పిండి అనురాధ ప్రేమించిన వ్యక్తి తన కులం కాదని కన్న కుటుంబమే చితికట్టెలు పేర్చి, గొంతు నుమిలి, హత్య చేసి, చితిలో వేసింది. కన్నకుతురు తక్కువ కులం వాడిని ప్రేమించిన పగను ఇలా చల్లార్చుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో కన్న బిడ్డనే చంపుకున్న ఘటన ఒక కులదురంకార హత్య. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వాతి -నరేష్ను స్వాతి తండ్రి హత్య చేశాడు. పరాయి కులం వారిని ప్రేమించడమే మధుకర్, ప్రణరు, గడ్డి కుమార్ల చావుకు కారణం. ఇలా కుల పట్టింపు లకు నవ వధువరులు సైతం బలవుతున్నారు. వారు చదువుకున్న పరిసరాల్లో కులం కంటే మనసు, మం చి అలవాట్లు చూసుకొని ఒకరినొకరు ఇష్టపడుతున్నా రు. సమాజంలో వేళ్లూనుకున్న కులం అడ్డు చెబుతూ హత్యలు చేస్తుంది. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి రక్షణ లేకపోవడంతో పోలీసులు పట్టనట్టుగా ఉండటం మూలంగా రోజురోజుకు కులం మత్తులో ఆవేశం పెంచుకొని హత్యలు చేస్తున్నారు.
ఒకే గ్రామానికి చెందిన అనురాధ (యాదవ) చదువు డీఈడీ. లక్ష్మణ్ బీటెక్ (పద్మశాలి). ఈ యువ జంట హైదరాబాదులో చదువుకుంటూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. బీటెక్ చదువుతున్న లక్ష్మణ్, అనురాధ ఇద్దరం కలిసి డీఈడీ చదువుకుంటే ఏదైనా స్కూల్లో ఉద్యోగంలో చేరి ఆనందంగా కాపురం చేసుకోవచ్చని బీటెక్ చదువును రద్దు చేసుకొని డీఈడీలో చేరారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న అనురాధ తల్లిదం డ్రులు ఇంట్లో బంధించారు. అదే సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ కొడుకు రాజకీయ అధికార పార్టీ అండదండలతో పిండి అనురాధతో బలవంతంగా జన్నారం పోలీస్స్టేషన్లో లక్ష్మణ్పై కేసు నమోదు చేయించారు. అయినప్పటికీ వీరి ప్రేమను విడదీయ లేకపోయారు. గత సెప్టెంబర్ 24న అనురాధ తన సొంత ఇంటి నుండి తప్పించుకొని లక్ష్మణ్ వద్దకు చేరింది. ఇంట్లో కుటుంబం వేధించే పరిణామాలు గ్రహించి తనుకు లక్ష్మణ్కూ ఎలాంటి ప్రమాదం జరిగినా అందుకు తమ తండ్రి, గ్రామ సర్పంచ్ కొడుకు మల్లేష్లదే బాధ్యత అని అర్ధరాత్రి వీడియో రికార్డింగ్ చేసుకొని సెల్ఫోన్లో మిత్రులకు చేరవేసి తన ప్రేమికుడితో హైదరాబాదుకు వెళ్లి ఆర్య సమాజ్ మందిరంలో వివాహం చేసుకుంది. గత డిసెంబర్ 22న జాతీయ లోక్ అదాలత్లో లక్ష్మణ్పై పెట్టిన కేసును కొట్టివేయించుకొని జన్నారం మండలం కల మాడుగుకు వచ్చే ముందు పోలీసులకు సమాచారం అందించి గ్రామానికి చేరుకున్నారు. ఇంట్లో నూతన వధూవరులను ఆశీర్వదించే క్రమంలో కుటుంబ ముంది. రాత్రి7:30 గంటలకు గ్రామంలో విద్యుత్ ఆపివేసి 15 మంది అనురాధ కుటుంబీకులు ఒక్కసారిగా లక్ష్మణ్ ఇంట్లోకి వచ్చి కర్రలు పట్టుకొని అనురాధను లక్ష్మణ్నూ కొట్టారు. అక్కడే ఉన్న లక్ష్మణ్ పెదనాన్న కొడుకు లక్ష్మణ్ను దాడి నుండి విడిపించి ఇంట్లో ఉంచాడు. అనురాధను తీవ్రంగా గాయపరిచి మతిస్థిమితం కోల్పోయేలా కొట్టారు. ఆ తర్వాత బైక్పై ఊరవతలికి తీసుకెళ్లారు. లక్ష్మణ్ ఈ ఘటనపై 100కు డయల్ చేసి పోలీసులకు హెల్ప్లైన్ ద్వారా సంప్రదించాడు. 9.15 గంటలకు ఊర్లోకి వచ్చిన బ్లూకోర్టు పోలీసులు అనురాధ ఇంట్లోకి వెళ్లి పరిశీలించి ఎవరూ లేరని వెళ్లిపోయారు కానీ పోలీసులు ఊర్లో పరిశీలిస్తే అనురాధ బతికేది. అనురాధ తండ్రి సత్యనారాయణరావును కమిషనర్ ఎన్ని గంటలకు చంపారని అడిగితే తొమ్మిదిన్నర గంటలకు తల్లితో ఫోన్ మాట్లాడి మనసు మార్చుకోవాలని తల్లి చెప్తే ''నేను మార్చుకోను. అతడితోనే కాపురం చేస్తా''నని చెప్పింది. అప్పుడే ''గొంతు నులిమి చంపేయండి'' అని తల్లి చెప్పడంతో ''గొంతును నులిమి చంపేశాం'' అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు చితిమంటల దగ్గర ఉండి కాల్చామని, కాలిన బూ డిదను కాలవలో పడేసి వెళ్లిపోయానని చెప్పాడు. కేవలం కులం కాని వాడిని ప్రేమించినందుకు అనురాధను హత్య చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించనంతకాలం ఇలాంటి ఘటనలు రోజురోజుకు జరుగుతూనే ఉంటాయి.
తిప్పారపు సురేష్
సెల్ : 9490997703
Authorization