ఈ ప్రపంచంలో మానవ హక్కులు ఎక్కువగా ఆదివాసీలకే ఉన్నా ఈ నాగరిక సమాజం ఆదివాసీలను చిన్నచూపు చూస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారు. ఆదివాసీలు 70 సంవత్సరాల స్వతంత్య్ర భారతావనిలో తమ మానవ హక్కుల కోసం అస్తిత్వం కోసం, మనుగడ కోసం అల్లాడిపోతున్నారు. ఈ మట్టిలోనే కలిసి పోతున్నారు. ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాలో ఆదివాసీలను అంతం చేసి వారి సమాధులపై అభివృద్ధికి పునాదులు వేస్తున్నారు. మూడు లక్షల మంది ఆదివాసీలను పోలవరం ప్రాజెక్టులో బలి ఇచ్చి తెలంగాణను తెచ్చారు. నేడు ఈ తెలంగాణ రాష్ట్రం ఆదివాసీలకు శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల చట్టాలు, మానవ హక్కులు పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పాలకులు కుట్రలు, కుతంత్రాలూ పన్నుతున్నారు. ఆదివాసీల చట్టాలకు, రాజ్యాంగ రక్షణలకు మరణ శాసనం రాస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఆదివాసీల కనీస ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారు. ప్రపంచంలో పాలకులు ఎక్కడ విద్యుత్ ప్రాజెక్టులు కట్టినా అత్యధికంగా నిర్వాసితులైంది ఆదివాసీలే. నేడు భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం కట్టాలని పాలకులు అనేక ఏండ్లుగా తీవ్రంగా ప్రయత్నించి, చట్ట విరుద్ధంగా గ్రామ సభ ఆమోదం లేకుండానే 2,500 ఎకరాల ఆదివాసీల భూములను సేకరించి విమానాశ్రయం నిర్మాణం చేస్తున్నారు. 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీ భూభాగంలో 1/70 చట్టానికి వ్యతిరేకంగా భూసేకరణ చేయడం ఆదివాసీల మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. ఓపెన్ కాస్టులు పారిశ్రామిక ప్రాంతాల పేరుతో ఆదివాసీలను బొందల గడ్డగా మారుస్తున్నారు.
ఈ సమాజ పరిణామ క్రమంలో ఆదివాసీల హక్కులు అంత మవుతూ వారి జీవించే హక్కు కాలరాయబడుతోంది. మానవుడి ప్రాథమిక హక్కుల గురించి పట్టించుకునే నాథుడే లేడు.
ఈ భూమిపై జన్మించిన ప్రతి మానవుడికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. ఆ హక్కు ఉన్నప్పుడే మనిషికి దిక్కు ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు, అవకాశాలు లేకుండా మానవుల మనుగడ, అభివృద్ధి సాధ్యం కాదో ఆయా పరిస్థితుల్లో అవకాశాలు కల్పించేవే మానవ హక్కులు. సూటిగా చెప్పాలంటే మనిషి పుట్టినందుకు అతనికి తప్పనిసరిగా ఉండే హక్కులే మానవ హక్కులు. మనవ హక్కులు అనేవి ప్రతి వ్యక్తికీ సంబంధించి ఉండాలి. అదే మానవీయత అనే తాత్వికతపై ఆధారపడి రూపుదిద్దుకున్నవి. మానవ హక్కులు అనేవి వ్యక్తుల నుండి లేదా వారి జీవన విధానాల నుండి పుట్టుకొచ్చినవి. వారి వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైనవి. వెలకట్టలేనివి.
ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్రైట్స్ యాక్ట్-1993. ఈ చట్టం 1993 సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి వచ్చింది. ఐక్య రాజ్య సమితి సాధారణ సభ ద్వారా 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల తీర్మానాన్ని ఆమోదించి ప్రకటించింది. అందువల్ల డిసెంబర్10న అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా జరుపుకుంటున్నాం. 2015 డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని అవర్ రైట్స్ అవర్ ఫ్రీడమ్స్ అల్వేస్ అనే థీమ్తో నిర్వహించారు. 2014 డిసెంబర్ 10న హ్యూమన్ రైట్స్ 365 అనేథీమ్తో జరుపుకున్నాము. ప్రపంచ వ్యాప్తంగా మానవులందరికీ ఉండాల్సిన మానవ హక్కులను గుర్తిస్తూ సభ్య దేశాలన్నీ ఇందుకు అనుగుణంగా చర్యలను చేపట్టాలని యూఎన్ఓ జనరల్ తీర్మానించింది. విశ్వ మానవ హక్కుల తీర్మానం-30 అధికారణలతో రూపొందించారు.
అధికరణం-1- మనుషులం దరూ స్వేచ్ఛతో, సమాన హోదా, హక్కులతోనే జన్మించారు. అధికా రణ - 2- జాతి, వర్ణం, లింగ, భాష, మతం, జాతీయత, పుట్టు క, సంపద, ఇతర హోదాలు, రాజకీయ అభిమతాలకు అతీతం గా పైతేడాలు ఏవీ లేకుండా ప్రతి ఒక్కరికీ మానవ హక్కులు కల్పించబడుతాయి. పై రెండు అధికరణలు మనవ హక్కుల్లో ఉన్న ప్రధాన సూత్రాలకు తెలిపేందుకు ఉద్దేశించినవి. - అధి కారణ-3 నుంచి 21వరకు మానవ హక్కుల్లో ఉన్న భాగంగా ఉండాల్సిన పౌర రాజకీయ హక్కులను పేర్కొంటున్నాయి. అధికారణ-22 నుంచి 27 వరకు ఆర్థిక సామాజిక, సాంస్కృతిక హక్కులను పొందుపరిచారు. అధికారణ-28, 29, 30లలో ఇతర అంతర్జాతీయ మానవ హక్కుల గురించి పేర్కొన్నారు. అయితే మానవ హక్కులు కేవలం కాగితాలకే పరిమితమై కాగితం పులులవలే వెక్కిరిస్తున్నవి. ఈ ప్రపంచంలో మానవ హక్కులు ఎక్కువగా ఆదివాసీలకే ఉన్నా ఈ నాగరిక సమాజం ఆదివాసీలను చిన్నచూపు చూస్తూ ఆదివాసీ హక్కులను కాలరా స్తున్నారు. ఆదివాసీలు 70 సంవత్సరాల స్వతంత్య్ర భారతా వనిలో తమ మానవ హక్కుల కోసం అస్తిత్వం కోసం, మనుగడ కోసం అల్లాడి పోతున్నారు. ఈ మట్టిలోనే కలిసి పోతున్నారు. ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాలో ఆదివాసీలను అంతం చేసి వారి సమాధులపై అభివృద్ధికి పునాదులు వేస్తున్నారు. మూడు లక్షల మంది ఆదివాసీలను పోలవరం ప్రాజెక్టులో బలి ఇచ్చి తెలంగాణను తెచ్చారు. నేడు ఈ తెలంగాణ రాష్ట్రం ఆదివాసీలకు శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల చట్టాలు మానవ హక్కులు పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పాలకులు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. ఆదివాసీల చట్టాలకు, రాజ్యాంగ రక్షణలకు మరణ శాసనం రాస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఆదివాసీల కనీస ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారు. ప్రపంచంలో పాలకులు ఎక్కడ విద్యుత్ ప్రాజెక్టులు కట్టినా అత్యధికంగా నిర్వాసితులైంది ఆదివాసీలే. నేడు భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం కట్టాలని పాలకులు అనేక ఏండ్లుగా తీవ్రంగా ప్రయత్నించి చట్ట విరుద్ధంగా గ్రామ సభ ఆమోదం లేకుండానే 2,500 ఎకరాల ఆదివాసీల భూములను సేకరించి విమానాశ్రయం నిర్మాణం చేస్తున్నారు. 5వ షెడ్యూల్ ఆదివాసీ భూభాగంలో 1/70 చట్టానికి వ్యతిరేకంగా భూసేకరణ చేయడం ఆదివాసీల మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. ఓపెన్ కాస్టులు పారిశ్రామిక ప్రాంతాల పేరుతో ఆదివాసీలను బొందల గడ్డగా మారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పునర్విభజన పేరుతో ఆదివాసీలలో ప్రాంతాలను మైదాన ప్రాంతాలలో కాలుపుతున్నారు. మరోవైపు ఆదివాసీలకు నక్సలైట్లతో సంబంధం ఉన్నదనే నెపంతో ఆదివాసీలను చిత్ర హింసలకు గురిచేస్తూ ఆదివాసీల మానవ హక్కులను సర్వనాశనం చేస్తున్నారు. చత్తీస్ఘడ్, ఒడిశ, మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆదివాసీల కనీస మానవ హక్కులను గుర్తించకుండా వారిని అడవి నుండి గెంటివేస్తున్నారు. వీరికి రేషన్, ఆధార్, ఓటు హక్కు కల్పించకుండా వారిపై నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. అడవిలో ఉన్న ఆదివాసీలను అడవి నుండి గెంటివేస్తూ అటవీ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఆదివాసీల చట్టాలు అమలు చేయకుండా అంతం చేస్తూ ఆదివాసీల కనీస మానవ హక్కులను గుర్తించే పరిస్థితిలో లేరు.
70 ఏండ్ల స్వతంత్య్ర భారతావననిలో ఆదివాసీల మానవ హక్కులు ఇంత దారుణంగా ఉన్నాయి. పాలకులు మానవ హక్కులను మంటగలుపుతున్నారు. మాయమైపోతున్న మానవ సంబంధాలు, మానవ హక్కుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ యుగంలో, రాకెట్ యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతున్న తరుణంలో అడవిలో ఉన్న ఆదివాసీ అడవి బిడ్డల గురించి, వారి మానవ హక్కుల గురించి ఆలోచించే బుద్దిజీవులు, ప్రజాస్వామిక వాదులు ముందుకు వచ్చి ఆదివాసీ సమాజాన్ని కాపాడాలి.
వూకే రామకృష్ణ దొర
సెల్ : 9866073866
Authorization