- బీఎల్ఎఫ్, దళిత సంఘాల రాస్తారోకో
- నిందితుడి అరెస్ట్
భారతరత్న, డా||బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కాంస్య విగ్రహానికి ఇటీవల ఓ ఆగంతకుడు నల్ల టీషర్టును చుట్టా రు. ఈ ఘటనపై సీపీఐ(ఎం), కాంగ్రెస్, టీడీపీ, బీఎల్ఎఫ్, టీమా స్, దళిత, గిరిజన, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సంఘాల ఆధ్వర్యంలో గంటకు పైగా జాతీయ రహదారిపై రాస్తా రోకో చేశారు. భువనగిరి పట్టణ పోలీస్స్టేషన్ను ముట్టడించారు. 24గంటల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సీసీ కెమెరాల సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు మద్యం మత్తులో ఈ ఘట నకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా నిందితుడు గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశాడనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. అయితే మనువాదుల ప్రేరణతోనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడన్నది దళిత సంఘాల వాదన.
ఈ నెల 9న అర్ధరాత్రి దాటిన తరువాత భువనగిరి పట్టణాని కి చెందిన ఓ ఆగంతకుడు తన నల్లని టీషర్టును అంబేద్కర్ కాంస్య విగ్రహం ముఖానికి చుట్టి వెళ్లాడు. తెల్లవారుజామున విగ్రహానికి సమీపంలో ఉన్న టీ దుకాణం వద్దకు వచ్చిన వారు అంబేద్కర్ విగ్రహానికి నలుపురంగు గుడ్డ చుట్టి ఉండటాన్ని గ మనించి పట్టణంలోని టీ మాస్, దళిత, గిరిజన, బీసీ సం ఘాల నేతలకు సమాచా రం అందజేశారు. వెంట నే మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, టీ మాస్ చైర్మెన్ బట్టు రాంచంద్ర య్య, కేవీ పీఎస్ జిల్లా కార్య దర్శి సి ర్పంగి స్వామి, టీమా స్ కన్వీనర్ కల్లూరి మల్లేశం, కౌన్సిలర్లు బట్టుపల్లి అనురా ధ, చంద మహేందర్గుప్త, న్యాయవాది నాగారం అం జయ్య, టీడీపీ నాయకులు చంద్రశేఖర్, దళిత మోర్చా రాష్ట్ర అధ్య క్షులు వేముల ఆ శోక్ తదితరులు తమ అను యాయులతో అక్కడికి చేరు కున్నారు. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాం డ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట హైదరబాద్-వరంగల్ జాతీ య రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఆనంతరం అక్కడి నుంచి పట్టణ పోలీస్స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదే రి వెళ్లారు. పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విషయం తెలుసు కున్న భువనగిరి ఏసీపీ జితేందర్రెడ్డి అందోళన చేస్తున్న వారి వద్ద కు వచ్చి ఘటనపై ఫి ర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటా మనడంతో రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానం కండ్ల ముందు కనిపిస్తున్నా ఫిర్యాదు చేయా లని పోలీసులు చెప్ప డాన్ని దళిత నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్స్టేషన్ ముం దు ధర్నా చేశారు. సీసీ పుటే జీ ద్వారా నిందితులను గుర్తిం చేందుకు పలువురు నా య కులను పోలీసులు ఆహ్వానించడంతో ధర్నా విరమించారు. కానీ అంబే ద్కర్ విగ్రహం ఎదుట ఉన్న సీసీ కెమెరా పుటేజీని పరి శీలించగా కెమెరా పని చే యడం లేదని తెలుసు కొని కంగుతిన్నారు. అర్ధరాత్రి దా టిన తరువాత నుంచి సీసీ కెమెరా నో లింక్ అని రావ టం అనుమానాలకు తావిస్తోందని దళిత స ంఘాల నాయకులు ఆరోపించారు. సాంకేతిక నిపుణుడిని పిలిపించి పుటేజీ బయటకు తీసుకొస్తామని అలా వీలు కాకుంటే విగ్రహం ఎదుట ఉన్న మొబై ల్ దుకాణం నుంచి సీసీ పుటేజీలో నింది తున్ని గుర్తిస్తామని ఏసీపీ హామీ ఇచ్చారు.
టీషర్టును తొలగించిన ఏసీపీ
అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఉన్న నలుపు రంగు టీ షర్టును పోలీసులే తొలగించి క్షీరాభిషేకర చేయాలని దళితులు కోరారు. దీ నికి ఏసీపీ అంగీకరించి నలుపురంగు టీ షర్టును తొలగించి తొలు త ఆయనే క్షీరాభిషేకర చేశారు. తరువాత బీఎల్ఎఫ్, కాంగ్రెస్, టీ డీపీ, బీజేపీ, దళిత, గిరిజన, బీసీ ప్రజాసంఘాల నాయకులు వేర్వే రుగా విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు.
24గంటల్లో నిందితుడి అరెస్ట్
సీసీ పుటేజీలను పరిశీలించిన తరువాత పోలీసులు ఈ ఘట నకు పాల్పడిన నిందితున్ని గుర్తించి అదేరోజు మధ్నాహ్నం అదుపు లోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎంత మంది పాల్గొన్నారు? ఎందుకు నల్లగుడ్డ తొడిగారు? ఎవరైనా తొడగమని ప్రేరేపించా రా? రాజకీయ నేపథ్యం ఏమిటన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేశారు. చివరికి మద్యం మత్తులోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వెల్లడించారు. కాగా నిందితుడు గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇందులో ఏదో కుట్ర ఉండి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని పలు సంఘాల నాయకులు కోరుతున్నారు.
కంటితుడుపు చర్యలొద్దు
ప్రజాస్వామ్య దేశంలో మహనీ యుల విగ్రహాల కు రక్షణ లేకుండా పోయింది. మోడీ అధికారం లోకి వచ్చిన తరువాత దేశంలో అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం మరింత పెరి గింది. భువనగిరిలో జరిగిన ఈ ఘటనను కూడా పోలీసులు ఆ కోణంలోనే చూడాలి. వర్షానికి అంబేద్కర్ విగ్ర హం తడువొద్దని మద్యం మత్తులో టీషర్టును చుట్టానని నింది తుడు చెప్పడం హా స్యాస్పదంగా ఉంది. ఇది సున్నితమైన సమ స్య అయినందున పోలీసులు కూడా కంటితుడుపు చర్యలు చేప ట్టడం సహజమే. సమగ్రమైన విచారణ చేసి కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
- ఎండీ జహంగీర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
శిక్షలు పడితేనే తగ్గుతాయి
దేశంలో మహనీయుల విగ్రహాలను అవమా నించిన వారి పట్ల ప్ర భుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీం తోనే విచ్ఛిన్నకర శక్తు లు రెచ్చిపోతు న్నారు. ఇలాంటి వారి పట్ల పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. కోర్టులో శిక్షలు పడే విధంగా పోలీసులు తగిన సాక్ష్యాలను అందిస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి.
- బర్రె జహంగీర్, మున్సిపల్ మాజీ చైర్మన్
సమగ్ర విచారణ చేయాలి
అంబేద్కర్ అందరివాడు అంటూ నే ఆయన భావజాల వ్యాప్తిపై మనువాదులు చాప కింద నీరులా దాడి చేస్తున్నారు. లౌకిక దేశంలో లాల్-నీల్ శక్తులు ఏకమైతే ఇక తమ ఆటలు సాగవని భావిస్తున్న అంబ్కేదర్ వ్యతిరేకులు ఇలాంటి ఘటనలకు పాల్పడి అశాంతికి కారణమవుతున్నారు. పోలీసులు ఈ ఘటనను ఆషామాషీగా తీసుకోకుండా లోతైన కోణంలో విచారణ చేయాలి. అప్పుడే అసలైన దోషులు బయటపడతారు.
- సిర్పంగి స్వామి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి
- దుడుక రామకృష్ణ
సెల్ : 9490094402
Authorization