మారుమూల ప్రాంతంలోని విద్యావంతుడు నిగూఢంగా కప్పిన నిప్పు కు ఆహుతి అయ్యాడు. ఐఏఎస్ కావాలని, కన్న తల్లిదండ్రులు, తోబుట్టువుల ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆశించిన ఆ దళిత స్వప్నం ఆరిపోయింది. పట్ట ణంలో హారు హారు అంటూ అరమరికలు లేకుండా స్నేహితులతో గడిపిన విద్యా కుసుమం తాను జన్మించిన పల్లెలోనే రాలిపోయింది. నివురుగప్పిన ని ప్పులా ఉడుకుతున్న కుల వివక్షకు కొందరు నాయకులు దాసోహం కావడంతో కిరోసిన్ పోసుకొని అగ్నికి ఆహుతి కావడం తప్ప మరేమీ లేకపోయింది. జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలకేంద్రానికి చెందిన జాడి కవిరాజు (28) పోటీ పరీక్షల్లో నెగ్గి ఉన్నత చదువులు చదివాడు. కానీ గ్రామాలలో ఉన్న అంటరానితనానికి బలికావడం మారుమూల ప్రాంతంలో సంచలనం రేపింది. మండల కేంద్రంలో ఐదో తరగతి, హుస్నాబాద్లో ఇంటర్మీడియట్, కరీంనగర్ ఎస్ఆర్ ఆర్ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి సివిల్ సర్వీస్ ఎంపిక కోసం కోచింగ్కు వెళ్తున్నాడు. తన తల్లిదండ్రులను చూడడానికి ఇంటి కి రాగా గ్రామంలో జరుగుతున్న అంటరాని వాసనను తన కొడుక్కి తాకకుం డా తన తండ్రి జాడి నాగయ్య ప్రయత్నించాడు. కానీ పది సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన రంగు బాపుగౌడ్ (బీసీ కులం)కు చెందిన ఇంటి స్థలాన్ని జాడి నాగయ్య కొనుగోలు చేశాడు. అయితే కొనుగోలు చేసిన స్థలం మరో గౌడ కులానికి చెందిన మారగోని దుర్గయ్య ఇంటికి ఆనుకొ ని ఉంది. దీంతో 'నా ఇంటి పక్కన ఉండొద్దు, నీవు నేతకాని (దళిత) కులానికి చెందినవాడవు' అని నానా బూతులు తిడుతూ పలుమార్లు వ్యక్తిగత దూషణకు పాల్పడేవాడు. ఈ విషయం తన పిల్లలకు తెలువకుండా ప్రయత్నించిన జాడి నాగయ్య అను కోని పరిస్థితిలో కవిరాజుకు వివరించాడు. దీంతో గ్రామీణ పోకడ తెలియని కవిరాజు స్థానిక పోలీస్స్టేషన్కు తన తల్లిదండ్రులతో వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మళ్లీ ఫిబ్రవరి 19, 22వ తేదీల లో పోలీసులను ఆశ్రయించాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. రాజ్యాంగబద్ధంగా ఎంపీటీసీగా ఎన్నికై ప్రజలను సమాన భావంతో చూస్తాడనుకున్న ఎంపీటీసీ సభ్యుడు రంగప్రవే శం చేశాడు. నింది తులకు బంధువైన ఎంపీటీసీ రాముగౌడ్ బాధితుల పట్ల కర్కశంగా మాట్లాడా డు. పోలీస్స్టేషన్ నుంచి జాడి కవిరాజును బయటకు తీసుకొచ్చి 'నువ్వు కేసు పెడితే ఏమైతది, నీ గవాయిలను రూ.20 లక్షలు ఇచ్చి కొంట, నీ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిస్తా, నువ్వు కలెక్టర్ నౌకరు కోసం ప్రయత్నిస్తున్నావట, అ క్రమ కేసులు పెట్టి జైలులో పెట్టిస్తా, నౌకరు రాకుండా చేస్తా' అని బెదిరించి కేసును విరమించుకుంటున్నట్టు తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్నాడు. మళ్లీ అదే రోజు ఇంటికి రావడంతో మళ్లీ గౌడ కులానికి చెందిన మారగోని దు ర్గయ్య, అతని భార్య, కుమారుడు తీ వ్ర పదజాలంతో జాడి నాగయ్య కుటుం బాన్ని అవమానపరిచాడు. దీంతో కవి రాజు తన తల్లిదండ్రులు, తమ్ముడు, అక్కను కాటారంలోని సబ్డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లగానే ముందు వరుసలో ఉన్న సీఐ 'ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ స్టేషన్లో ఎస్ఐతో చెప్పుకోండి' అంటూ డీఎ స్పీని కలవకుండా చేశాడని జాడి నాగయ్య తెలిపాడు. ఇక్కడ ఎస్ఐ పట్టిం చుకోకపోవడం, అక్కడ పోలీసు ఉన్నతాధికారి నిరాకరిం చడంతో కవిరాజు తన తల్లిదండ్రులతో ఇంటికి వస్తున్నా డు. దీంతో మండలస్థా యి నుంచి డివిజన్ స్థాయికి కే సు వెళ్లడంతో స్థానిక పోలీసులు స్టేషన్కు రమ్మని పలు మార్లు కవిరాజును చరవాణి ద్వారా ఒత్తిడి చేయడంతో ఇంటికి వచ్చి తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పం టించుకున్నాడు. సమాచారం అందు కున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి కవిరాజును రక్షించే ప్రయత్నం చేశారు. బాధితున్ని వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మార్చి 5 తెల్లవారు జామున మృతి చెందాడు.
కుల వివక్షను సహించేది లేదు
నవీన యుగంలో కుల, మతాల పేరుతో దళితులపై దాడులు చేయడం అమానుషం. కవిరాజు సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేయాలి.
: కిరణ్, మాల మహానాడు యువజన నాయకుడు
ఇలాంటి విషాదం ఎవరికీ రాకూడదు
కూలి పని చేసుకొని తన కొడుకును పెద్ద చదువులు చదివించాను. చేతికందిన కొడుకు కుల మరకతో అందనంత దూరం వెళ్లిపోయాడు. నాలాంటి బాధ ఎవరికీ రాకూడదు.
: కవిరాజు తండ్రి నాగయ్య
కుల వివక్షను రూపుమాపాలి
కుల వివక్షను రూపుమాపాలి. కులం, మతాల పేరుతో దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. రోజురోజుకూ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా ఇలాంటి దాడులు జరగడం హేయమైన చర్య. ఇలాంటి దాడులు భవిష్యత్లో జరగకుండా చూడాలి. కవిరాజు కుటుంబానికి తగిన న్యాయం చేయాలి. కుల వివక్షకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారికి సహకరిస్తున్న వారిని సైతం వదలకూడదు. మృతుడు కవిరాజు కుటుంబానికి 20లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడంతోపాటు వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
: గుర్రం దేవేందర్, భూపాలపల్లి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి
- టి.రామయ్య
సెల్ : 8179935162
Authorization