పాలకులు ఒక పద్ధతి ప్రకారం వ్యక్తిగత నేరాలను ప్రోత్సహించే విధానాలను అవలంభించడం ఇటీవలి కాలంలో పెరిగింది. మద్యం విచ్చలవిడిగా పారించడం, విచ్చలవిడి సెక్స్ను ప్రేరేపించే సంస్కృతిని ప్రోత్సహించడం, బూటకపు వ్యక్తిగత ప్రతిష్ట (కులాధారిత) మాయలో ముంచడం లాంటివి చేస్తున్నారు. దీంతో ప్రజల సామూహిక చైతన్యంతో కూడిన సామాజిక నేరాలు తగ్గి, వ్యక్తిగత నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామూహిక నేరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత నేరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంపై వత్తిడి పడదు. ఈ పరిస్థితి పాలకులకు ఎంతో వెసలుబాటును ఇస్తోంది. ఈ వెసలుబాటును మరిన్ని కుట్రలు రూపొందించేందుకు, ఇంకిన్ని దోపిడీ దారులను కనుగొనేందుకు పాలకవర్గాలు వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కుల దురహంకార హత్యలు పెరిగిపోతున్నాయి.
చారు తాగుతూ సంభాషించుకునే అలవాటు తెలంగాణలో మొదటి నుంచీ అధికంగా ఉంది. చారు దుకాణాలు సామూహిక సామాజిక సంభాషణా కేంద్రాలుగా ఇప్పటివరకూ వర్థిల్లగా, ఇప్పుడు మందు దుకాణాలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. మిత్రులు మాట్లాడుకునేందుకు మందు దుకాణాలే వేదికలయ్యాయి. మందులేకుండా మాటలు లేని దుస్థితి దాపురించింది. దీంతో మద్యం మత్తులో మిత్రులమధ్యే ఉద్రేకాలు, అహాలు, శతృత్వాలు క్షణాలలో చోటుచేసుకుంటు న్నాయి.
ఉద్యమాలు సామాజిక సన్నిహితత్వాన్ని పెంచుతాయి. ముఖ్యంగా యువతరంలో ఉద్యమాలద్వారా సామాజిక సన్నిహిత్యం బలపడుతుంది. బలపడిన ఈ సామాజిక సన్నిహితత్వం, సమాజంలో పేరుకుపోయిన కుల దొంతరలకు అతీతమైన వ్యక్తిగత సంబంధాలకు, బంధాలకూ దారితీస్తుంది. అయితే, ఉద్యమాలకు కులాతీత భావజాలం లేనపుడు, ఆ ఉద్యమాలు తాత్కాలికం అయినపుడు సమాజంలో పేరుకుపోయి వున్న కుల దొంతరలు మరింత క్రూరంగా కులాతీత బంధాలను కాటేస్తాయి. తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో ఇటీవల సంభవిస్తున్న కుల దురహంకార హత్యలకు కారణాలను లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
కుల రహిత, కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావంలేని హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లాంటి ఉత్తరభారత రాష్ట్రాలలో ఇప్పటి వరకూ దులదురహంకార హత్యలు అధికం. మహిళా సంఘం 'ఐద్వా' సర్వే ప్రకారం దేశం మొత్తంలో జరిగిన కుల దురహంకార హత్యలలో కేవలం ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 30 శాతంపైగా చోటు చేసుకున్నాయి. కాగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2015లో కులదురహంకార హత్యలలో దక్షణ భారతదేశంలో 16 హత్యలతో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దేశంలోని మిలిగిన ఏ రాష్ట్రంతో పోల్చినా తెలంగాణలో కుల విభేదాలు అత్యల్పమన్నది ఒక చారిత్రిక సత్యం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కాలం నుండి ఈ ప్రాంతంలో నిచ్చెన మెట్ల కులాల మధ్య సోదరభావం, సాన్నిహిత్యం అధికం. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో వేలాది కులాంతర వివాహాలు జరిగాయి. గ్రామాలపై కమ్యూనిస్టులకు పట్టు ఉన్నంత వరకూ గ్రామాలలో కులాంతర వివాహాలు జరిగినా సామాజిక సంఘర్షణలకు, హత్యలకు చోటివ్వలేదు. కాగా, 1990 తరువాత ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా దేశంలో అస్థిత్వ ఉద్యమాలు ఊపిరిపోసుకోవడం, ఆ ఉద్యమాలలో భాగంగా తెలంగాణలో కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైన నేపథ్యంలో సమాజంపై కమ్యూనిస్టుల పట్టు తగ్గుతూ వచ్చింది. దీంతో తెలంగాణ సమాజంపై కుల రహిత భావజాల అదుపు తగ్గింది. అదేక్రమంలో ఉద్యమంద్వారా సమాజంలో వచ్చిన పెను కదలిక యువతరాన్ని చేరువచేసింది. కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చిన యువతరం మధ్య జరిగిన వివాహాలన్నీ దాదాపు కులాంతర వివాహాలే. అయినా ఎలాంటి హింస చోటుచేసుకోలేదు. ఆ జంటలు, వారి కుటుంబాలన్నీ సఖ్యతతోనే జీవిస్తున్నాయి. ఇందుకు కారణం కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా వారికి అందిన కుల రహిత చైతన్యం. ఈ కుల రహిత చైతన్యాన్ని ప్రాంతీయ ఉద్యమమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వారికి అందిచలేకపోయింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ద్వారా అప్పటి వరకూ సమాజంపై అదుపుకోల్పోయి ఉన్న కులాధిపత్య శక్తుల అదుపు ప్రారంభమై, రాష్ట్ర సాకారంతో స్థిరపడింది. రాష్ట్రంలో కూడా పాలనా పగ్గాలు తెలంగాణ ఫ్యూడల్ శక్తుల చేతిలో పడటంతో కులహంకారాన్ని ప్రశ్నించే శక్తులు సన్నగిల్లి, ప్రోత్సహించే శక్తులు పెరిగిపోయాయి. ఫ్యూడల్ ఆధిపత్య శక్తులకు సమాజంలో ప్రశాంతత నచ్చదు. ప్రజల మధ్య ఐక్యత అసలే నచ్చదు. కుటుంబాల మధ్య కలహాలను సైతం ఈ శక్తులు సామాజిక కలహాలుగా మార్చి అల్లకల్లోలం సృష్టించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తుంటాయి. అందునా, అణగారిన కులాలు అత్యధికంగా ఉన్న తెలంగాణలో అణగారిన కులాల మధ్య ఐక్యత ఆధిపత్య శక్తుల ఆధిపత్యానికి పాతరేస్తుంది. కావున, ఈ శక్తులు అణగారిన కులాల మధ్య అనైక్యతను, విద్వేషాలనూ ఎప్పటికప్పుడు రెచ్చగొడుతుంటాయి. కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కులాంతర వివాహాలు ఒక బలమైన సాధనం. కావునే, కులాంతర వివాహాలు తెలంగాణ సమాజంలో కులాల మధ్య విద్వేషాలను, సామాజిక సంఘర్షణలను సృష్టిస్తున్నారు. అణగారిన ( ఎస్సీ, ఎస్టీ, బీసీ) కులాల మధ్య జరిగిన కులాంతర వివాహాలు కూడా హింసాత్మకంగా మారడం, హత్యలకు దారితీయడాన్ని మనం ఈ కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇరు కులాలకు చెందిన యువతీ యువకులు పెండ్లి చేసుకున్నప్పుడు ఆధిపత్య శక్తులు కుల దురహంకారాన్ని రెచ్చగొడుతున్నాయి. ఇందులో పాలకుల పాత్ర కూడా ఉంది. కులాల ఉనికిని తీవ్రంగా ముందుకు తెచ్చి, కొన్ని కులాలను ప్రోత్సహిస్తూ, ఆత్మగౌరవాన్ని కుల గౌరవంతో ముడిపెట్టే మనువాద భావజాలాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు పాలకులు. సమాజంలో కులాతీత భావజాలం స్థానంలో నిచ్చెనమెట్ల కుల భావజాలాన్ని బూస్టప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం కుల అణచివేతలకు, దురహంకారానికి గురయ్యే అణగారిన కులాలలో సైతం స్వకులాధిపత్య భావజాలం శృతిమించి, తమ పిల్లలు కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు భరించలేక నిర్ధాక్షిణ్యంగా వారిని కడతేర్చి హంతకులుగా మారుతున్నారు. కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కుల దురహంకార హత్యల బాధితులైన కుటుంబాలను ఇటు సాటి కులస్తులుకాని, అటు ప్రభుత్వంకానీ పట్టించుకోక వీధులపాలు చేస్తున్నారు.
పాలకులు ఒక పద్ధతి ప్రకారం వ్యక్తిగత నేరాలను ప్రోత్సహించే విధానాలను అవలంభించడం ఇటీవలి కాలంలో పెరిగింది. మద్యం విచ్చలవిడిగా పారించడం, విచ్చలవిడి సెక్స్ను ప్రేరేపించే సంస్కృతిని ప్రోత్సహించడం, బూటకపు వ్యక్తిగత ప్రతిష్ట (కులాధారిత) మాయలో ముంచడం లాంటివి చేస్తున్నారు. దీంతో ప్రజల సామూహిక చైతన్యంతో కూడిన సామాజిక నేరాలు తగ్గి, వ్యక్తిగత నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామూహిక నేరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత నేరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంపై వత్తిడి పడదు. ఈ పరిస్థితి పాలకులకు ఎంతో వెసలుబాటును ఇస్తోంది. ఈ వెసలుబాటును మరిన్ని కుట్రలు రూపొందించేందుకు, ఇంకిన్ని దోపిడీ దారులను కనుగొనేందుకు పాలకవర్గాలు వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కుల దురహంకార హత్యలు పెరిగిపోతున్నాయి.
చారు తాగుతూ సంభాషించుకునే అలవాటు తెలంగాణలో మొదటి నుంచీ అధికంగా ఉంది. చారు దుకాణాలు సామూహిక సామాజిక సంభాషణా కేంద్రాలుగా ఇప్పటివరకూ వర్థిల్లగా, ఇప్పుడు మందు దుకాణాలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. మిత్రులు మాట్లాడుకునేందుకు మందు దుకాణాలే వేదికలయ్యాయి. మందులేకుండా మాటలు లేని దుస్థితి దాపురించింది. దీంతో మద్యం మత్తులో మిత్రులమధ్యే ఉద్రేకాలు, అహాలు, శతృత్వాలు క్షణాలలో చోటుచేసుకుంటు న్నాయి. దమ్మిడీకి పనికిరాని 'ప్రతిష్ట'లు పురుడుపోసుకుం టున్నాయి. రెచ్చగొట్టడాలు, రెచ్చిపోవడాలు ఉన్మాద స్థాయికి చేరుకుని ఊపిరి తీస్తున్నాయి. 'నీ కూతురు చెల్లి, అక్క.. కులం చెడింది. నీ కొడుకు, అన్న, తమ్ముడు.. కులం పరువు తీసాడు' అన్న మాటలు మందు సంభాషణలలో ముఖంమీదే దాడి చేస్తుంటే.. అవి విన్న వాళ్లు ఆలోచన కోల్పోయి ప్రాణాంతక నిర్ణ యాలు తీసుకుంటున్నారు. చేజేతులా తమ పిల్లల ప్రాణాలుతీసి, తాము జైళ్లపాలై కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.
వ్యక్తిగత నేరాలకు సామాజిక వాతావరణమే పునాదిగా ఉంటుంది. నేరాలు వ్యక్తులు చేసినప్పటికీ ఆ నేరాలకు సామాజిక పరిస్థితులు ప్రేరణగా ఉంటాయి. సామాజిక వాతావరణానికి పాలకుల భావజాలం కాపుకాస్తుంది. పాలకులు ఏ భావజాలం కలిగి ఉంటే ఆ భావజాలాన్నే ప్రమోట్ చేస్తారు. దాన్ని కాపాడుతారు. మరింతగా పెంపొందించేందుకు ప్రయత్నిస్తారు. కావున, వ్యక్తిగత నేరాలను కేవలం వ్యక్తులకు మాత్రమే పరిమితంచేసి వాటిని నిర్మూలించాలనుకుంటే సాధ్యంకాదు. ఆ నేరాలకు పురిగొలిపే సామాజిక పరిస్థితులను రూపుమాపకుండా, ఆ సామాజిక పరిస్థితులను సృష్టించి, పెంపొందించే పాలకవర్గ రాజకీయాలను ఎదిరించకుండా వాటిని రూపుమాపడం అసాధ్యం. ఇప్పుడు తెలంగాణ సమాజం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరముంది.
- కోప్ర
Authorization