్ జయంతులను నిర్వహించడానికి పోటీపడుతున్న కొన్ని రాజకీయ పార్టీలు ఒక్క రోజైనా ఈ దాడుల మీద స్పందించలేదు, పైగా అంబేద్కర్పై కపట ప్రేమను చూపిస్తున్నారు. ఈ చరిత్రలో మాయని గాయాలెన్నో ఉన్నవి. చుండూరు దళితులపై దాడిచేసిన హంతకులను నిర్దోషులుగా విడుదల చేయడంలో న్యాయవ్యవస్థలో కుడా ఎంత కుల వివక్ష దాగి ఉందో అర్థమవుతుంది. హర్యానా రాష్ట్రంలో జితేందర్ అనే దళిత యువకుడిని సజీవ దహనం చేసే ఉద్దేశంతో అతడి ఇల్లు తగులబెట్టారు. ఈ ఘటనలో అతని ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ విషయంపై మంత్రి వికె.సింగ్ను మీడియా ప్రశ్నించగా ''కుక్కలు చనిపోతే నేను స్పందించాలా?'' అని అన్నాడంటే ఈ అగ్రకుల దురహంకారం ఎంత ఉన్నదో అర్దంచేసుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరెలో దళిత రచయిత హుతంగి ప్రసాద్ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పుస్తకం రాసినందుకు అతనిపై దాడిచేసి చేతివేళ్లు నరకడానికి ప్రయత్నించారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారని కూతురిని నరికి చంపారు. ఆంధ్రప్రదేశ్ దేవరంపాడులో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూమిని దౌర్జన్యంగా అక్రమంగా అనుభవిస్తూ వారి పొలాల్లో పంటను తొక్కించడమే కాకుండా మిగిలిన పంటను కోసుకుందామని వెళ్లిన వారిపైన రెండు ట్రాక్టర్ల మనుషులతో దాడి చేయించాడు. మధ్యప్రదేశ్లో దళిత యువకుడు తన పెండ్లిలో గుర్రం ఎక్కాడనే కారణంతో అగ్రకులాల వాళ్లు రాళ్లతో దాడిచేశారు. చిగురుమామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో దళితులు వండిన మధ్యాహ్న భోజనం తినలేమని పిల్లలు రోజు స్కూల్ నుండి వెళ్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో పద్నాలుగేండ్ల దళిత బాలికపై అత్యాచారం, రోడ్డుపై వెళితే నీడ పడిందని బాలికపై దాడులు, హర్యానాలోని దౌలత్పూర్లో యువకుడి సజీవ దహనం, తమిళనాడులోని మధురైలో దళితులు గుడిలో పుజచేసారని, లక్షింపేట దళితులపై భూమికోసం దాడులు ఇలా రాసుకుంటూ పోతే పేజీలు చాలవేమో. ఆ రాజ్యాంగం స్థానంలో మత గ్రంథాలను పెట్టాలనుకుంటున్న వారు ఈ దేశాన్ని హైందవీకరించాల నుకుంటున్నారు. గోవింద్ పన్సారే, దబోల్కర్, కల్బుర్గిలను ఇంకా ఇతర రచయితలను, ఉద్యమకారులను వాళ్ల వాక్ స్వాతంత్రపు హక్కును కాలరాస్తూ చంపుతున్నారు. ఇంకోవైపు తినే తిండిమీద ఆంక్షలు విధిస్తూ దాడులు చేస్తున్నారు. దాద్రిలో అఖ్లాక్ అనే వ్యక్తిని ఆవు మాంసం తిన్నాడని చంపారు. జమ్మూకాశ్మీర్లో రషీద్ అనే ఎమ్మెల్యేను అసెంబ్లీ సాక్షిగా కొట్టారు. హర్యానాలో ఐదుగురు దళితులను వాళ్ల వత్తిలో భాగమైన ఆవు చర్మాన్ని వలుస్తున్నారని రాళ్లతో కొట్టి, తల్వార్లతో నరికి చంపారు. ''బీఫ్ తింటాను'' అని ప్రకటించినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యను ''తలనరుకుతాం'' అంటూ బహిరంగంగా ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీలో దళిత బహుజనుల ఆహారమైన పెద్దకూర తింటామంటే తల్వార్లతో దాడి చేస్తామనీ, దాద్రీ ఘటన పునరావతం అమవుతుందనీ ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యేపై చట్టం చర్యలు తీసుకోకపోగా, పెద్దకూర పండగనే అడ్డుకున్నారు.
ఇక విశ్వవిద్యాలయాలపై దాడి చేస్తున్న తీరును మనం అర్థం చేసుకోవచ్చు. 2004లో హెచ్సీయూలో పది మంది దళిత విద్యార్థులపై నిషేధం విధించారు. ఈఎఫ్ఎల్యూలో ముగ్గురు విద్యార్థుల నిషేధం. మద్రాస్ ఐఐటీలోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్పై నిషేధం, హెచ్సీయూలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్కు చెందిన ఐదుగురు విద్యార్థులపై నిషేధం విధించాయి. ఆధునిక అగ్రహారాల్లాంటి ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలలో విద్యార్థులపై వివక్షను తట్టుకోలేక జరుగుతున్న ఆత్మహత్యలకు లెక్కేలేదు. ఇక ఈ మనువాదుల కండ్లు ఇప్పుడూ రిజర్వేషన్స్ మీద పడ్డాయి. ఇస్తే మాకు ఇవ్వండి లేదా అందరికీ తీసివెయ్యండని గగ్గోలుపెడుతున్నారు. ఆనాటి పటేల్ నుండి ఈనాటి పటేల్ వరకు దేశమంతా వ్యాపారరంగంలో విస్తరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉన్న కాస్తోకూస్తో రిజర్వేషన్స్ కూడా తీసెయ్యాలని అంటున్న ఈ అగ్రకుల పటేళ్ల స్వభావం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను బానిసలుగా మార్చడమే. ఈ దేశంలో పరిశ్రమలు, గనులు, వ్యవసాయ, కాంట్రాక్టు, వైద్యం, విద్య, రక్షణ, సైన్సు, టెక్నాలజీ మొదలైన రంగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వాటాలు ఎంతో లెక్కతీయవలసిన అవసరం ఉంది. ఇంకా వీటిలో సమాన వాటా కోసం పోరాడవలసిన అవసరం ఉంది. ఇక రాజ్యాధికారం గురించి మాట్లాడితే ఇప్పటివరకు ఎన్నికైన దళిత నాయకులు 63 సంవత్సరాల పార్లమెంట్ చరిత్రలో దళితుల సమస్యలపై మాట్లాడింది కేవలం రెండు గంటలు మాత్రమే. అంటేవారి చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది. అప్పుడే పెరుగుతున్న దళిత చైతన్యం, దళిత మహాసభ, దళిత్ ఫాంథర్స్ పోరాటాలతో తమ గొంతును వినిపిస్తున్న దళితులు ఒక పక్క, ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని మండల్ కమిటీ సిఫార్సులు ఒకపక్క, ఈ రెండూ కాక ఈ దేశాన్ని ప్రయివేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పేరు మీద ఈ దేశాన్ని ప్రపంచానికి తాకట్టు పెట్టడంతో పెల్లుబిక్కిన ఆందోళనలు ఇంకోవైపు పెరుగుతున్న ఈ చైతన్యాన్ని జీర్ణించుకోలేని ఈ అగ్రకుల పెట్టుబడిదారులు ప్రజల చైతన్యాన్ని అడ్డుకోవడానికి మతం అనే అయుధంతో అడ్డుకట్ట వేయడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి రోజైన డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసి చరిత్రలో దాన్ని బ్లాక్ డేగా చేసారు. అంటే ఈ మనువాదులు ఎంత పక్కాగా వ్యక్తులపై, భావజాలాలపై దాడులు చేస్తారనేది ఈ సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలను మతీకరణ చేసే ప్రయత్నాలు రోజురోజుకూ ముమ్మరమవుతున్నాయి. రాజ్యాంగమే మన పవిత్రగ్రంథం అని ఓ పక్క ప్రధాని నరేంద్రమోడీ అంటూ మరోపక్క రాజ్యాంగంలో 'లౌకిక' అన్న పదం తొలగించాలని వారి పార్టీ నేతలు అంటున్నారు.
ఈ దేశంలో ఉద్యమాల చరిత్రలో జరిగిన త్యాగాలు, రచనలు, సామాజిక, సాంస్కతిక పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక, సాంస్కతిక, ఆర్థిక, రాజకీయ పోరాటాలను ప్రజాస్వామ్యయుతంగా చెయ్యడమే మన ముందున్న మార్గం. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, ఇతర రచనల ద్వారానే ప్రజాస్వామ్య లౌకికవాదులు మనువాదాన్ని ఎదిరించి ఈ దేశాన్ని పునర్నిర్మాణానికి బాటలు వేస్తుంది.
- మట్టా క్రిష్ణయ్య
సెల్ : 9866338308
Authorization