ముస్లిం కుటుంబాలలో స్త్రీకి చదువు పెద్దగా ఉండదు. పూర్తిగా భర్త, తండ్రిపై ఆధారపడి ఉంటారు. దీంతో కొందరు భర్తలు వారిని హింసిస్తూ ఉండటాన్ని, స్తోమత లేకపోయినా రెండు, మూడు పెండ్లీలు చేసుకొని భార్యలకు చేసే అన్యాయాన్ని ప్రస్తావించడమే ఈ నవల ముఖ్య ఉద్దేశం. 14 ఏండ్ల ఒక ముస్లిం చిన్నారి 20ఏండ్లు దాటకముందే ముగ్గురిని పెండ్లి చేసుకొని తలాక్ చెప్పడం నవలలో ఒక అంశం. 14 ఏండ్ల పాపను 60ఏండ్ల అరబ్ షేకు నిఖా చేసుకొని నెల పాటు వాడి, శారీరక కోరికలు రాక్షసంగా తీర్చుకొని తలాక్ ఇచ్చినందుకు ఆనందపడాలో, దు:ఖపడాలో తెలియని స్థితిని చెప్తునప్పుడు హృదయం ముక్కలైపోయింది. అదే అమ్మాయిని మరొక అరబ్ షేక్ నిఖా చేసుకొని మరో నెల పాటు ఆమెను వాడుకోడానికి అమితంగా ప్రేమను చూపించి అతను కూడా శారీరక వాంఛలు తీర్చుకొని తలాక్ ఇచ్చేస్తాడు. అప్పుడు గర్భం దాల్చిన అమ్మాయిని క్రూరుడైన, తాగుబోతు తండ్రి అమ్మాయి గర్భం తీయించి మరో అరబ్ షేక్కి ఇచ్చి పెండ్లి చేస్తే ఆ చిన్నారి బాధ వర్ణించడానికి కూడా సాధ్యం కావడం లేదు. మరో అమ్మాయి అరబ్ షేకును పెండ్లి చేసుకొని దేశం కాని దేశం వదిలి వెళ్లిపోయినప్పుడు, చేసుకున్న వాడికి ఆమె మూడో భార్య అని తెలిసినప్పుడు ఆమె మనసులో కలిగిన భావాలను రచయిత మనముందు అవిష్కరించినప్పుడు సమాజం ఎంత దుర్మార్గంగా ఉందో తెలుస్తుంది.
సమాజ నిర్మాణంలో ఒక వర్గం అధిక శ్రమ, కటిక పేదరికం అనుభవిస్తూ వచ్చింది. జాతి, ప్రాంతం, కుల, మత, వర్ణ బేధాలతో మనిషిని ముక్కలు ముక్కలుగా విడదీశారు. ఒక వర్గం రాజ్యంలో అధికంగా ఉండటం దిగవ, పేదవర్గాలు రాజ్యంలో లేకపోవడం, శ్రమదోపిడీ, వస్తు దోపిడీ ఇలా కొన్ని వర్గాలు మరికొన్ని వర్గాలపై ఆధిపత్యం చేస్తూనే వచ్చాయి. అది నేటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే బీదవారు అలాగే ఉండిపోయారు. ధనికులు మరింత ధనవంతులుగా మారిపోతూ వచ్చారు. అందులో ముఖ్యంగా కొన్ని కులాలు, మతాలు, లేదా కొన్ని వర్గాలు దారుణమైన వివక్షకు గురయ్యాయి. నేటికి వారి ఆర్థిక పరిస్థితి అలానే ఉండటంతో పొట్టకూటి కోసం వారు ఎలా మోసపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. స్త్రీపై వివక్ష అన్ని కులాలలో ఉంది. ఒక్కో కులంలో ఒక్కో రకంగా స్త్రీని అణచివేస్తూ వస్తున్నారు. భర్తకు భార్య బానిస అనేలా కొన్ని గ్రంథాలు చెప్తూ రావడం, వాటిని అనుసరించడం వల్ల స్త్రీపై ఎన్ని అగాయిత్యాలు జరిగాయో! బాల్య వివాహాలు, సతీసహగమనం, ఆడపిల్లలను అమ్మేయడం, మానసిక, శారీరక దాడులు, ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీని అడుగడుగునా ఒక ఆట వస్తువుగా చేసి కొంతమంది పురుషులు వేధించారు. అలాంటి పీడితుల పక్షాన నిలబడి వారిని సాహిత్యంతో చైతన్యపరచడం, వాస్తవాలను నిక్కచ్చిగా రాయడం, వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపడం వంటి కర్తవ్యాలను కొందరు కవులు, రచయితలు వారి భూజలపై వేసుకుంటూ వచ్చారు.
సయ్యద్ సలీం ఒక విలక్షణమైన రచయిత. ఆయన రచనలను బాగా గమనిస్తే సమాజానికి ఏదో ఒక విషయంపై అవగాహన కల్పించడం, పీడిత ప్రజల దీనగాధాలను వర్ణించడం, ఇలా రకరకాల అంశాలపై వారు విస్తృతంగా రచనలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా పేద ముస్లిం మహిళలపై జరిగే వివక్ష, పెత్తనం, మగ అహంకారం, మతంలోని కొన్ని లొసుగులను ఉపయోగించి వారిపై జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఇటీవల వచ్చిన నవల 'ఎడారిపూలు'. ఈ పుస్తకంలో ముస్లిం యువతులు దుబారు, సౌది లాంటి అరబ్ దేశాలకు ఏ విధంగా అమ్ముడుపోతున్నారో తెలిపారు.
నవలలో ముస్లిం మహిళల రకరకాల భావోద్వేగాలను చాలాచక్కగా వారి కథనంతో, శైలితో కట్టిపడేశారు. ఒక ముస్లిం మహిళ భర్తపై ఎలా ఆధారపడుతుంది. వారి స్వేచ్ఛను ఎలా అడ్డుకున్నారు. తలాక్ పేరుతో వారిని ఏ రకంగా అన్యాయానికి గురి చేశారు. ఒకటికి నాలుగు పెండ్లీలు చేసుకోవచ్చనే నెపంతో ఎలాంటి మోసాలు చేశారు. ముస్లిం యువతులను అరబ్ షేకులు శారీరకంగా ఎలా వాడుకున్నారు. ముక్కు పచ్చలారని పసిపిల్లల దేహాలతో వ్యాపారం చేసిన బ్రోకర్ల గురించి, అరబ్ దేశాలలో మన మహిళల వెట్టి చాకిరీ, అసత్య నేరాల ఆరోపణలతో జైలులో ఎలా మగ్గుతున్నారు, వావి వరసలు లేకుండా మహిళలను శారీరకం ఎలా వాడుకున్నారో చెప్తూ నడిచిన నవలే 'ఎడారిపూలు'.
ముస్లిం కుటుంబాలలో స్త్రీకి చదువు పెద్దగా ఉండదు. పూర్తిగా భర్త, తండ్రిపై ఆధారపడి ఉంటారు. దీంతో కొందరు భర్తలు వారిని హింసిస్తూ ఉండటాన్ని, స్తోమత లేకపోయినా రెండు, మూడు పెండ్లీలు చేసుకొని భార్యలకు చేసే అన్యాయాన్ని ప్రస్తావించడమే ఈ నవల ముఖ్య ఉద్దేశం. 14 ఏండ్ల ఒక ముస్లిం చిన్నారి 20ఏండ్లు దాటకముందే ముగ్గురిని పెండ్లి చేసుకోగా, వారంతా తలాక్ చెప్పడం నవలలో ఒక అంశం. 14 ఏండ్ల పాపను 60ఏండ్ల అరబ్ షేకు నిఖా చేసుకొని నెలపాటు ఆయన శారీరక కోరికలు రాక్షసంగా తీర్చుకొని తలాక్ ఇస్తే ఇక ఆ మహిళ ఏం చేయాలో తెలియని స్థితిని చెప్తునప్పుడు హృదయం ముక్కలైపోయింది.
అదే అమ్మాయిని మరొక అరబ్ షేక్ నిఖా చేసుకొని మరో నెలపాటు ఆమెను వాడుకోడానికి అమితంగా ప్రేమను చూపించి అతను కూడా శారీరక వాంఛలు తీర్చుకొని తలాక్ ఇచ్చేస్తాడు. అప్పుడు గర్భం దాల్చిన అమ్మాయిని తాగుబోతు తండ్రి అమ్మాయి గర్భం తీయించి మరో అరబ్ షేక్కి ఇచ్చి పెండ్లి చేస్తే ఆ చిన్నారి బాధ వర్ణించడానికి కూడా సాధ్యం కావడం లేదు.
మరో అమ్మాయి అరబ్ షేకును పెండ్లి చేసుకొని దేశం కాని దేశం వదిలి వెళ్లిపోయినప్పుడు చేసుకున్న వాడికి ఆమె మూడో భార్య అని తెలిసినప్పుడు ఆమె మనసులో కలిగిన భావాలను రచయిత మనముందు అవిష్కరించినప్పుడు సమాజం ఎంత దుర్మార్గంగా ఉందో తెలుస్తుంది.
సౌది అంటే నీతికీ, న్యాయానికి ప్రతీక అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాని తండ్రి, కొడుకులు, మరుదులు, భర్త స్నేహితులు ఆమెను శారీరకంగా వాడుకోవడాన్ని చెప్పినప్పుడు ఏ దేశంలోనైనా స్త్రీపై జరిగే రాక్షస, శారీరక దాడి ఎలా ఉంటుందో తెలుస్తుంది. తద్వారా స్త్రీ మనుగడ వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో అనే భయం కలుగుతుంది.
సలీంలో ఒక మంచి కవి కూడా ఉన్నాడు. కొన్ని చోట్ల సందర్భాలను వివరిస్తున్నప్పుడు ఆయన లోలోపలి కవి మనకు దర్శనమిస్తాడు. బాధ, అరాచకం, అన్యాయం, శారీరక హింస, వివక్ష, పెత్తనం, బీదరికం, స్వార్థం, మోసం, అమాయకత్వం, అవసరం, కోరిక, మగ అహంకారం, ఇలా ఈ నవలలో అన్ని అంశాలు మనకు కనపడుతాయి.
నేడు స్త్రీలపై జరుగుతున్న శారీరక దాడులపై మరిన్ని కఠిన చట్టాలు రావడమే కాదు, వాటిని అమలు పరచడంలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి. అసలు ఇలాంటివి ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని మూలాలను తెంచాల్సిన అవసరముంది. ఉపాధి ఇక్కడే దొరికితే వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వేరే దేశాలకు వెళ్లేవారికి మరింత అవగాహన, అక్కడ మనవారికి మన ప్రభుత్వం అండదండ ఉండాలి. ఇక తలాక్ వల్ల స్త్రీలు ఇప్పటికీ అన్యాయానికి గురవుతున్నారు. ఒక మంచి అంశాన్ని తీసుకొని చక్కని కథనంతో ఈ 'ఎడారిపూలు' నవలను మనకు అందించిన సయ్యద్ సలీంకు అభినందనలు.
- లై
సెల్ : 9491977190
Authorization