మాతృదేవోభవ అని మొదటి నమస్కారం స్త్రీలకే పెట్టాలన్న దేశ సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకేమీ నేర్పించలేకపోయింది. మనదేశం పురాణాలకు, వేదాలకు పుట్టినిల్లు కదా! దాని ప్రకారమే రావణుడు సీతమ్మను ఎత్తుకుపోయాడనీ, కోతులతో కలిసి అతడ్ని, అతని రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రామున్ని చూసి మనమేం నేర్చుకోవాలి? ద్రౌపది కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చికుక్కలను చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? మనమేం నేర్చుకున్నామంటే ఆడవాళ్లను, చిన్నపిల్లలను ఎత్తుకెళ్లడం, వారిపై కామాంధుల్లా వ్యవహరించడం, దారుణంగా చంపడం, వేధించడం లాంటి వాటిల్లో ఎవరికి వారే సాటి లేరనిపించుకుంటున్నాం. 2012 డిసెంబర్ 16న దేశ రాజధాని నడిబొడ్డున నిర్భయపై లైంఘికదాడి మొదలు ఎన్నో దారుణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. 40 ఏండ్ల కాలంలో మనదేశంలో లైంఘికదాడుల సంఖ్య 87.5శాతం. ఇవి 1971లో 2,487 ఉండగా, 2011 వచ్చే సరికి 24,206కు పెరిగింది. సమాజం దృష్టికి రాని, పోలీసుల నివేదికలకు దొరకని కేసులు అనేకం. ఈ దాడులు ఇలా పెరగడానికి కారణం ఎవరు? పెంచిన తల్లిదండ్రుల లోపమా!
మనదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. గొప్ప ఆచారాలు, విలువలున్న దేశం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లతో కీర్తించబడుతున్నది. ముక్కోటి దేవతలను ఆరాధించే దేశం. మన స్త్రీల కట్టూ, బొట్టూ చూసి ఇతర దేశాలు సైతం ఆచరించాలనుకునే సాంప్రదాయం. భారతీయ స్త్రీలకు ఓ ప్రత్యేక స్థానమున్నది. అలాంటి దేశంలో స్త్రీ సమాజంలోకి రావాలంటే బయపడుతోంది. స్వేచ్ఛగా జీవించలేకపోతోంది. ఎందుకు? మనదేమీ ఉగ్రవాదుల దేశం కాదే! మరెందుకు అంతలా భయపడుతున్నారు. ఎందుకంటే అంతకంటే ఎక్కువేననీ చెప్పొచ్చు. నేటి సమాజంలో మహిళలపై లైంఘిక దాడులు, దాడులు మనదేశ దుస్థితిని తెలిజేస్తోంది. లైంఘిక దాడులకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది మన సమాజం. దేశంలో ఎక్కడ చూసినా ఇవే దారుణాలు. కామాంధుల చేతుల్లో రోజూ ఎంతోమంది ఆడబిడ్డలు బలౌతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు అనే తేడా లేకుండా లైంఘికదాడులకు పాల్పడితే సమాజంలో మహిళలు మనగలుగుతారా! నాటి నిర్భయ నుండి నేటి ఆసిఫా వరకూ ఎన్నో ఘటనలు. బయటకు రానివి మరెన్నో లైంఘిక దాడుల ఘటనలు. అభం శుభం తెలియని చిన్నారులను ఎత్తుకెళ్లి వ్యభిచార కూపంలో పడేస్తున్నారు. అమ్మాయిలు కనబడితే చాలు మానవ మృగాలుగా లైంఘిక దాడులకు ఒడిగడుతున్నారు.
మాతృదేవోభవ అని మొదటి నమస్కారం స్త్రీలకే పెట్టాలన్న దేశ సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకేమీ నేర్పించలేకపోయింది. మనదేశం పురాణాలకు, వేదాలకు పుట్టినిల్లు కదా! దాని ప్రకారమే రావణుడు సీతమ్మను ఎత్తుకుపోయాడనీ, కోతులతో కలిసి అతడ్ని, అతని రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రామున్ని చూసి మనమేం నేర్చుకోవాలి? ద్రౌపది కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చికుక్కలను చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? మనమేం నేర్చుకున్నామంటే ఆడవాళ్లను, చిన్నపిల్లలను ఎత్తుకెళ్లడం, వారిపై కామాంధుల్లా వ్యవహరించడం, దారుణంగా చంపడం, వేధించడం లాంటి వాటిల్లో ఎవరికి వారే సాటి లేరనిపించుకుంటున్నాం. 2012 డిసెంబర్ 16న దేశ రాజధాని నడిబొడ్డున నిర్భయపై లైంఘికదాడి మొదలు ఎన్నో దారుణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. 40 ఏండ్ల కాలంలో మనదేశంలో లైంఘికదాడుల సంఖ్య 87.5శాతం. ఇవి 1971లో 2,487 ఉండగా, 2011 వచ్చే సరికి 24,206కు పెరిగింది. సమాజం దృష్టికి రాని, పోలీసుల నివేదికలకు దొరకని కేసులు అనేకం. ఈ దాడులు ఇలా పెరగడానికి కారణం ఎవరు? పెంచిన తల్లిదండ్రుల లోపమా! లేకపోతే సమాజ స్థితిగతుల లోపమా! సంస్కారం నేర్పిన ఉపాధ్యాయుల లోపమా! లేక ప్రభుత్వాల లోపమా! నా అనుకున్న కుటుంబసభ్యులే ఈ దారుణాలకు పాల్పడితే రక్షణ ఇంకెవరు కల్పిస్తారు. చదువు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కూడా ఈ దాడులకు ఒడిగడితే అతని దగ్గరే శిష్యరికం చేస్తున్న యువతకు ఎలాంటి విద్యను బోధిస్తాడు? దేశ ప్రగతినేం కాపాడతాడు? ఈ దారుణాలు ఇలా రోజురోజుకూ పెరిగిపోతుంటే ప్రభుత్వాలేం చేస్తున్నాయి? చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఇంప్లిమెంటేషన్ ఉండొద్డా? లైంఘిక దాడులకు పాల్పడిన వ్యక్తులకు ఉరిశిక్ష విదిస్తామని గప్పాలు కొట్టుకున్న ప్రభుత్వం ఎంత మందికి శిక్ష వేసింది. కొత్తగా చట్టం చేసింది కదా.. లైంఘిక దాడికి గురైన వారి వయస్సును బట్టి శిక్షను విధిస్తారా? ఇదెక్కడి న్యాయం? అందరూ స్త్రీలే కదా? ఏండ్ల కిందట జరిగిన నిర్భయ ఘటనపైనే నిన్న మొన్న తీర్పు వెల్లడించింది. ఒక్క ఘటనకు నాలుగైదేండ్లు పడితే వేలకొద్దీ ఘటనలున్నాయి కదా! వాటినెలా పరిష్కరిస్తారు? అంటే వాటిని గాలికొదిలేసినట్టేనా!
'అభివృద్ధి సాధిస్తున్నాం' అంటూ కేంద్రం గప్పాలుకొట్టుకుంటోంది కదా! ఎందులోనూ అమ్మాయిలకు బతుకు లేకుండా చేయడంలోనా! లేకపోతే వారిపై పాశవికంగా, పైశాచికంగా ప్రవర్తించడంలోనా! సమాజాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే ఈ దారుణాలకు ఒడిగడితే మహిళలు బతుకుతారా ఈ మానవ మృగాల సమాజంలో. ఉద్యోగాల పేరిట, అడ్మిషన్ల పేరిట లొంగదీసుకోవడం ఇక మారవా? దీన్ని పట్టించుకునే ప్రభుత్వాలే లేవా? ప్రజలను ఏలాల్సిన నాయకులే ఈ దారుణాలకు పాల్పడితే సాధారణ జనం ఓ లెక్కా!? పెద్దలుగా పరిగణించబడుతున్న రాజకీయ నాయకులు, మతగురువులు, స్వయం ప్రవచిత స్వరూపులు, బాబాలు లాంటి వారి పాత్ర మరీ ఎక్కువ. కొందరు నాయకులు ఏం చెప్తారంటే... 'లక్ష్మణరేఖ దాటిన సీత రావణ అపహరణకు గురైనట్టు, హద్దులు దాటిన ఆడది శిక్షించబడుతుందని'' ఓ నాయకుడు చేసిన మాటలివి. ఆరుగురు మగవారు చుట్టుముట్టినప్పుడు ఎదిరించకుండా లొంగిపోయుంటే ఆమె తన పేగులు కోల్పోయి ఉండేది కాదని, అయినా రాత్రి పది గంటల సమయంలో తన మిత్రులతో బయటకెందుకెళ్లాలి, తమకిచ్చిన హక్కులను మహిళలు దుర్వినియోగం చేసుకుంటున్నారనీ ఓ మహిళా శాస్త్రవేత్త వ్యాఖ్యలివి. పోలీసులు, కమిషనర్ ఆఫీసులు, సెక్రటేరియన్లు, లాయర్లు, సెక్యురిటీలు ఇలా ఇవన్నీ మనం సవ్యంగా, నాగరికంగా బతకడం కోసం వేల లక్షల సొమ్ముతో మన కోసం మనమే నడుపుకుంటున్న దేశం మనది. ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్లో ఆడదానికి రక్షణ కల్పించలేని దేశం. అందుకే మనదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్నదిగానే మిగిలిపోయింది.
''యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవత'' అని సూక్తి. దీనర్థం ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడే దేవతలు కొలువుదీరుతారు. అందుకే స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. మహిళల స్థితిగతులు మారనిదే దేశం బాగుపడదు. దేశంలో అన్నీ మారుతున్నాయి. మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప. సమాజంలో దేవతగా కొలువుదీరాల్సిన స్త్రీ మూర్తిపై లైంఘిక దాడుల సంస్కృతి నేటి భారతంలో పెరిగిపోతుంది. భారతదేశాన్ని భారతమాతగా పూజించే సంస్కృతి మనది. ఆ సంస్కృతికి మచ్చతేకుండా ఆడవారిని కూడా సమానంగా చూడాలి. ఇలాంటి లైంఘిక దాడులకు పాల్పడే వారికి శిక్ష పడేవరకు బాధితులకు మద్దతుగా ప్రజలంతా ఒక్కటై పోరాడాలి.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవత
సెల్ : 9640289695
రాజమోని శివలీల
Authorization