శ్మశానమే ఆమె ఆస్తి అ శవమొస్తేనే కూడు.... అ కాటికాపరుల జీవితం అత్యంత దుర్భరం
నేటికీ బ్రాహ్మ ణుడు చెప్పిందే వేదం.. అతను పెట్టిందే పెండ్లి ముహూ ర్తం.. అతను పెడితేనే పేరు.. బ్రాహ్మణుడిని కాదని కొందరు తప్ప మెజారిటీ ప్రజలు పెండ్లి చేసుకునేందుకు సాహసించ రు. గహ ప్రవేశాలూ చేయరు. అసలు అటువంటి ఆలోచన కూడా మెదడులోకి రానీయరు. ఎవరికైనా వస్తే.. ''వీడికి దయ్యం పట్టింది.. పోయే కాలం దగ్గరపడ్డట్టుంది'' అంటూ శాపనార్ధాలు పెడతారు. బ్రాహ్మణీయ భావజాలం అంత బలంగా నాటుకున్నది. అకస్మాత్తుగా దొంగలు పడి సొమ్మంతా దోచుకుపోతే.. అనుకోకుండా బంగారమో.. నగదో ఎక్కడైనా పడిపోతే.. ఏం చేస్తాం మనకు అదష్టం లేదు.. దేవుడు మనకు రాసిపెట్టలేదు అందుకే పోయిందని సరిపెట్టుకుంటారు. ఆత్మీయులు అనుకోకుండా మరణించి నా.. వాడి రాత అంతే మనమేమి చేయగలమని నిర్వేదం వ్యక్తం చేస్తుంటారు. మరి నిజంగా రాతలు ఉంటాయా?. ఒకవేళ రాతలనేవి ఉంటే నూటికి 90 శాతంగా ఉన్న బహు జనుల విషయంలోనే దేవుడు వాళ్లను బానిసలుగా.. కష్టజీ వులుగా బతకాలని రాస్తాడా? పిడికెడు కులపోళ్లను సకల సంపదలతో తులతూగాలని తలపై గీస్తాడా?. ప్రజల సొత్తు ను దొంగల్లా దోచుకోవాలని ఆ రాతల్లో చేరుస్తాడా?. కనిపిం చిన ఆడదాన్నల్లా పాడు చేయాలని గీకుతాడా? తల రాతలు ఉంటాయని నమ్మేవారికి నాదో సూటి ప్రశ్న.. మీ కుటుంబా నికి చెందిన వ్యక్తిని ఎవరైనా హత్య.. మానభంగం చేస్తే మా తలరాతలు ఇంతే అని సర్దిచెప్పుకుంటారా?.. పోలీసు కేసు నమోదు చేయకుండా ఊరుకుంటారా?. అంతెందుకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు 'నేను ఇవ్వను పో' అంటే అంతా మా తల రాత అని వదిలేస్తారా?
''తలరాత.. నుదిటి రాత.. మనకు ఎట్లా రాసిపెట్టి ఉం టే అట్ల జరుగుతది.. మనం ఎన్ననుకున్నా జరగాల్సింది జర గకుండా ఉండదు. బ్రహ్మ రాసిన రాతలను మార్చేశక్తి మాన వ మాత్రుడికెవడికీ లేదు'' ఏదైనా అరిష్టం జరిగిన సమ యంలో ఎక్కువ మంది నుండి ఇటువంటి మాటలే విని పి స్తుంటాయి. అయినవాళ్లనో.. ఆప్తులనో.. ఆస్తులనో పోగొ ట్టుకున్న వాళ్లు.. నా ఖర్మ అంటూ ఘొళ్లు మంటే.. ''మన చే తిలో ఏముంది రా ఆ దేవుడు ఎట్లా రాసిపెడితే అట్ల జరుగు తది'' అంటూ సన్నిహితులు ఓదారుస్తుంటారు. మరి నిజం గా నుదిటి మీద రాతలు ఉంటాయా?...ప్రతి ఒక్కరికీ బ్ర హ్మ తలరాతలు రాస్తుంటాడా? కేవలం మనుషులకేనా.. ప శుపక్షాదుల వంటి జీవజాలానికంతటికీ తలరాతలు రా స్తుంటా డా. నిజంగా బ్రహ్మ ఉండి ఉంటే కూడా నిత్యం కో ట్ల జీవ రాశుల తలరాతలు రాయడం అసాధ్యం. లేని బ్రహ్మ మన తల రాతలు రాయడం అంతా అభూత కల్పన. కా దుకాదు.. అదో పెద్ద కుట్ర. పరాన్నభుక్కులైన ఒకనాటి బ్రా హ్మణులు తమ బతుకుదెరువు కోసం సష్టించిన కట్టుకథలు. యావత్ మానవాళిని తమ కాళ్లకింద తొక్కిపెట్టేందుకు మ నువాదులు దేవుళ్లను సష్టించారు. ఆ దేవుళ్లకు పూజలు చేసే అధికారం తమ చేతుల్లో పెట్టుకున్నారు. అమాయకులైన ప్ర జలు తెలివిమీరకుండా చదువుకు దూరం పెట్టారు. అంతా ఆ దేవుడు రాసిన రాతల ప్రకారమే జరుగుతుందని ప్రచా రం చేస్తూ వచ్చారు. ఈ దేశంలో 90 శాతానికి మించి ఉన్న బహుజనులను బానిసలుగా మార్చకున్నారు. నేటికీ బ్రాహ్మ ణుడు చెప్పిందే వేదం.. అతను పెట్టిందే పెండ్లి ముహూ ర్తం.. అతను పెడితేనే పేరు.. బ్రాహ్మణుడిని కాదని కొంద రు తప్ప మెజారిటీ ప్రజలు పెండ్లి చేసుకునేందుకు సాహ సించరు. గహ ప్రవేశాలూ చేయరు. అసలు అటువంటి ఆలోచన కూడా మెదడులోకి రానీయరు. ఎవరికైనా వస్తే.. ''వీడికి దయ్యం పట్టింది.. పోయే కాలం దగ్గరపడ్డట్టుంది'' అంటూ శాపనార్ధాలు పెడతారు. బ్రాహ్మణీయ భావజాలం అంత బలంగా నాటుకున్నది. అకస్మాత్తుగా దొంగలు పడి సొమ్మంతా దోచుకుపోతే.. అనుకోకుండా బంగారమో.. నగ దో ఎక్కడైనా పడిపోతే.. ఏం చేస్తాం మనకు అదష్టం లేదు.. దేవుడు మనకు రాసిపెట్టలేదు అందుకే పోయిందని సరిపె ట్టుకుంటారు. ఆత్మీయులు అనుకోకుండా మరణించి నా.. వాడి రాత అంతే మనమేమి చేయగలమని నిర్వేదం వ్యక్తం చేస్తుంటారు. మరి నిజంగా రాతలు ఉంటాయా?. ఒకవేళ రాతలనేవి ఉంటే నూటికి 90 శాతంగా ఉన్న బహు జనుల విషయంలోనే దేవుడు వాళ్లను బానిసలుగా.. కష్టజీ వులుగా బతకాలని రాస్తాడా? పిడికెడు కులపోళ్లను సకల సంపదల తో తులతూగాలని తలపై గీస్తాడా?. ప్రజల సొత్తు ను దొంగల్లా దోచుకోవాలని ఆ రాతల్లో చేరుస్తాడా?. కనిపిం చిన ఆడదాన్నల్లా పాడు చేయాలని గీకుతాడా? తల రాతలు ఉంటాయని నమ్మేవారికి నాదో సూటి ప్రశ్న.. మీ కుటుంబా నికి చెందిన వ్యక్తిని ఎవరైనా హత్య.. మానభంగం చేస్తే మా తలరాతలు ఇంతే అని సర్దిచెప్పుకుంటారా?.. పోలీసు కేసు నమోదు చేయకుండా ఊరుకుంటారా?. అంతెందుకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు 'నేను ఇవ్వను పో' అంటే అంతా మా తల రాత అని వదిలేస్తారా? నా చిన్నప్పుడు ఒకే కుటుం బానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడితే శ్మశానంలో సామూహిక దహనం చేశారు. ఆ సమయంలో అమ్మా! శవాల నుదుటి మీద రాతలు ఉంటాయంటారు కదా మరి కనిపించడం లేదే అని ప్రశ్నించాను. దానికి ''అవి చదువొద్దు బిడ్డా..' అని సమాధానమిచ్చింది అమాయకురా లైన నా తల్లి. లేకపోతే నుదుటిమీద రాతలు ఎక్కడైనా ఉంటాయా. ఈ దేశ సంపదలో 75 శాతం కేవలం ఒక శా తం వ్యాపారుల వద్దే ఉంది. అంటే వ్యాపారం మాటున ఎం త పెద్ద దోపిడీ సాగుతుందో అర్థం అవుతుంది. ఈ దోపిడీని సమర్ధించే వాళ్లే తలరాతలు అంటూ జనాలను నమ్మిస్తూ వస్తున్నారు. అసలు తలరాతలు ఉన్నాయని ప్రచారం చేసే మనువాదులు ఎందుకు కాయ కష్టం చేయరు. కాయ కష్టం చేసే బహుజనులు దేవుడి గర్భగుడిలోకి ఎందుకు అడుగు పెట్టరు. అంటే వారి కులాలు..వారి ఆచారాలు అంటారు. ఫలానా కులంలో పుట్టాలని దేవుడు రాసిపెట్టాడు కాబట్టి బ్రాహ్మణుడు బ్రాహ్మణ కులంలో .. బహుజనుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో పుడుతున్నాడన్న మాట. కాబట్టే బ్రాహ్మ ణుడు మాత్రమే ఆలయంలో పూజారిగా కొనసాగాలి.. మిగిలిన జనాలు కష్టపడి సంపాదించి తనకు దోచిపెట్టా లంటాడు. అసలు బహుజనులకు లేని ప్రత్యేకత.. బ్రాహ్మ ణులకు ఎక్కడి నుండి వచ్చింది. ఉదాహరణకు మట్టిని పిసి కి ఇటుకలు చేసి గోడలతో గుడిని కట్టేది.. శిలను చెక్కి శి ల్పంగా మార్చి దేవునికి రూపం కల్పించేది.. అభిషేకా నికి పాలు.. నీళ్లు.. అర్చన కోసం పసుపు..కుంకుమ.. పండ్లు.. ఫలాలు అన్నీ తెచ్చేవాడు అవతల ఉండాలా?. వాటిని ఆర గించే వాడు గర్భగుడిలో ఉండాలా? అదేమంటే మీ తల రా త అంతే అంటారా?. పోనీ వాళ్లన్నట్టుగానే తలరాతలు ఉ న్నాయనుకుందాం.. మరి అవి ఎట్లా ఉంటాయో చూపి స్తా రా?. అవి ఏ భాషలో ఉంటాయో చెప్పగలరా? దైవ భాష అంటూ తప్పించుకునే ప్రయత్నాలు వద్దు.. దైవ భాష అంటే మీరు నిత్యం పఠించే సంస్కతమే కదా?. ఆ భాష మీకు ఎట్లాగూ వచ్చు కదా!. ఇప్పటికే చేతి రాతలను బట్టి వర్తమా న భవిష్యత్ను చెప్తుంటారు కదా? దాన్ని జోతిష్య శాస్త్రం అని పిలుచుకుంటారు కదా? అరచేతిలోని గీతలను చదివి జో స్యం చెప్పే మీరు తలరాతలను కూడా చదివి చెప్పొచ్చు కదా ..ఓహౌ .. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అమా యకులను దోచుకోవడానికి అనుకున్నా అనుకుంటారు కొం దరు. ఏం చేస్తాం.. మా జనాలు దేవుళ్లు.. దెయ్యాలనే భ్ర మల నుండి బయట పడే వరకూ మీ మాటలు నమ్ముతూనే ఉంటారు కదా మరి. ఈ దేశంలోని అధికశాతం జనాభా విద్యావంతులుగా మారినప్పుడే ఇటువంటి కట్టుకథలకు కాలం చెల్లుతుంది. తలరాతల పిట్టకథలకు ఫుల్స్టాప్ పడుతుంది. అయితే అప్పటి వరకూ చదువుకున్న మేధావులు తలరాతల కట్టుకథలపై ప్రజలకు వివరించా ల్సిన బాధ్యతను కొనసాగిస్తే మంచిది.
- జంగిటి వెంకటేష్
సెల్ : 9052889696
Authorization