పూర్వ కాలంలో నెలసరిలో ఉన్న మహిళలకు కావల్సిన విశ్రాంతి ఇవ్వటం కోసం దేవుడికి పూలు తీసుకురావటం, పూజించటం, అన్న ప్రసాదాల తయారీ, వంట గది పనులు నిర్వహించటం లాంటి విధులకు మినహాయింపునిచ్చేవారు. నిర్మాణాకృతుల్లో భాగంగా మన ఆలయాలన్నీ ఎత్తైన మండపాల మీద నిర్మింపబడ్డాయి. మెట్లు ఎక్కడం కష్టం. అందుకే దేవాలయ సందర్శన నుండి మినహాయించారు. దీనిని పురుషాధిక్య సమాజం తమకు అనువుగా 'ఆలయ ప్రవేశం నిషిద్ధం, దేవుడు పూలు తాకటం నేరం' లాంటి నియమాలు పెట్టి పూజ నిర్వహణకి అనర్హులని ప్రకటించారు. నెలసరి సమయంలో ఉన్న మహిళలు వంట చేస్తే వండిన పదార్థాలు పాడైపోతాయని వక్ర భాష్యం చెప్పి దేవుని ప్రసాదాన్ని తాకటాన్ని కూడా మహా పాపంగా అభివర్ణించారు. మరో అడుగు ముందుకేసి ఆ సమయంలో మహిళలు ఇతరుల్ని కూడా తాకవద్దని నియమం పెట్టి అంటరాని వారుగా పరిగణించారు.
నెలసరి కారణంగా అపవిత్రత ఆపాదిస్తే బాలికలు మొదటగా రజస్వలైనపుడు ఎందుకు సింహాసనం వేసి, దేవతగా పరిగణించి వేడుకచేసుకుంటారు. మహిళలకి నెలసరి వస్తే అపవిత్రత, అసలే రాకపోతే గర్భం దాల్చే ఆస్కారం లేదు కాబట్టి దురదృష్టవంతురాలు అనే భావన తొలగించాలి. శారీరకంగా స్త్రీ దేహంలో జరిగే మార్పులు వారి మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతాయి. మనం చూపించే వివక్ష కారణంగా సమస్య తీవ్రత పెరుగుతుంది. ఫలితంగా మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడ్తున్నారు.
మహిళలకి ఆలయ ప్రవేశంపైన దేశ అత్యున్నత న్యాయస్థానం సాక్షిగా సాగిన చర్చలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ శబరిమల ఆలయ ప్రవేశం కల్పించాలనీ, ప్రజారోగ్యం, శాంతి భద్రతలు, అనైతికత కారణంగా మాత్రమే ఒక వ్యక్తిని నిలువరించటం సాధ్యమౌతుందని వ్యాఖ్యానించింది. మతాచారాలన్ని రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండాలని చెప్పి రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడింది. రుతుస్రావం కారణంగా అపవిత్రులౌతారన్న ఉద్దేశంతో 10-50 సంవత్సరాల వయసు బాలికలు / మహిళల్ని ఆలయంలోకి నిషేధించటం కోసం ట్రావెన్కోర్ దేవస్థానం చేసిన ప్రయత్నాలు చర్చనీయాంశమయ్యాయి. దేశవ్యాప్తంగా మసీదుల్లోకి మహిళల్ని అనుమతించటం లేదని, అయ్యప్ప ఆలయంలోను శతాబ్దాల తరబడి ఒక నమ్మకంతో ఈ సాంప్రదాయం కొనసాగుతుందని దేవస్థానం తరపున న్యాయవాది చేసిన వాదనలు ముస్లిం మతాచారాలను కూడా ప్రశ్నించేవిగా ఉన్నాయి.
రాజ్యాంగంలోని 25 నుండి 28 వరకు అధికరణలు మత స్వాతంత్య్రపు హక్కుల్ని తెలియజేస్తాయి. ప్రత్యేకంగా 25వ, 26వ అధికరణలు ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రభోదానుసారం ఏ మతాన్నైనా అవలంబించి ఆచరించి ప్రచారం చేసుకోవచ్చు. మత, ధార్మిక సంస్థలను నిర్వహించుకోవచ్చు. అయితే ఈ స్వేచ్ఛ ప్రజా శాంతికి, నైతికతకు, ప్రజారోగ్యానికి భంగం కలిగించరాదు. అంతేకాని, ఎక్కడా మహిళల నిషేధానికి సంబంధించిన దాఖలాలు లేవు. ఆలయ ప్రవేశ నిషేధానికి హిందూ ధర్మశాస్త్రాల్లో గాని, మరే ఇతర మత గ్రంథాల్లో గాని ప్రస్తావన ఉందా అన్న విషయాన్ని నిగ్గు తేల్చాల్సి ఉంది. స్త్రీ దేహంలో జరిగే ఒక జీవ భౌతిక చర్య రుతుస్రావం. మన అందరి పుట్టుకకి కారణమైన విశిష్ట ప్రక్రియ. అలాంటి క్రియ జరుగుతున్న సమయంలో మహిళలు అపవిత్రులౌతారని ఆలయ ప్రవేశం నిరాకరించటం సమంజసమా? అయినా ఇది ఆచరణలో ఉంది. ఈ సాంప్రదాయం పుట్టుకకు గల కారణాలు తర్వాత సంతరించుకున్న మార్పుల గురించి చర్చ జరగాల్సి ఉంది.
పూర్వ కాలంలో నెలసరిలో ఉన్న మహిళలకు కావల్సిన విశ్రాంతి ఇవ్వటం కోసం దేవుడికి పూలు తీసుకురావటం, పూజించటం, అన్న ప్రసాదాల తయారీ, వంట గది పనులు నిర్వహించటం లాంటి విధులకు మినహాయింపునిచ్చారు. నిర్మాణాకృతుల్లో భాగంగా మన ఆలయాలన్ని ఎత్తైన మండపాల మీద నిర్మింపబడ్డాయి. మెట్లు ఎక్కడం కష్టం. అందుకే దేవాలయ సందర్శన నుండి మినహాయించారు. దీనిని పురుషాధిక్య సమాజం తమకు అనువుగా 'ఆలయ ప్రవేశం నిషిద్ధం, దేవుడు పూలు తాకటం నేరం' లాంటి నియమాలు పెట్టి పూజ నిర్వహణకి అనర్హులని ప్రకటించారు. నెలసరి సమయంలో ఉన్న మహిళలు వంట చేస్తే వండిన పదార్థాలు పాడైపోతాయని వక్ర భాష్యం చెప్పి దేవుని ప్రసాదాన్ని తాకటాన్ని కూడా మహా పాపంగా అభివర్ణించారు. మరో అడుగు ముందుకేసి ఆ సమయంలో మహిళలు ఇతరుల్ని కూడా తాకవద్దని నియమం పెట్టి అంటరాని వారుగా పరిగణించారు.
నెలసరి కారణంగా అపవిత్రత ఆపాదిస్తే బాలికలు మొదటగా రజస్వలైనపుడు ఎందుకు సింహాసనం వేసి, దేవతగా పరిగణించి వేడుకచేసుకుంటారు. మహిళలకి నెలసరి వస్తే అపవిత్రత, అసలే రాకపోతే గర్భం దాల్చే ఆస్కారం లేదు కాబట్టి దురదృష్టవంతురాలు అనే భావన తొలగించాలి. శారీరకంగా స్త్రీ దేహంలో జరిగే మార్పులు వారి మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతాయి. మనం చూపించే వివక్ష కారణంగా సమస్య తీవ్రత పెరుగుతుంది. ఫలితంగా మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడ్తున్నారు. చివరికి ఋతు చక్రాన్ని నిలువరించే మందులు వేసుకుని దేవాలయాలకు వెళ్లే పరిస్థితి దాపురించింది. అది మహిళల ఆరోగ్యంపై తీవ్ర పరిణామాలు చూపిస్తుంది. దేవాలయ ప్రవేశ నిరాకరణకు హిందు మత పెద్దలు చూపిస్తున్న మరొక కారణం... పూజలు చేయటం వలన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఈ శక్తి ప్రయాణం ఊర్ధ్వ ముఖ దిశలో ఉంటుంది. నెలసరి సమయంలో ఉన్న స్త్రీ దేహంలో కూడా అపారమైన శక్తి విడుదల జరుగుతుంది. ఇది కింది వైపుగా ప్రయాణిస్తుంది. ఈ రెండు శక్తుల ప్రసరణ దిశల్లో వైరుధ్యాన్ని తొలగించటానికి ఆలయ ప్రవేశం నిషిద్ధమని చెప్తున్నారు. కాని దీనికి ఎలాంటి సహేతుక ఆధారాలు లేవు. ఆహారం శక్తికి మరో రూపం. ఆహారం తీసుకుని అలయాలని సందర్శించినపుడు ఆహార, ఆధ్యాత్మిక శక్తి ప్రసరణ మార్గాలు కూడా వ్యతిరేక దిశలో ఉంటాయి. మరి భక్తులంతా ఆహారం సేవింపకుండా ఆలయాలు సందర్శించాలనే కఠిన నియమమేమి లేదు కదా? ఇది భక్తుల విచక్షణకు ఏ విధంగా వదిలేసారో మహిళల విషయంలో కూడా అలాగే వదలివేయాలి.
బౌద్ధాయన ధర్మసూత్రం ప్రకారం ''మనస్సు, వాక్కు, కర్మల ఫలితంగా వచ్చిన తాత్కాలిక అపవిత్రతని స్త్రీలు ప్రతి నెలా వచ్చే రూతుస్రావం రూపంలో తొలగించుకొని పవిత్రులౌతారు. కానీ వారు ప్రతి నెలకోసారి అపవిత్రులు కారు'' ఇలా ప్రతి నెలా పవిత్రులయ్యే మహిళలు ఆలయ ప్రవేశానికి అనర్హులైతే అలాంటి ఏర్పాటే లేని పురుషులు అర్హులా? సనాతన సాంప్రదాయ వాదులకి ఇలాంటి చర్చలు చేదుగా అన్పించవచ్చు. ఎందుకంటే వారికి విషయం తెలియదు. తెలిసినా విడమర్చి చెప్పటం కన్నా దాచి ఉంచటమే వారికి ఇష్టం. అప్పుడే కదా వాళ్ల ఆధిపత్యం కొనసాగేది. ముస్లిం మతంలో కేవలం కొన్ని ప్రత్యేక దినాలలో మాత్రమే మహళల్ని మసీదుల్లోకి అనుమతిస్తారు. ఎందుకని ప్రశ్నిస్తే అల్లాను భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలని ఆడ, మగ పక్కపక్కన ఉండి అలా ప్రార్థించడం సాధ్యం కాదన్నది వారి వాదన. అనగా భావోద్వేగాలను నియంత్రించుకోలేక మహిళల్ని నిషేధించారన్న మాట.క్రైస్తవ మతంలో ఈ సాంప్రదాయం ఆచరణలో ఉంది. ఎలాంటి నియమనిబంధనలు లేకపోయినా హిందూమతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన మహిళలు తాము నెలసరి సమయంలో ఉన్నప్పుడు క్రైస్తవ దేవాలయాలకు వెళ్లకుండా తమకు తాముగా పూర్వపు సాంప్రదాయాన్నే ఆచరిస్తున్నారు. మహిళలు అన్నింటా సగం, ఆకాశంలోను సగం అంటున్నారు. మతాలు తమని తాము సంస్కరించుకోవాలి. ఇది అనునిత్యం జరగాల్సిన ప్రక్రియ.
- అన్నమనేని వేణు
సెల్ : 9177382427
Authorization