ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకిచ్చిన భూమిని మాజీ ఎమ్మెల్యే భర్త, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర నేతగా ఉన్న గొంగిడి మహేందర్రెడ్డి బినామీ పేర్లతో ఆ భూమిని ఆక్రమించారు. రియలెస్టేట్ వెంచర్లు చేయడం వెనుక ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉన్నది. వెంటనే దళితుల భూమి దళితులకు ఇవ్వాలి. ప్రభుత్వ అధికారులు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ నాయకులకు అధికారులు కొమ్ముకాయడం దుర్మార్గమైన విషయం. - బబ్బూరి పోశెట్టి, కేవీపీఎస్ మండల కో-కన్వీనర్