'కూలినాలి జేస్కొని బతికే మాదిగనా కొడుకుల్లారా...నల్లమట్టి అమ్మకాల డబ్బులు కావాల్నారా మీకు? పొర్లిచ్చి తన్తం. మిమ్ముల్ని కొడ్తే అడుగనీకి కుక్కలు కూడా రావు. మీ తాతముత్తాలెవడు గిట్ల ఎదిరించలే. ఇప్పటికైనా చెబుతున్నం. మీ మానాన మీరుడుండి. లేకపోతే, మీ ఇంట్ల ఆడోళ్లు కూడా మీ దిక్కు చూడకుండ బొక్కలిరుస్తం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఉందని విర్ర వీగుతున్నార్రా? ఆ చట్టం ఎప్పుడో తుంగల కల్సిందిరా' అంటూ నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం బావాజిపల్లి దళితులపై ఆ గ్రామ పెత్తందార్లు దాడులకు పూనుకున్నారు. భయభ్రాంతులకు గురిచేశారు. బాధితులు ఫిర్యాదు చేసి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటన ఆనోటా..ఈనోటా పొక్కి ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు పెత్తందార్లకు కొమ్ముకాస్తూ రాజీ కుదిర్చే యత్నాలు చేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి.
బావాజిపల్లి గ్రామ జనాభా 2600. అందులో దళితులు ఐదొందల మందిదాక ఉంటారు. ఐదారుగురు రెడ్డి సామాజిక తరగతివారు మినహా మిగతా వారంతా బీసీలే. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో భాగంగా రిజర్వాయర్ నిర్మాణానికి ఆ గ్రామ సమీపంలోగల చెరువులోని నల్లమట్టిని తరలిస్తున్నారు. ఆ గ్రామంలో కొందరు పెత్తనం చెలాయిస్తున్నారు. చెరువు నల్లమట్టిని తమకు సమాచారం లేకుండా ఎలా తరలిస్తారని దళితులు, గ్రామస్తులు అడ్డుచెప్పారు. దీంతో హెచ్ఈఎస్ కంపెనీవారు ఆ గ్రామానికి రూ15 లక్షలిచ్చారు. ఆ డబ్బుల్ని కొంతమంది పెత్తందారులు తమ వద్ద ఉంచుకున్నారు. తమ పంట పొలాల సమీపంలో ఉన్న చెరువుమీద తమకూ అధికారం ఉందని, కాలనీలో రోడ్లు వేయించుకునేందుకు తమ వాటా డబ్బులు ఇవ్వాలని పెత్తందారులను దళితులు అడగ్గా...రూ.3 లక్షలు ఇస్తామన్నారు. గ్రామంలో మెజార్టీ కుటుంబాలున్న తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా ఇవ్వాల్సిందేనని దళితులు పట్టుబట్టారు. 'ఎస్సీలకు రూ.4 లక్షలకు మించి ఇవ్వం' అంటూ పెత్తందారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. వాళ్లను ఎదిరించలేక దళితులు ఊరుకున్నారు. చెరువు మట్టినమ్మిన తర్వాత రోడ్డు మరమ్మతు చేయాలని, పనికి రావాలని దళితులను పెత్తందారులు పిలిచారు. కానీ, చాలా మంది దళితులు పనికి వెళ్లలేదు. దీంతో పెత్తందార్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'మాదిగ లం..... బలుపు ఎక్కువైంది. డబ్బులు కావాలని గట్టిన అడిగిన పెద్దమనుషులు యాడికోయిండ్రు... డబ్బులడిగే మొగోళ్లయినార్రా?.. మీ సంగతి చూస్తం... మమ్మల్నిగాదని ఊర్ల ఎట్ట బతుకుతర్రా?..మీ తాత ముత్తాలెవ్వడు గిట్ట మమ్ముల్ని ఎదిరించలే.. మీకే బలుపు ఎక్కువైంద్రిరా...' అంటూ రాయటానికి వీల్లేని పరుషపదలాజంతో తిడుతూ ఎస్సీ యువకులపై దాడిచేసే యత్నం చేశారు. తక్కువ సంఖ్యలో ఉన్న దళిత యువకులు అక్కడి నుంచి తప్పించుకుని ఇండ్లకు వెళ్లిపోయారు. అదేరోజు సాయంత్రం దళితుల ఇండ్ల వద్దకెళ్లి మరీ గొడవకు దిగారు. దళితులైన యాదయ్య, బంగారయ్యపై దాడి చేశారు. కృష్ణయ్య ఇంటికాడ లేకపోవటంతో అతని భార్య బంగారమ్మపై దాడి చేశారు. దీంతో కొంతమంది దళితులు భయంతో కాలనీ వదిలి పారిపోయారు. కాలనీలోకి వచ్చి దాడులు చేసిన వారిలో గొల్ల వెంకటేష్, అంజనేయులు, బత్తుల వెంకటేష్, అప్పలస్వామి, ఉప్పరి మహి బూన్, కనికే శేఖర్, ఎడ్ల కిష్టయ్య, ఈరయ్య, తిర్పతయ్య, బంగారయ్యతో పాటు అనేక మంది ఉన్నారు. తెల్లవారుజామున పెద్దమనుషుల ఎదుట రాజీయత్నం చేయబోగా అక్కడా తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నించారు. భయంతో తిమ్మా జీపేట పోలీస్స్టేషన్కు వెళ్లి దాడుల నుంచి త మను కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొంతమంది పెత్తందార్ల ఒ త్తిడికి లొంగి మూడ్రోజులైనా కేసు నమోదు చే యలేదని దళితులు ఆరోపిస్తున్నారు. గతంలో నూ ఇలాంటి ఘటనలు గ్రామంలో జరిగాయని, చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన దళితులపైనా, శివమాల వేసుకొని గుడిలోకి పోయిన దళిత యువకులపైనా దాడులు చేశారని వాపోతున్నారు. ఇప్పటికీ కొందరు ఆధిపత్యవాదులు దళితులను తమ ఇండ్లలోకి రానివ్వని పరిస్థితి ఆ గ్రామంలో ఉంది.
కేసులు నమోదు చేయాలి
పెత్తందారులు మూకుమ్మడిగా దళితవాడపై పడి దాడులకు దిగడం అత్యంత దుర్మార్గం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దళితులపై దాడిచేసిన పెత్తందారులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి. లేనిపక్షంలో ఆందోళనలకు దిగుతాం.
- అంతటి కాశన్న, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు
పశువులకంటే హీనంగా చూస్తున్నరు
చెరువు మట్టిని అమ్ముకోవడంపై అడిగితే దాడులు చేస్తున్నరు. అనరాని మాటలంటున్నరు. మేం ఏం మాట్లాడకున్నా బండబూతులు తిడుతూ కొడుతున్నరు. మహిళలని కూడా చూడట్లేదు. పశువుల కన్న హీనంగా మారినయి మా బతుకులు.
- బాలయ్య, దళితుల పెద్దమనిషి, బావాజిపల్లి
సమస్య పరిష్కరిస్తా
బావాజీపల్లి దళితులు ఫిర్యాదు చేశారు. చెరువు మట్టి అమ్మకాల విషయంలో గొడవలు జరిగాయి. కేసు బుక్ చేయాలని ఒకరంటున్నారు. అవతలి వ్యక్తులేమో మాట్లాడుకుంటామని చెబుతున్నారు. సమస్యను పరిష్కారించేందుకు ప్రయత్నిస్తున్నాం.
- ఎస్ఐ శ్రీనివాస్, తిమ్మాజీపేట, నాగర్కర్నూల్ జిల్లా
- పరిపూర్ణం
సెల్ : 9490099324
Authorization