ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం-1989 ప్రకారం కేసు నమోదైతే తక్షణమే ఎవ్వరినీ అరెస్ట్ చేయకూడదనీ, కనీసం డీఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక విచారణ జరిపి, ఆరోపణల్లో నిజా, నిజాలు తెలుసుకున్న తర్వాతనే వారిని అరెస్ట్ చేయాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే వారి సంబంధిత డిపార్ట్మెంట్ పెద్దల అనుమతి పొందిన తర్వాత మాత్రమే అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఆయుధంగా చేసుకొని కొందరు దళిత ఉద్యోగులు తప్పుడు కేసులతో బెదిరిస్తూ, విధి నిర్వహణలో అడ్డు తగులుతున్నారనీ, అమాయకులైన అగ్రవర్ణాల ఉద్యోగులను, పౌరులను వేధిస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయనీ ధర్మాసనం పేర్కొనడం అత్యంత దారుణం. ఇది న్యాయమూర్తుల నైతికతకు నిదర్శనం. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ! ''మేం చట్టంలో ఒక్క పదం చేర్చలేదు, ఒక్క పదాన్ని కూడా తొలగించలేదు. కేవలం ముందస్తు అరెస్టులు చేయరాదు, బెయిల్స్ ఇవ్వచ్చు అని మాత్రమే చెప్పాం'' అంటున్నారు. చట్టంలో అన్ని అంశాలు పొందుపరచబడి ఉన్నప్పుడే ప్రభుత్వాలు దళిత, బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులను ఆపలేకపోతున్న దుస్థితిలో ఉంటే, ఇక అరెస్టులు, బెయిల్స్పై సడలింపు ఇస్తే దళితులపై దాడులు జరగవనే హామీని న్యాయస్థానాలు ఇవ్వగలవా?
త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, కూల్చేసిన మరుసటి రోజే తమిళనాడులో పెరియర్ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో తమిళనాడులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘ్ పరివార్కు పెరియర్ రామస్వామి అంటే ఎందుకంత కోపం? ఆయన ఎవరు? ఆయన సిద్ధాంతం వారికి ఎందుకు నచ్చలేదో తెలుసుకుంటే పెరియర్ సమాజానికి చేసిన సేవలు ఏమిటో తెలుస్తుంది.
భారతీయ సమాజంలో కుల వ్యవస్థ నరనరాల్లో జీర్ణించుకొని అన్ని రంగాల్లో అసమానతలు పెరగడానికి కారణమైంది. ఈ అసమానతలను రూపుమాపడానికి సాహు మహరాజ్, నారాయణ గురు, రామస్వామి పెరియర్ వంటి సామాజిక విప్లవవీరులు చేసిన త్యాగఫలితంగా భారతదేశం స్వేచ్ఛా, సమానత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయాలు పునాదులుగా ఏర్పడిన భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూనే సమసమాజ నిర్మాణానికి దోహదం చేశారు. దక్షిణ భారతదేశ ప్రజలచే ముఖ్యంగా తమిళనాడు ప్రజలచే పెరియర్గా తాన్ తై పెరియర్గా ఆత్మీయంగా పిలవబడే ఈరోడ్ వెంకట రామస్వామి 1879లో ఈరోడ్లో ఇదే రోజు జన్మించారు. సంఘ సంస్కర్తగా, హేతువాదిగా, ఆత్మగౌరవ ఉద్యమ నిర్మాతగా ద్రావిడ ఉద్యమ సారథిగా ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రజలు ఆయనను పెరియర్గా పిలుచుకునేవారు. 'పెరియర్' అంటే 'పెద్ద మనిషి' అని అర్థం.
సమాజంలో ఆయన కుల, మత, వర్గ ఆధిపత్యాలపై తిరుగుబాటు చేశాడు. కుల, మత రహిత సమసమాజం కావాలని ఆయన ఆకాంక్ష. కానీ నిన్నగాక మొన్న పరువు హత్య జరిగిన తరుణంలో పెరియర్ జయంతిని నిర్వహించుకుంటున్నామంటే ఆయన ఆకాంక్ష ఇంకా అలాగే ఉంది. మహిళలకు సమాన హక్కులు కావాలని ఆయన కాంక్షించారు. పెరియర్ ముఖ్యంగా సమాజంలో ప్రధానంగా నెలకొని ఉన్న బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దక్షిణ భారతానికి చెందిన ద్రావిడులపై ఉత్తరానికి చెందిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించేది లేదని స్వీయభావన ఉద్యమాన్ని నిర్మించారు. అగ్రవర్ణాలు తమ ఆధిప త్యాన్ని కొనసాగిం చడం కోసమే ఈ దేవుండ్లు, గుడులు, గోపురాలను నిర్మి స్తూ పనికిమాలిన పురాణా లను సృష్టించారని ప్రచారో ధ్యమాన్ని సాగించడం ద్వారా ఆయన ప్రముఖ హేతువాదిగా పేరు పొందారు. హేతువాదం, ఆత్మగౌరవం, స్త్రీ హక్కులు, కుల నిర్మూలన కోసం పెరియర్ చేసిన పోరాటం అప్పటికీ, ఇప్పటికీ ఒక చరిత్రగా మిగిలిపోతుంది. మూల-ద్రావిడ వాసులైన బ్రాహ్మణేతరులను, భార తదేశానికి చెందిన బ్రాహ్మ ణులు దోపిడీ చేయడాన్ని అణివేయడాన్ని వ్యతిరేకించారు. తమిళ సమాజాన్ని విప్లవ మార్గంలో నడిపి కుల వివక్షతను తొలగిం చడానికి తీవ్రంగా కృషి చేసిన వ్యక్తిగా తమిళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి పెరియర్ రామస్వామి. అందుకే ఆయ నను ఆధునిక కాల ప్రవ క్తగా, ఆగేయ ఆసియా సోక్రటిస్గా, సామాజిక విప్లవ పితామహుడిగా, అజ్ఞానం, అంధ విశ్వాసాలు, అసంబద్ధమైన అచిర వ్యవహారాల ను వ్యతిరేకించే వారిగా యునెస్కో అభివర్ణించింది.
''దేవుడు లేడు, దేవుడు లేడూ, అసలు దేవుడే లేడు'' అనే నినాదంతో పెరియర్ సాగించిన ఉద్యమం ప్రధానమైనది, కుల, మత వ్యత్యాసాలు కలిగిన భారతదేశం తనకు వద్దని, కుల, మత రహితమైన భారతమే తనకు కావాలని పోరాటం చేశాడు. కుల, మతాలను రాజ్యాంగం నిషేధించినప్పుడే కుల, మత రహిత స మాజం ఏర్పడుతుందని ఆయన వాధించాడు. హిందుత్వ వా దా న్ని గట్టిగా వ్యతిరేకించారు. కాబట్టే వారికి పెరియర్ అంటే గిట్ట డం లేదు. పెరియర్ తన ఆశయాల సాధన కోసం 1939లో జ స్టిస్ పార్టీ పెట్టారు. 1944లో జస్టిస్ పార్టీని 'ద్రావిడ్ దార్ కళ గ ం'గా మార్చారు. ఈ పార్టీ సామాజికోద్యమానికే ప్రాధాన్యతని చ్చి ఎన్నికలకు దూరంగా ఉండి మరీ పోరాటం చేసింది. అంట రానితనం, కులం, వర్ణ వివక్షత తీవ్రంగా ఉన్న దేశంలో ప్ర జల తో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, వారి మధ్య ఉన్న సా మాజి క ఆర్థిక సమానత్వాన్ని సాధించడం కుల వ్యవస్థను దోపిడీ మ యమైన సాంప్రదాయాలను నిర్మూలించడమే పెరియర్ ధ్వేయం. హిందూ మతం ఆపాదించిన తరతరాల బానిసత్వాన్ని వదిలించుకునేందుకు దేవుడు ఒక్కడే, మనుషులంతా ఒక్కటే అని చాటడం మంచిదని ప్రభోధించాడు. ఎప్పుడు ఆయన భావాలు, ఆలోచనలు విప్లవాత్మకమైనవిగానే ఉండేవి.
దేశం కుల, మత కంపులో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మత దురహంకారాన్ని వ్యతిరేకిస్తూ శాస్త్రీయ, హేతుబద్ధమైన జీవన విధానాన్ని అవలంభించిన రోజు ఈ రోజు. ఆత్మగౌరవ పోరాటాలు చేసిన దళితులు, స్త్రీలు, బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోసి, తన చివరి శ్వాస వరకు సమసమాజం కోసం పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడు పెరియర్ రామస్వామి. జయంతిని బహుజనులందరు కలిసి ఒకే ఉత్సవంలాగా నిర్వహించాలి. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న లైంగికదాడులు, పరువు హత్యలను నివారించాలంటే ఈ దేశ యువతకు పెరియర్ జీవితాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మతం పేరుతో కులం పేరుతో జరుగుతున్న దాడులను అరికట్టాలంటే ఆయన ఉద్యమాలు ప్రజలకు తెలియాలి. పెరియర్ రాసిన ''వ్యక్తిత్వాన్ని గౌరవించే పెండ్లీలు'' అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివితే వివాహ వ్యవస్థపై ఒక స్పష్టత వస్తుంది. కొంత వరకైనా పరువు హత్యలను మనం నివారించవచ్చు. అందుకే బహుజనులందరు పెరియర్ జయంతి నిర్వహిస్తూ సమాజంలో నెలకొన్న అసమానతలపై పోరాటం చేయాలి. ఇదే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి.
- అనంతోజు మోహన్ కృష్ణ
సెల్ : 8897765417
Authorization