దళిత, గిరిజన, నిమ్న కులాల ప్రజలు దేశవ్యాప్తంగా అంటరానితనం తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని మానవ హక్కుల బృందాలు, పౌర హక్కుల సంఘాలు తరచూ పేర్కొంటున్నాయి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేకమైన చట్టాలున్నప్పటికీ కనీస హక్కులను కూడా కాపాడుకోలేక ఆత్మరక్షణ వలయంలో చిక్కుకుంటున్నారు. బడుగులు, జాతీయ మానవ హక్కుల సంఘానికి వస్తున్న ఫిర్యాదుల్లో 85 శాతం పోలీసులకు వ్యతిరేకమైనవని నిర్ధారించింది. మన దేశంలో ఎస్సీ, ఎస్టీలు కోల్పోతున్న హక్కుల వివరాలను ఈ ఏడాది జరిగిన మానవ హక్కుల సార్వజనీన కాలిక సమీక్షా సమావేశంలో చైర్మన్ కెజి.బాలకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించింది. అందులో జైళ్లలో పరిమితి దాటడంతో అవి వ్యాధుల నిలయంగా మారాయి. చికిత్సలు అధ్వానంగా ఉన్నాయి. 67 శాతం మంది విచారణ ఖైదీలే కావడంతో కస్టడీ న్యాయం పెద్ద సమస్యగా మారింది. నిరుపేదలు సత్వర బెయిల్ పొందలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కూడా పౌష్టికాహార లోపాన్ని అరికట్టలేకపోతోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 5.5 కోట్ల మందికి ప్రభుత్వం పని కల్పిస్తున్నా, సగం మందికే వేతన హామీ ఉంది. ఈ పథకం ద్వారా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, వారికి దీర్ఘకాలిక ఉపాధిని సృష్టించలేకపోతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో విద్య నాణ్యత తగ్గిపోయి అక్షరాస్యత అట్టడుగు స్థాయిలో ఉంది. మౌలిక సదుపాయాల కల్పన అరకొరగా ఉంది.
ప్రపంచ దేశాలు ప్రతి ఏటా డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నాయి. జాతి, మతం, కులం, భాష, ప్రాంతం మొదలైన వాటికి అతీతంగా అందరూ మానవ హక్కులు అనుభవించాలనేదే మానవ హక్కుల దినోత్సవ లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న మానవ హక్కుల ప్రకటన వెలువడింది. ప్రముఖ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత- రీన్కానిన్ ప్రమేయంతో 63 ఏండ్ల క్రితం రూపొందించిన మానవ హక్కుల ప్రకటన ''మానవులందరూ స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, సమాన హక్కులతో జన్మించారు'' అని పేర్కొంది. ఈ పదాలు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి దోహదం చేశాయి. మానవ హక్కుల దినోత్సవం (డిసెంబర్ 10)ను పురస్కరించుకొని మానవ హక్కుల రంగంలో విశిష్ట సేవలందించిన వారికిచ్చే నోబెల్ బహుమతులను ఐరాస ప్రదానం చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల అమలు తీరును పర్యవేక్షిస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ ఆర్సీ) కూడా భారతదేశంలోని మానవ హక్కుల విషయంలో ఇంకా సంక్ష్లిష్ట పరిస్థితి తొలగిపోలేదని వ్యాఖ్యానించడం చూస్తే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వివక్షకు వ్యతిరేకంగా, బడుగు జీవులైతే దయనీయ స్థితిలోనూ దైనందిన పోరాటం చేయక తప్పని పరిస్థితి కొనసాగుతున్నది.
భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న, సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్యరాజ్యం, బ్రిటిష్ పాలన నుండి విముక్తి అనంతరం స్వాతంత్య్ర భారత రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కుల్ని ప్రసాధించింది. మత స్వాతంత్య్రం, దేశం లోపల, వెలుపల సంచరించే స్వేచ్ఛ పౌరులకిచ్చింది. భూమిపై తొలుత ఉద్భవించిన ఆదిమ, గిరిజన జాతులు 70 దేశాల్లో 5వేల తెగలుగా 37 కోట్ల జనాభా ఉందని ఐరాస గుర్తించింది. ఆదివాసుల వారసత్వ, అటవీ వనరుల, మానవ హక్కులపై 1982, ఆగస్టు 9న జెనివాలో 25 మంది స్వతంత్య్ర మానవ హక్కుల నిపుణులతో జరిగిన వర్కింగ్ గ్రూపు సమావేశంలో ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసుల దినోత్సవంగా ఐరాస ప్రకటించింది. అంతర్జాతీయంగా ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వ ప్రతినిధి సభ 1993లో తీర్మానం చేసి 1994లో ముసాయిదా ప్రకటనను వెలువరించింది. ఐరాస నిర్ణయానికి కట్టుబడి ఏ దేశ ప్రభుత్వం ఆదివాసుల హక్కుల దినోత్సవంగా పాటించకపోవడం విచారకరం. మన దేశం కూడా భారత పౌరులుగా ఆదివాసుల రాజ్యాంగ పరమైన హక్కులను రక్షించడం లేదు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం సహజ వనరులున్న ఆదివాసీ ప్రాంతాల్లోనే ప్రవేశపెడుతున్న పరిశ్రమలు, ప్రాజెక్టులు, గనుల తవ్వకాలు, హరిత వేట వంటి రక్షణ దళాల ఆపరేషన్లు మొదలైనవి చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన తీరు తేటతెల్లమవుతోంది.
దళిత, గిరిజన, నిమ్న కులాల ప్రజలు దేశవ్యాప్తంగా అంటరానితనం తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని మానవ హక్కుల బృందాలు, పౌర హక్కుల సంఘాలు తరచూ ఆరోపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేకమైన చట్టాలున్నప్పటికీ కనీస హక్కులను కూడా కాపాడుకోలేక ఆత్మరక్షణ వలయంలో చిక్కుకుంటున్నారు. బడుగులు, జాతీయ మానవ హక్కుల సంఘానికి వస్తున్న ఫిర్యాదుల్లో 85 శాతం పోలీసులకు వ్యతిరేకమైనవని నిర్ధారించింది. మన దేశంలో ఎస్సీ, ఎస్టీలు కోల్పోతున్న హక్కుల వివరాలను ఈ ఏడాది జరిగిన మానవ హక్కుల సార్వజనీన కాలిక సమీక్షా సమావేశంలో చైర్మన్ కెజి.బాలకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించింది. అందులో జైళ్లలో పరిమితి దాటడంతో అవి వ్యాధుల నిలయంగా మారాయి. చికిత్సలు అధ్వానంగా ఉన్నాయి. 67 శాతం మంది విచారణ ఖైదీలే కావడంతో కస్టడీ న్యాయం పెద్ద సమస్యగా మారింది. నిరుపేదలు సత్వర బెయిల్ పొందలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కూడా పౌష్టికాహార లోపాన్ని అరికట్టలేకపోతోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 5.5 కోట్ల మందికి ప్రభుత్వం పని కల్పిస్తున్నా, సగం మందికే వేతన హామీ ఉంది. ఈ పథకం ద్వారా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, వారికి దీర్ఘకాలిక ఉపాధిని సృష్టించలేకపోతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో విద్య నాణ్యత తగ్గిపోయి అక్షరాస్యత అట్టడుగు స్థాయిలో ఉంది. మౌలిక సదుపాయాల కల్పన అరకొరగా ఉంది. దేశంలోని 600 జిల్లాలకు గాను 200 జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదం విస్తరించి ఉండగా, ప్రభుత్వం 60 జిల్లాల్లోనే పేర్కొన్నది. అలాగైతే కనీసం 12 కోట్ల మందిపై నక్సలిజం ప్రభావం ఉంది. కనుక ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగక హక్కుల ఉల్లంఘన పెరుగుతోందని పేర్కొంది.
ఐరాస ఆధ్వర్యంలో 2011, నవంబర్ 28- డిసెంబర్ 9వరకు దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగిన వాతావరణ సదస్సులో భూగోళాన్ని రక్షించగల కొత్త గ్రీన్ ఎకానమీ ప్రణాళిక చేశారు. ఇందుకు రెడిప్లస్ ( అడవుల నరికివేత, అడవుల వినాశనం వల్ల కలిగే ఉద్గారాల తగ్గింపు) విధానాన్ని ఒప్పందం చేసి కర్బనాన్ని పీల్చుకునేందుకు గాను కొత్త తోటలను, ప్రత్యామ్నాయ అడవులను పెంచడానికి గాను వర్ధమాన దేశాలు తీర్మానించాయి. అంటే ఆదివాసుల సాగు భూమిని లాక్కొని నిర్వాసితులను చేయడం, వారి హక్కులను హరించడమే కదా! అనాదిగా సాగు చేసే ఆదివాసీల అటవీ భూములకు హక్కులు కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వం సామూహిక అటవీ హక్కుల గుర్తింపు చట్టం -2006ను 2007 నుండి అమలు చేస్తున్నప్పటికీ కేవలం 8 లక్షల హెక్టార్ల భూములకే హక్కు పత్రాలు పంపిణీ చేసింది. అది కూడా వైఎస్ ప్రభుత్వం హయాంలోనే రాజ్యాంగంలో గిరిజనుల వారసత్వ జీవనానికి సంబంధించిన 5వ షెడ్యల్లోని అధికరణలు - 19, 23, 29, 330, 332, 334, 335, 338, 339 అమలు అరకొరగా ఉంది. గిరిజన రక్షణ చట్టాలు భూ బదలాయింపు నిషేధ చట్టం (1/70), పంచాయతీ రాజ్ విస్తరణాధికార చట్టం (ఫెసా-1996) రూపొందిన పాలకవర్గాలే వాటిని ఉల్లంఘించడం శోచనీయం. పోలవరంలో నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ప్రాజెక్టు వల్ల ఆంధ్ర, చత్తీస్ఘడ్, ఒడిషా రాష్ట్రాల్లోని 306 గ్రామాలు ముంపుతో రెండున్నర లక్షల మంది బడగులే నిర్వాసితులవుతున్నారు. ప్రాజెక్టు భారీ డిజైన్లో మార్పు చేస్తే వీరి వారసత్వ వనరుల, జీవన హక్కులను కోల్పోయే ప్రమాదం తప్పుతుంది.
దేశంలోని దళిత, గిరిజనులు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం గడిచినా వేధింపులు, వివక్ష తగ్గకపోగా అత్యాచారాల సంఖ్య, 3,945 కేసులతో (2009 వరకు) మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలైనా ఆదివాసీలు, దళితులపై అత్యాచారాలు, మారణకాండలు జరుగని రోజు లేదు. ఆదివాసీల అస్తిత్వం ఏమిటని ఆలోచిస్తే ఒక బాసగూడ, చింతల్నర్లో మారణకాండ, వాచతి, కాందహాల్, భల్లూగూడ, వాకపల్లిలో ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యాచారాలు గుర్తుకు వస్తాయి. దళితుల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని పరిశీలిస్తే చుండూరు, కారంచేడు, లక్షింపేట సంఘటనలు గుర్తుకొస్తాయి. ఇలాంటి సందర్భాలే ప్రభత్వ పాలక విధానాన్ని మానవ హక్కులను వెక్కిరిస్తున్నాయి. కనుక ఇప్పటికైనా రాజకీయం, విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలలో జనాభా దామాషా ప్రకారం తగిన ప్రాతినిధ్యం లభించేలా బడుగులు సామాజిక న్యాయం కోసం పోరాడటమే శరణ్యం.
గుమ్మడి లక్ష్మినారాయణ
సెల్:9491318409
Authorization