- జగిత్యాల జిల్లాలో దళితుడి హత్య
- కోరలు చాచిన కుల వివక్ష
కుల వివక్ష మరోసారి కోరలు చాచింది. దేశం సాంకేతికంగా, నాగరికంగా అభివృద్ధిలో దూసుకుపో తోందని ఓ వైపు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో అనా గరిక మూలాలు ఇంకా బతికే ఉన్నాయి. దీనికి నిలువె త్తు నిదర్శనమే గత బుధవారం జగిత్యాల జిల్లాలో జరిగిన దళితుడి హత్య. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని తొంబర్రావుపేటకు చెందిన రాగుల సురేష్ డిగ్రీ పూర్తి చేసాడు. బతుకుదెరువు కోసం రెండేండ్లు దుబారుకి వెళ్లొచ్చాడు. తన ఊరికి కూతవే టు దూరంలో ఉన్న మేడిపల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. 2005లో తన మేనమామ కూతురు శైలజను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వీరికి 15 నెలల క్రితం కూతురు జన్మించింది.
ఇలా సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించారు. అదే గ్రామంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్రవంతి అనే యువతితో సురేష్కు పరిచయం ఏర్పడింది. తనకు కంప్యూటర్ నేర్పించాలని స్రవంతి సురేష్ను అడగడంతో సరేన న్నాడు. ఆ పరిచయం వారి మధ్య సాన్నిహిత్యానికి దారి తీసింది. ఆమెకు ఇదివరకే నిర్మల్కు చెందిన మరో వ్యక్తితో వివాహం జరిగింది. అనంతరం అతనితో విడాకులు తీసుకొని తన పుట్టింటి వద్దే నివసిస్తోంది. ఈ క్రమంలో దళితుడైన సురేష్తో సన్నిహితంగా ఉంటోందని గమనించిన తండ్రి గంగారెడ్డి తన కూతురిని సారంగాపూర్ మండలానికి చెందిన శ్రీధర్రావుకిచ్చి పెండ్లి చేశారు. మూడు నెలల తరువాత ఆమె కనిపించకుండా పోయింది. దీనికి కారణం సురేషేనని గంగారెడ్డి జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆమె తిరిగొచ్చి తను కనిపించకుండా పోవడానికి సురేష్ కారణం కాదని లిఖిత పూర్వకంగా పోలీసులకు రాసిచ్చింది. అనంతరం హైదరాబాదుకు వెళ్లి నివస్తోంది. ఈ క్రమంలో తనకు ప్రాణభయం ఉందని గ్రహించిన సురేష్ తన చిన్నమ్మ ఊరైన భీమారం నుండే రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. బుధవారం తన పెండ్లి రోజు కావడంతో తన గ్రామానికి వచ్చి తిరిగి బైక్పై మేడిపల్లికి వెళ్తున్న తరుణంలో గంగారెడ్డి తన కొడుకు సంతోష్ రెడ్డితో కలిసి వేట కొడవలితో హత్య చేసాడు.
అక్కసుతో చంపారు
నా తమ్ముడు డిగ్రీ చదివి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. గంగారెడ్డి కూతురితో ఒక దళితుడు చనువుగా ఉంటున్నాడన్న ఒకే ఒక్క కారణంతో నా తమ్ముడిని హతమార్చాడు. వారిపై చర్యలు తీసుకోవాలి.
నరేష్, సురేష్ అన్నయ్య
స్రవంతితో ఎలాంటి సంబంధమూ లేదు
నా భర్తకు స్రవంతితో ఎలాంటి సంబంధమూ లేదు. మూడేండ్ల క్రితం నన్ను సురేష్ ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. గంగారెడ్డి అతని కొడుకు సంతోష్రెడ్డి కులవివక్షతోనే నా భర్తను హతమార్చారు.
శైలజ, సురేష్ భార్య
నా కొడుకును అన్యాయంగా చంపారు
నా భర్త చనిపోయిన నుండి ఇద్దరు కుమారులను ఆప్యాయంగా పెంచుకుంటున్నాను. చిన్న కొడుకు సురేష్ కుటుంబ పోషణ కోసం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కూతురుతో చనువుగా ఉంటున్నాడనే నెపంతో గంగారెడ్డి నా కొడుకును అన్యాయంగా చంపేశారు. వారిపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.
తల్లి లక్ష్మి
వివక్షపూరితంగానే హత్య
సురేష్ హత్య అనుమానంతో జరిగింది. వివాహేతర సంబంధం రిత్యా ఈ హత్య జరగలేదు. సురేష్కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్రవంతి జనవరి 16న పోలీసుల విచారణలో తేల్చిచెప్పింది. గత 15 రోజులుగా స్రవంతి కనబడకుండా వెళ్లినప్పుడు సురేష్ తహశీల్దార్ కార్యాలయంలో భూ ప్రక్షాళన రికార్డుల కంప్యూటరీకరణలో బిజీగా ఉన్నాడు. కాబట్టి కావాలనే వివక్షపూరితంగా దళితుడని తెలిసి చంపేసినా ఎవరు అడుగుతారులేనన్న అహంకారం, అగ్రకుల పెత్తందారితనంతో ఈ హత్య చేశారు. నిందితులిద్దరినీ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం శిక్షించాలి. సెక్షన్ 121 ప్రకారంగా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలి. సురేష్ భార్య శైలజకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
స్కైలాబ్బాబు, కులవివక్ష పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Authorization