మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది కావటం, అధిక జనాభా, మన ప్రభుత్వ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, ఇవేవి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పరినితికి గీటురాళ్లు కావు. ప్రజలందరూ కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా, ఘర్షణ రహితంగా సమాన ఆర్థిక, రాజకీయ, సామాజిక అవకాశాలను పొందగాల్గుతున్నారని సూచించే గుర్తులు లేవు. తెలుగు రాష్ట్రాలలో, ప్రత్యేకించి తెలంగాణలో కుల అస్తిత్వ ప్రాధాన్యతలు, రాజకీయ ప్రభాల్యాలను గూర్చి చర్చించే ముందు మన రాజ్యాంగ రచన సమయంలో ప్రజాస్వామ్యం పట్ల, పార్లమెంటరీ వ్యవస్థను కోరుకోవటం వెనుక గల వారి మాటల్లో, ముఖ్యంగా అంబేద్కర్ ఏమి చెప్పాడు, చెప్పింది ఈనాడు కూడా విలువ కల్గి ఉందా, ఉంటే ఈ రోజు ఏ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉందో చూద్దాం.
ప్రజాస్వామ్యం గూర్చి సాధారణ అర్థంలో చాలామంది ప్రపంచ పెద్దలు వాఖ్యానించారు. అందులో మనకు బాగా గుర్తుండేది అబ్రహం లింకన్ నిర్వచనం. అయన మాటల్లో ప్రజాస్వామిక వ్యవస్థ అంటే ''ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రలజ కొరకు'' ఎన్నుకోబడిన ప్రభుత్వ వ్యవస్థ''. దీనిని చాలామంది సరైన భాష్యంగా ఉటంకిస్తారు. కానీ అంబేద్కర్ అంతకంటే ఉన్నతమైన, సరళమైన, సంపూర్ణమైన భాష్యాన్ని మన ముందు పెట్టాడు. ఆయన మాటల్లో ''ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ ఏర్పాటు వ్యవస్థ కాదు. అది ఒక సాంఘిక నిర్మాణ వ్యవస్థ''. నిజంగా గొప్ప భావం. స్వేచ్చా, సమానత్వం, సౌభాతత్వం అనే మౌలిక ప్రజాస్వామిక సూత్రాల విస్తతిని అంబేద్కర్ అర్థం చేసుకున్నంతగా మరొకరు చేసుకున్నట్టు అనిపించదు. అయన మాటల్లో, అయన రచనల్లో దేశంలోని అన్ని తరగతుల, అన్ని సమూహాల సమాన సాంఘిక, ఆర్థిక అభివద్ధి కోసం పడిన ఆరాటం కనిపిస్తుంది. ఆవేదన కనిపిస్తుంది. అంత తీవ్రమైన ఆరాటంతో రాజ్యాంగ రచనలో నిమగమైన అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ ''ప్రజస్వామ్య మూలాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోనో లేక మరొక దానిలోనో ఉండవు'' ప్రజల సంఘ జీవన విధానంలో, సాంఘిక సంబంధాలలో మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలు ఉంటాయి'' విభిన్న కులాలకు, భాషలకు, మతాలకు, ప్రాంతాలకు, విశ్వాసాలకు పుట్టినిల్లు అయిన మన దేశం 70 ఏండ్ల స్వరాజ్య పాలనలో ప్రజాస్వామ్యం వ్యవస్థ నుండి ఆశించిన, అంబేద్కర్ కోరుకున్న రీతిలో అన్ని సామాజిక సమూహాలు, సమాన అభివుద్ధిని పొందగలిగాయా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. తెలంగాణ 2014 ఏర్పడిన కొత్త రాష్ట్రం. రాష్ట్రం ఏర్పడక ముందు కానీ ఆ తర్వాత కానీ కుల రాజకీయ ప్రాధాన్యతలలో, కులాల సమతూకంలో వచ్చిన మార్పు ఏమి లేదు.
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ జనాభాలో కులాల వారీ లెక్కలు:
షెడ్యుల్డ్ కులాలు - 63,60, 158, మొత్తం జనాభాలో శాతం 17.5 , షెడ్యుల్డ్ తెగలు - 36,02,288, శాతంలో 9.91. వెనుకబడిన తరగతుల సంఖ్య (112 కులాలు ) 1,85,61,856 అనగా 51.08 శాతం, ఇతరులుగా పిలవబడే వారి సంఖ్య 78,12,858 అనగా 21.5శాతం. ఇక అల్పా సంఖ్యాకులు (ముస్లిం, సిక్కులు, జైనులు (26,690), క్రిస్టియన్స్, బౌద్ధులు కల్పి) - 52,33,710, లేదా 14.46 శాతం. ఇది కుల ముఖ చిత్రం. వెనుకబడిన కులాలు మొత్తం జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నారు . రాష్ట్ర శాసన సభలో జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల కు చెందవలసిన 60 స్థానాలకు గానూ గెలిచింది 20 స్థానాలలో మాత్రమే. అంటే అత్యధిక ప్రజలుగా ఉన్న బీసీలు ప్రజాస్వామ్య దేవాలయాలుగా చెప్పబడే చట్ట సభలకు ఆమడ దూరంలో ఉన్నారు. పార్లమెంట్ విషయంలోను అంతే. మొత్తం 17 స్థానాలకు గాను 3 స్థానాలు దక్కాయి. షెడ్యుల్డ్ కులాలకు, తెగలకు రిజర్వేషన్స్ కారణంగా వారికి చెందవలసిన స్థానాలు వారికి చెందటంలో ఆశ్చర్యం ఏమి లేదు. మరి అగ్ర కులాలు సాధించిన శాసన సభా స్థానాలు బ్రాహ్మణులు - 2, కమ్మ - 6, రెడ్డి -42, వెలమ -9, వైశ్య -1. పార్లమెంట్లో రెడ్డి-6, వెలమ - 2. ఇక ముస్లిం అల్పా సంఖ్యాకులు 8 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్సభా స్థానాలు పొందగాలిగారు. ఇతర ఆల్ఫా సంఖ్య వారికి ప్రాతినిధ్యం లేదు.
ఆంధ్రప్రదేశ్లో కుల ముఖ చిత్రం :
ఇప్పుడు 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్లో అందుబాటులో సమాచారం మేరకు మొత్తం జనాభా 4,93,86,799. ఇందులో ఇతరుల కేటగిరిలో ( కమ్మ, రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు, వెలమ, బలిజ) జనాభా 33.2 శాతంగా ఉన్నారు. ఇతర్రుల 33.2శాతంలో కాపులు 15. 2శాతం అంటే దాదాపు సగం. వెనుకబడిన కులాలు జనాభా 37 శాతంగా ఉంది. ఇందులో చిన్నా చితక చాలా కులాలు ఉన్నాయి. ప్రధానంగా గొల్ల, రజక, మత్స్య, తెలగ, దేవంగా/ సాలి మాత్రమే ఓ మోస్తరు జనాభా కల్గి ఉన్నవి. మిగతా కులాలు ఉనికిలో ఉన్నాయా లేవా అన్నంత తక్కువ జనాభా. ఆల్ఫా సంఖ్యాకులాల్లో ముస్లిం 8.53శాతం, ఇతర ఆల్పా సంఖ్యాకులు 7శాతం, క్రిస్టియన్స్ 1.19శాతంగా ఉన్నారు. షెడ్యుల్డ్ కులాల జనాభా శాతం 16.2శాతం కాగా మాదిగ 7 శాతం, మాలలు 9.7శాతం, షెడ్యుల్డ్ తెగలు 6.2శాతం
శాసన సభా స్థానాలు :
8 శాతంగా రెడ్లుకు 39.5 శాతంగా ఉన్న కమ్మలు 3.3, కాపు/బలిజ /తెగరుపు కాపు(తెలగ) - 25, కొప్పుల వెలమ /వెలమ -9, గౌడ /శెట్టి బలిజ /ఇడిగా 7 స్థానాలు గెలిచారు. మాదిగలు, మాలలు వారికి రిజర్వు చేయబడిన స్థానాలు మినహాయిస్తే మిగతా కులాలలో క్షత్రియలు 5, యాదవ్/ కురుబ్ 4, మత్సకారులు 4, వైశ్య 2, గవర 2, బోయ 2, బ్రాహ్మణ 1 , లింగాయాత్ 1 , కళింగా 1, ముస్లింలు 4 స్థానాలు గెలిచారు.
స్థూలంగా చూస్తే అటు తెలంగాణలో కాని ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్కటే విషయం అర్థం అవుతుంది. ఒక్కటి రెండు కులాలు పాలక కులాలుగా చెలామణి అవుతున్నాయి. సంఖ్యాపరంగా ఎక్కువ జనాభా కలిగి ఉన్న వెనుకబడిన కులాల వారు తెలంగాణలో ఇటు ఆంధ్రలో ఎన్నడూ పాలిత కులాలే. కొన్ని పాలిత కులాల చేతిల్లో రాజ్యాధికారం, ఆర్థిక, సామాజిక వనరులు ఉన్నంత కాలం మన ప్రజా స్వామిక వ్యవస్థ పరిణితి చెందినదిగా పరిగనించలేం.
- హరిమూర్తి
సెల్ : 8686040254
Authorization