పోరాట సమయంలో స్వాతంత్ర వీరులని ప్రజలు ఆరాధిస్తే సమకాలిన ప్రభుత్వాలు మాత్రం వారిని ద్రోహులుగా చిత్రీకరించడం చరిత్రలో మామూలై ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రజలు కొమురం భీం దైవంస సంభూతుడన్నారు. నిజాం సైన్యం మాత్రం కొమురం భీంను ద్రోహిగా చిత్రీకరించింది. అందుకే దట్టమైన అడవుల్లో ఉన్న 'జోడే ఘాట్' గుట్టల్లో గెరిల్లా అర్మీని తయరు చేసి నిజాం సైన్యం, అటవీ సిబ్బందిపౖౖె విరుచుకుపడ్డాడు. కొమురం భీం తిరుగు బాటుతో నిజాం సర్కార్ పెత్తందార్ల వెన్నులో వణుకుపుట్టింది. భీం తిరుగుబాటును అణచడానికి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. భీం తుపాకీకి ఎదురు లేదు. నిజాం సైన్యాన్ని భీం గెరిల్లా ఆర్మీ ముప్పు తిప్పలు పెట్టింది. పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన నిజాం సర్కార్ దిగొచ్చింది. చర్చలు జరిపి గిరిజన భూములకు పట్టాలు ఇస్తామని చెప్పింది. అయితే 'మాకు కావాల్సింది కేవలం పట్టాలు కాదు, నిజాం సర్కార్ దుర్మార్గపు చట్టాలు, న్యాయస్థానాలు, సుంకాలు, పన్నులు లేని సర్వాధికార స్వయం ప్రతిపత్తి ఆదివాసీ గ్రామాలకు కావాలి'' అని భీం తేల్చి చెప్పాడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం జోడేఘాడ్ సంకేనపెల్లి గ్రామంలో 1900 సంవత్సరంలో కొమురం భీం జన్మించాడు. భీంకి 15 ఏండ్లు ఉన్నప్పుడే తండ్రిని అటవీ అధికారులు చంపేశారు. దీంతో భీం కుటుంబం కరిమేరి మండలం సుర్దాపూర్కు తరలివెళ్లింది. అక్కడ కూడా అదే దౌర్జన్యం.
నిజాం పాలెగాళ్లు గూడేలను దోచుకున్నారు. అడవిలోకి వెళ్లడానికి గిరి పుత్రుల నుండి పన్నులు వసూలు చేసేవారు. 'మేక మేత మేస్తే మేక పట్టి, దుంప తెస్తే దుంప పట్టి' దోపిడీ దొంగల్లా గోండు గూడేలఫై బడి ఏది దొరికితే అది దోచుకుతిన్నారు. పోడు (వ్యవసాయం) కోసం అడవి నరికితే, చేతి వేళ్ళు నరికేశారు. పిల్లలను కూడా మినహాయించకుండా అందరిని గొడ్డును బాదినట్లు బాదారు. ఇక ఆడవాళ్లను ఎత్తుకపోయి చేసే అఘాయిత్యాల ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన చుట్టూ జరుగుతున్న ఈ దౌర్జన్యాలను కొమురంభీం సహించలేకపోయాడు. సరిగ్గా అప్పుడే భీం కుటుంబం సాగుచేస్తున్న భూమిని 'సిద్దిభి' అనే జాగిర్దార్ తనకు వదిలి పెట్టాల్సిందిగా బెదిరించాడు. 'తల వంచుకొని బతుకుతుంటే తరుముతున్నారు, ఎక్కడికి పారిపోయి బతకాలి, ఎందుకు బయపడాలి ' అంటూ ప్రళయ గర్జనలో భీంలో దిక్కారస్వరం ప్రతిధ్వనించింది. సిద్దిభి తలఫై కట్టెతో గట్టిగా కొట్టాడు. సిద్దిభి అక్కడికక్కడే చనిపోయాడు. ఇది కొమురం భీం పోరాటానికి ఆరంభ సూచికగా చెప్పవచ్చు.
నిజాం తొత్తు సిద్దిభిని చంపడంతో పోలీసులు భీం ని వేటడారు. దీంతో అస్సాంలో ఏండ్లపాటు ఆజ్ఞాత జీవితం గడిపాడు. అక్కడ చదవడం రాయడం నేర్చుకొని ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఎన్నో పోరాట గాథలు విని పోరాట స్ఫూర్తి నింపుకున్నాడు. బాభి ఝారి చుట్టుపక్కల తన నాయకత్వంలో ఉన్న 12 గ్రామాల్లో 'మా గ్రామం, మా స్వరాజ్యం' అనే నినాదాన్ని అబ్దుల్ సత్తార్ అనే తాలుక్దారుతో ఒప్పించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది.అక్కడి నుంచి సుర్దాపూర్కి తిరిగొచ్చి పెత్తందారి వ్యవస్థ కింద నలుగుతున్న తన జాతి విముక్తి కోసం 'జల్ జంగల్ జమీన్' (నీరు, అడవి, భూమి) తమదే అంటూ గర్జించాడు. ఆదివాసీ గూడేల్లో అగ్గి పుట్టింది, ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. అదే స్వయం పాలన. 12 గ్రామాలతో స్వతంత్ర గోండు రాజ్యం కావాలని ఆసిఫాబాద్ కలెక్టర్తో చర్చలు జరిపాడు. పరిష్కారం దొరకలేదు. దీనితో నిజాం రాజును కలవడానికి హైదరాబాద్ వెళ్లాడు. కానీ నిజాం నుండి అనుమతి దొరకలేదు. ఇక గెరిల్లా పోరాటంతోనే నిజాం సైన్యాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు.
పోరాట సమయంలో స్వాతంత్ర వీరులని ప్రజలు ఆరాదిస్తే సమకాలిన ప్రభుత్వాలు మాత్రం వారిని ద్రోహులుగా చిత్రీకరించడం చరిత్రలో మామూలై ఇక్కడ కూడా అదే జరిగినది. ప్రజలు కొమురం భీం దైవంస సంభూతుడన్నారు. నిజాం సైన్యం మాత్రం కొమురం భీంను ద్రోహిగా చిత్రీకరించారు. అందుకే దట్టమైన అడవుల్లో ఉన్న 'జోడే ఘాట్' గుట్టల్లో గెరిల్లా అర్మీని తయరు చేసి నిజాం సైన్యం, అటవీ సిబ్బందిఫై విరుచుకుపడ్డాడు. కొమురం భీం తిరుగు బాటుతో నిజాం సర్కార్ పెత్తందార్ల వెన్నులో వణుకుపుట్టింది. భీం తిరుగుబాటును అణచడానికి తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగించింది. భీం తుపాకీకి ఎదురు లేదు. నిజాం సైన్యాన్ని భీం గెరిల్లా ఆర్మీ ముప్పు తిప్పలు పెట్టింది. పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన నిజాం సర్కార్ దిగొచ్చింది. చర్చలు జరిపి గిరిజన భూములకు పట్టాలు ఇస్తామని చెప్పినప్పటికీ 'మాకు కావల్సింది కేవలం పట్టాలు కాదు, నిజాం సర్కార్ దుర్మార్గపు చట్టాలు, న్యాయస్థానాలు, సుంకాలు, పన్నులు లేని సర్వాధికార స్వయం ప్రతిపత్తి ఆదివాసీ గ్రామాలకు కావాలి'' అని భీం తేల్చి చెప్పాడు. దీనిలో ఎలాగైనా భీంని అంతం చేస్తే తప్ప తిరుగుబాటు ఆగదని నిజాం సర్కార్ భావించింది. భీం దగ్గర హవాల్దార్గా పనిచేసే కుర్దు పటేల్ అనే నమ్మక ద్రోహిని లోబరుచుకుంది. దీంతో భీం స్థావర రహస్యం నిజాం సర్కారుకు తెలిసింది. కొమురం భీం భుజాన తుపాకి ఉంటే ఏమౌతుందో నిజాం సర్కార్కు బాగా తెలుసు. అందుకే బ్రిటిష్ ఆర్మీ సహాయంతో అర్ధరాత్రి సమయంలో చుట్టుముట్టింది. శత్రువులను చూసి గెరిల్లా వీరులు ఏమాత్రం బెదరలేదు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి అయుధాలతో ప్రతిఘటించారు. మూడు రోజులపాటు నిజాం బ్రిటిష్ సైన్యాలను ఎదుర్కొన్నారు. కానీ ఆహారం, మందు గుండు సామాగ్రి అయిపోవడంతో అనివార్యంగా వెనెక్కి తగ్గారు. ఇదే అవకాశం కోసం ఎదురుచూసిన నిజాం సైన్యం ఒక్కసారి గుంపుగా విరుచుకపడి కుర్దు చేసిన సైగలతో కొమురం భీం గుండెల్లో బుల్లెట్ దింపారు. నమ్మక ద్రోహం గెలిచింది. కుట్రల మంత్రాంగం ఫలించింది. అడవి తల్లి తల్లడిల్లింది. వీర శిఖరం అస్తమించింది.
అందుకే కొమురం భీంను గోండుల పురాణ పురుషుడు పహందికుపార్ లింగోతో పోల్చారు. గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వయిజ శుద్ధ పౌర్ణమి 1940 రోజున జోడే ఘాడ్ అడవుల్లో నిజాం సర్కార్ తూటాలకు భీం నేలకొరిగాడు. కొమురం భీం మరణం గోండులు తదితర గిరిజన జాతుల హదయాలలో తీవ్రమైన గాయం ఏర్పరిచిందని చెప్పక తప్పదు. అదే సమయంలో భావితరాలకు పోరాట స్ఫూర్తిని కూడా నింపింది. అందుకే ప్రతి ఏడాది అదే పౌర్ణమి రోజున భీం వర్ధంతి జరుపుకోవడం ఆనవాయితి. ఆయన ఆశయ సాధనే దేయ్యంగా ఆదివాసీ మేధావులు, ఉద్యోగులు, మహిళలు, దొర, పటేళ్లు, గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు ఉద్యమించిన నాడే ఆయనికిచ్చే ఘనమైన నివాళి.
సెల్:9494283038
పెనుక ప్రభాకర్
Authorization