మనిషి నుండి మతాన్ని వేరుచేయటం అంత సులభసాధ్యం కాదు. ప్రతి మనిషికి కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. నమ్మకాలకు, మూఢనమ్మకాలకు మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నాయి. జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ప్రస్తుత సమయంలో మరింత బలోపేతం కావాల్సి ఉంది. విద్యావంతులు, మేధావులు, రచయితలు అందరూ సమిష్టిగా ఒక తాటిపైకి వచ్చి మతసామరస్యానికి కృషి చేయాలి. ప్రభుత్వాలు కూడా సర్వమత సమ్మేళనాలు ఏర్పాటు చేయటం, శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో సమైఖ్య భావనను పెంచవచ్చు. ఈ దిశగా చర్చలు, అవగాహన సదస్సులు జరగాలి. లేకుంటే మతోన్మాదం మరింత ఉగ్రరూపం దాల్చి మానవ వినాశనానికి దగ్గర మార్గం వేస్తుంది. మతం కూడా సైన్స్లో భాగమే విశ్వరహస్యాలను చేధించే క్రమంలో పూర్వికులు కొన్ని ఉహాత్మక భావనలను ఏర్పర్చుకున్నారు. వాటిలో ఎక్కువ శాతం అర్ధసత్యాలే. మార్పులు కోరుకోని సైన్స్ పరిశోధనలు మతంగా స్థిరపడగా, నిరంతరం నూతన అన్వేషణలకు దారిచూపిన పరిశోధనలు సైన్స్ అండ్ టెక్నాలజిగా అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం మనం మత ఆరాధకులను ద్వేషించి ప్రయోజనం లేదు లేదా వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేయటం వలన ఉపయోగం లేదు. భక్తి అనే అంశం మూఢత్వంలోకి వెళ్లకుండా ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించాలి. వారి పట్ల సానుభూతిని ప్రదర్శించాలి. సమస్యలకు శాస్త్రీయపరమైన పరిష్కారమార్గాలను చూపాలి. ప్రస్తుతం జనవిజ్ఞాన వేదికపైన తక్షణ కర్తవ్యం ఇదే.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రధాన సమస్యలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. 1. పర్యావరణ కాలుష్యం, 2.మతోన్మాదంతో కూడిన ఉగ్రవాదం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ జాన్ ట్రంప్ వాతావరణ కాలుష్య నియంత్రణపై జరిగిన పారీస్ ఒప్పందం నుండి తమదేశం తప్పుకుంటునట్టు ప్రకటించటంతో పర్యావరణ ప్రేమికులలో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హకింగ్ భూగ్రహం గురించి ఒక అసక్తికరమైన ప్రకటన చేశారు. అదేమంటే మరో వంద సంవత్సరాలలో మనిషి తన మనుగడ కోసం మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిందే అని తేల్చిచెప్పాడు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్యాన్ని గమనిస్తుంటే హాకింగ్ మాటలు వాస్తవ దూరం కాదనిపిస్తుంది. ఒక వైపు ప్రపంచం కుల, వర్గ, మత, ప్రాంత, జాతి అనే తేడాలేకుండా కాలుష్యకోరలలో చిక్కుకొని విలవిలాడుతుండగా మరోవైపు మతోన్మాదంతో కూడిన ఉగ్రవాదం దశదిశలా ఉగ్రరూపం దాల్చుతుంది.
అనాధికాలం నుండి మతం, సైన్స్ రైలు పట్టాల్లాగా సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి. మధ్యయుగం వరకు మతానిదే అధిపత్యం కాగా, 17వ శతాబ్ధం నుండి సైన్స్ తన పరిధిని విస్తరించుకుంటూ వస్తుంది. కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, ప్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతం, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రపంచ స్థితిగతులను మార్చాయి. అందుకుతోడు బ్రూనో బలిదానం, గెలీలియో త్యాగాలు మనిషి అన్వేషణ అవని నుండి అంతరిక్షం వరకు విస్తరించాడానికి దోహదపడ్డాయి. మత ప్రాభవం గత వైభవంగా మిగిలిపోతున్న దశలో మతాధికారులు తమ గ్రంథాలల్లోని నియమాలకు కొత్త భాష్యాలు చెప్పటం, నూతన నిబంధనలను చేర్చటం, సైన్స్ ఫలాలను అందిపుచ్చుకోవటం ద్వారా మతం ఉనికిని అధునిక కాలంలో కూడా నిలబెట్టకో లుగుతున్నారు. అందుకుతోడు సైన్స్ సాధించిన విజయాలు కేవలం ఉన్నత, మేధావి వర్గాలకు మాత్రమే చేరటం, వాటి ఫలాలను ఇంకా పేదవారికి అందించటంలో పాలక వర్గాలు విఫలమవ్వటం తదితర కారణాల వలన ప్రజలు రకరకాల వ్యక్తిగత విశ్వాసాలను అశ్రయిస్తున్నారు. వ్యక్తిగత అంశమైన మతాన్ని పాలకులు అత్యంత సున్నితమైన అంశంగా మార్చారు.
17,18 శతాబ్ధాలలో ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు మతపరమైన సంస్కరణలు జరిగాయి. అనేకమంది ప్రవక్తలు తమతమ మతాలలో ఉన్న మూఢవిశ్వాసాలకు స్వస్తి చెప్పడమో లేదా ఇతర మతాలలో ఉన్న మంచిని స్వీకరించటం చేశారు. మానవసేవ అనే అంశాన్ని ప్రముఖంగా తమ ప్రసంగాలలో ప్రస్తావించారు. ఈ దిశగానే వివిధ మతాధిపతులు ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యం అంశాలను తమ కార్యక్రమాలలో ప్రధానాంశాలుగా చేర్చి పలు ప్రాంతాలలో అనేక విద్యాలయాలు, వైద్యశాలలను స్థాపించారు. ఈ విషయంలో క్రైస్తవ మిషనరీలు అనేక దేశాలలో తమ ప్రార్థన మందిరాలకు అనుబంధంగా వైద్యశాలలను, విద్యాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు మతబోధనతోపాటు పలు రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. భారతదేశంలో సైతం స్వామివివేకానంద, రాజరామ్మోన్రారు, స్వామి దయానందసరస్వతి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, దేవేంధ్రనాద్ ఠాగూర్ వంటి మహానీయులు భారతీయులు అచరించే సంప్రదాయాలలో, ఆచార వ్యవహరాలలో పలు మార్పులు తీసుకురావటానికి విశేష కృషి చేశారు. వారి కృషి ఫలితంగానే సతీసహగమనం మనదేశంలో నిషేధించబడింది. బాల్యవివాహాలు కొంతమేరకు తగ్గాయి. మానవసేవ అనే భావనని భారతదేశంలో మత ప్రచారం చేసే అనేక మంది అధ్యాత్మిక వేత్తలు తమ కార్యక్రమాలలో ఒక ప్రధానాంశంగా చేర్చారు. స్వామి వివేకానంద చేత ప్రారంభించబడిన రామకృష్ణ మిషన్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. హిందూ, ఇస్తాం మతాలలోని ప్రధానాంశాలు తీసుకొని కొంతమంది ప్రవక్తలు సూఫీ మతాన్ని ప్రచారం చేశారు. దర్గాలు మన దేశంలో మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. నేటికీ చాలా ప్రాంతాలలో మొహరం పండుగను హిందూ, ముస్లింలు ఐక్యంగా జరుపుకుంటారు. అనేకమంది మత ప్రవక్తలు తమ మతాలలో పలు మార్పులు చేర్చి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత కాలంలో మనిషి మరోసారి మధ్యయుగాలలోకి వెళ్తున్నామేమో అనిపిస్తుంది.
మతాన్ని అనుసరించే ప్రతివ్యక్తీ తాను అనుసరించే మార్గమే గొప్పదనీ, అదే సత్యమని, విశ్వసించటం, ఆ భావనలను ప్రచారం చేయటం, ఎదుటివారిపై బలంగా రుద్దటం వంటి ధోరణులు ప్రస్తుత సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా మతపరమైన దాడులు పెరుగుతున్నాయి. అఖరికి సామాజిక మాధ్యామాలను కూడా తమతమ వాదనలను వినిపించుకోవటానకి వివిధ మతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మరోసారి సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలలో రోజురోజుకు మత అసహన ధోరణులు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు సైతం మన దేశంలో శౌచాలయాలకంటే ప్రార్థనాలయాలు ఎక్కువుగా ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
మనిషి నుండి మతాన్ని వేరుచేయటం అంత సులభసాధ్యం కాదు. ప్రతి మనిషికి కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. నమ్మకాలకు, మూఢనమ్మకాలకు మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నాయి. జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ప్రస్తుత సమయంలో మరింత బలోపేతం కావాల్సి ఉంది. విద్యావంతులు, మేధావులు, రచయితలు అందరూ సమిష్టిగా ఒక తాటిపైకి వచ్చి మతసామరస్యానికి కృషి చేయాలి. ప్రభుత్వాలు కూడా సర్వమత సమ్మేళనాలు ఏర్పాటు చేయటం, శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో సమైఖ్య భావనను పెంచవచ్చు. ఈ దిశగా చర్చలు, అవగాహన సదస్సులు జరగాలి. లేకుంటే మతోన్మాదం మరింత ఉగ్రరూపం దాల్చి మానవ వినాశనానికి దగ్గర మార్గం వేస్తుంది. మతం కూడా సైన్స్లో భాగమే విశ్వరహస్యాలను చేధించే క్రమంలో పూర్వికులు కొన్ని ఉహాత్మక భావనలను ఏర్పర్చుకున్నారు. వాటిలో ఎక్కువ శాతం అర్ధసత్యాలే. మార్పులు కోరుకోని సైన్స్ పరిశోధనలు మతంగా స్థిరపడగా, నిరంతరం నూతన అన్వేషణలకు దారిచూపిన పరిశోధనలు సైన్స్ అండ్ టెక్నాలజిగా అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం మనం మత ఆరాధకులను ద్వేషించి ప్రయోజనం లేదు లేదా వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేయటం వలన ఉపయోగం లేదు. భక్తి అనే అంశం మూఢత్వంలోకి వెళ్లకుండా ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించాలి. వారి పట్ల సానుభూతిని ప్రదర్శించాలి. సమస్యలకు శాస్త్రీయపరమైన పరిష్కారమార్గాలను చూపాలి. ప్రస్తుతం జనవిజ్ఞాన వేదికపైన తక్షణ కర్తవ్యం ఇదే.
ఎమ్.రాంప్రదీప్
సెల్:9492712836