ఏసురత్నం
మీకు ఉన్న భూమిని వీరికి పట్టా చేయాలని ఒత్తిడి చేస్తూ చివరకు కుల బహిష్కరణకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగా పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. 30 సంవత్సరాల క్రితం రాజేశ్వర్రావుపేట గ్రామానికి చెందిన రామేశ్వర్రెడ్డి నుంచి బండలింగాపూర్ గ్రామానికి చెందిన కందరి గంగారెడ్డి కొనుగోలు చేశాడు. సర్వే నెంబర్ 80లో ఎకరం 32 గుంటలను కొనుగోలు చేయగా ఈ భూమి నుంచి బండలింగాపూర్ గ్రామానికి చెందిన బద్ధం కోటేశ్, సామ వెంకట్ నర్సయ్యలకు పక్కపక్కనే వ్యవసాయ హద్దులు ఉంటాయి. అయితే ఎకరం 32 గుంటల భూమిలో 9 గుంటల భూమిని కోటేశ్, వెంకట్నర్సయ్యలపై పట్టా చేయాలని కులపెద్దలు నిర్ణయించి గంగారెడ్డి కుటుంబ సభ్యులకు వారం రోజుల గడువును ఇచ్చారు. మా భూమిని వారికి ఎందుకు పట్టా చేస్తామని కుల పెద్దలను బాధితులు ప్రశ్నించారు. అయినా కుల పెద్దలు పట్టా చేయాల్సిందేనని తెగేసి చెప్పారు. కానీ ఎందుకు చేయాలో సరైన సమాధానం చెప్పకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఇలా గడిచినా వారికి పట్టా చేయకపోవడంతో కుల పెద్దల మాట వినలేదని 'నిన్ను ఊరి నుంచి వెలివేస్తున్నామని' కుల పెద్దలు ఆయనను బహిష్కరించారు. దీంతో చేసేది ఏమి లేక గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. ఇలా నెల రోజులుగా మానసికంగా కృంగిపోయి ఆవేదన చెందినట్లు గంగారెడ్డి, వెంకట్రెడ్డిలు తెలిపారు. కులపెద్దల మాట వినక ధిక్కరించినందుకు మొదట రూ.50వేల జరిమానా విధించి మళ్లీ రూ.1లక్ష50వేల జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారని చెప్పారు. అంతటితో ఆగకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘం చేసిన ఖర్చులు తానే భరించాలని హుకుం జారీచేశారు. ఇవి చెల్లిస్తేనే కుల బహిష్కరణ ఎత్తివేస్తామని గంగారెడ్డి కుటుంబ సభ్యులకు కుల పెద్దలు తెలిపారు.
ఇదీ పంచాయతీ
సుమారు 5 నెలల క్రితం సరిహద్దు భూ విషయంలో విభే దాలు ఏర్పడ్డాయి. అదే గ్రామానికి చెందిన కందరి గంగా రెడ్డి భూమి విషయంలో పక్కనే ఉన్న మిగతా వారికి గొడ వలు తలెత్తగా బద్ధం కోటేశ్, సామ వెంకట నర్సయ్య, కంద రి గంగారెడ్డి గుడేటి కాపు సంఘం పెద్దల వద్దకు వెళ్లారు. అక్కడ కుల సంఘ సభ్యులకు కందరి గంగారెడ్డి భూమి పట్టాను చూపించారు. అయితే మీ పట్టా భూమిలో వీరికి చెందిన భూమి ఉన్నది, ఆ భూమిని వీరిపేర రిజిస్ట్రేషన్ చేయాలని గుడేటి కాపు సంఘ సభ్యులు గంగారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో నేను నా భూమిని వారికెందుకు రిజిస్ట్రే షన్ చేయాలని ప్రశ్నించడంతో ఆ కుటుంబాన్ని కుల బహి ష్కరణ చేశారు. వారితో ఎవరు మాట్లాడిన జరిమానా విధి స్తామని హెచ్చరించారు. బహిష్కరణ చేయడంతో పాటు రూ.ఒక లక్ష యాభై వేలు జరిమానా విధించారు. అలాగే గంగారెడ్డి కూతురు గంగారెడ్డితో మాట్లాడినందుకు రూ. 30వేలు జరిమానా విధించారు. చేసేదేమి లేక వారు ఆ జరిమానాను గుడేటి కాపు సంఘ సభ్యులకు చెల్లించారు. దీంతో ఎక్కడ న్యాయం జరగకపోవడంతో ఆగష్టు 10న జిల్లా కేంద్రంలోని అప్పటి ఎస్పీ సునీల్ దత్కు బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. తిరిగి తన గ్రామానికి రావడానికి భయ పడ్డ గంగారెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు మెట్పల్లిలో ఓ ఇంటిని కిరాయికి తీసుకొని తలదాచుకుంటున్నాడు.
సొంత కూతురు మాట్లాడినా జరిమానా
గ్రామంలో వీరితో ఎవరు మాట్లాడిన జరిమానాలు విధిస్తామని హుకుం జారీ చేశారు. ఇంతటితో ఆగకుండా గంగారెడ్డి కూతురు ఏనుగు సత్తమ్మ, అల్లుడు రామానుజం వీరితో మాట్లాడినందుకు సత్తమ్మకు రూ.30వేలు జరిమా నా విధించినట్లు వివరించారు. అంతటితో ఆగకుండా పి డుగు అమృత్లబ్ మాట్లాడినందుకు రూ.10వేల జరిమా నా విధించారు. చేసేదేమి లేక వీరు కులపెద్దలకు జరిమా నాలు కట్టారు. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్కు వెళ్లి దరఖా స్తు చేసినా తగిన న్యాయం జరగలేదని, జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.
సెల్ : 9948163703
Authorization