డా||పోలం సైదులు
గ్రామాల్లో జోస్యం అంటూ వివిధ రూపాల్లో, వివిధ వేష అలంకారాలతో వీధుల వెంట తిరుగుతూ, జరిగినది, జరుగుతుంది, జరగబోయేది చెబుతాం అంటూ సంచరిస్తూ, సామాన్య ప్రజానీకానికి సాధారణంగా వుండే సమస్యలు చెబుతూ, మానసికంగా నమ్మకం కల్గించి, వివిధ దోషాలున్నాయనీ, వాటిని రూపుమాపేందుకు కొంత ఖర్చు అవుతుందనీ, అవి జరిపించుకుంటే మీకు శుభఫలితాలొచ్చి మంచి జరుగుతుందనీ చెబుతుంటారు. అందులో భాగంగా రంగురంగుల ఉంగరాల రాళ్లను ఎక్కడెక్కడో తెచ్చామనీ అధిక ధరతో ఇవ్వడం, పంచవర్ణాల తాయత్తు ఇవ్వడం, వివిధ రకాల పూజలు చేయించడానికి కావలసిన సరకులు తెప్పించి తతంగం నిర్వహిరస్తుంటారు. ఇలాంటివన్నీ సామాన్య ప్రజానీకంపై, పేదలపైననే, కష్టాలలో వున్న ప్రజానీకాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నాయి. ఇంకొంతమంది ఇంకొంచెం అతి తెలివితో, నిమ్మకాయలను కోసి రక్తం కారుతుందని చెప్పడం, కొబ్బరికాయతో విభిన్న రకాల భయాందోళనలకు గురిచేస్తూ, ఇంకా వివిధ రకాల మ్యాజిక్లతో సామాన్య ప్రజానీకం జీవితాలతో ఆడుకొని వారి శ్రమ ఫలితాలను లాక్కుంటారు.
అనారోగ్యానికి గురైనప్పుడు బాగు చేయడం, మరీ అతిక్ర మిస్తే అవయవాన్నీ మార్చివేయగల పరిజ్ఞానాన్ని కలిగి న ఈ రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలను విశ్వసించడం అవివే కం. అయినా 'కుక్క తోక వంకర' అన్నట్టు మూఢనమ్మకాలను ఇంకా ఆచరిస్తున్నారంటే మనం సాధిస్తున్న ప్రగతికి ఫలితం ఇదేనా? అని పునరాలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజంగానే నిమ్మకాయలు, అగరుబత్తీలు, సాంబ్రాను, కొబ్బరికాయలు, ఎం డు మిర్చి, జీడి గింజలు, పసుపు, కుంకుమ, నల్లటి దారం, తా యిత్తులకు అంతటి మహిమ (శక్తి) వుంటుందా? చేతబడి చేస్తు న్నారనే నెపంతో ఇలాంటి వారిపై దాడిచేసి, తనను నమ్ముకున్న కుటుంబాన్ని ఇరకాటంలో పెట్టి కష్టాలపాలు చేయడమనేది ఎంత వరకు మంచిది. నిజంగానే వాటికి అంత శక్తి ఉంటే ఆ మంత్ర శక్తులు వున్నవారు రాజులై పాలితులయ్యేవారు కానీ వాళ్ళు అలా బీదరికంతో బాధపడేవారు కారుకదా? మంత్రాలకు అంతటి అతీత శక్తులే ఉంటే పొరుగునవున్న శత్రు దేశాల నుండి మనల్ని కాపాడటానికి భారతమాత ముద్దుబిడ్డలైన వీర జవానులు సరిహద్దులలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉండేదా? లంచగొండులు, అవినీతిపరులు హాయిగా ఉండగలిగేవారా? అంటే అక్షరాస్యత కలిగిన వారు, మేధావులు, ధనవంతులపై ఇలాంటి మంత్రశక్తు లు పనిచేయవా? ఎందుకు మన గ్రామీణ ప్రాంతంలోని నిమ్న వర్గానికి చెందిన పేదలే వీటి మూలంగా తమ జీవితాలను నా శనం చేసుకుంటున్నారు? నిజంగానే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? గతంలో అక్షరాస్యత అంతగా లేని కాలంలో, శా స్త్ర, సాంకేతిక, పరిజ్ఞానం అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు మ ంత్రాల భ్రమలు ఉండేవి. నేటి ఆధునిక పరిస్థితులలో కూడా మంత్రాలున్నాయనడం ఒక్కెత్తైతే, ఉన్నత చదువులు చదివి, ఉన్న త స్థానాలలో వున్నవారు కొంతమంది వాటిని నమ్మి, ఊతమి వ్వడం ఒకెత్తు. మనిషి వ్యక్తిగత శైలి, అభిరుచి, అలవాట్లు అనేవి మరొక వ్యక్తి నుండి అనుకరణ ద్వారా అలవాటు అవుతాయి. శాస్త్రీయంగా నిరూపణలేని అంశాలకు ( మూఢ నమ్మకాలకు ) ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేటి గ్రామీణ సమా జంలో అవలంభిస్తున్న కొన్ని నమ్మకాలను పరిశీలించిస్తే... చేతబ డి పేరుతో మనుషులను చంపుతున్నారన్న నెపంతో గతంలో తెలంగాణలోని వివిధ జిల్లాలలో చంపడం, జైలుకు వెళ్లడం చూశాం. చేతబడిని చిల్లంగి, బాణామతి, మంత్రం అని వివిధ పేర్లతో పిలవడం, విదేశాలల్లో బ్లాక్ మేజిక్, విచ్ క్రాఫ్ట్ అని రక రకాల పేర్లతో పిలిచినా ప్రపంచవ్యాప్తంగా వీటి వెనుక దాగివున్న అసలు విషయం ఒక్కటే. చిత్ర విచిత్ర చిత్త భ్రమలే! గ్రామాలలో ని ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, నేరుగా వారి కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకెళ్లకుండా మంత్రగాలతో మంత్రించ డం, తాయితలు కట్టించడం అప్పటికీ తగ్గకపోతే ఎరుక చెప్పిం చడం చూస్తున్నాం. కొందరు పూనకంతో ఊగి వారికేమైందో చెప్పడం, వాటిని బాధితులు పూర్తిగా నమ్మడం వారేమో అంత తెలిసినట్టుగా మీరు ఫలాన దేవతలకు మొక్కు తీర్చలేదనో, బం ధువులో, పాలోళ్లు, ఇంటికి అవతలి, ఇవతలి వారో చేతబడి చేశా రనీ సెలవిచ్చి, వీరిని నమ్మించడం జరుగుతుంది. అంతటితో ఊరుకోక నేను తగ్గిస్తానని, చేయవలిసిన కొన్ని పనులను కూడా చెబుతారు. చేతబడి నుండి బయట పడాలంటే, మంత్రగాడిని ఊరి నడిబొడ్డున కట్టేసి గ్రామస్తులందరు కొట్టడం, నగన్గా ఊరేగించడం, అతని ముందరి పళ్లను విరగొట్టడంలాంటి ఎన్నో తతంగాలను చేయిస్తూ, బాధితుల నుండి డబ్బులు లాగుతూ కాలయాపన చేస్తూ, అసలు రోగం ముదిరే వరకు ఆలస్యం చేసి వారి మరణాలకు కారకులవుతున్నారు. నిండుగా అలంకరించు కున్నారంటే చాలు రాత్రి వేళలో దిష్టి తీయించుకోవాల్సిందే, నూతన దుస్తులు ధరించినా, అందంగా ఉన్నా, తినే సమయంలో ఎవరైనా చూసినా, చలాకీగా మాట్లాడినా దిష్టియే. రోజంతా పనులు చేసి అలసిపోయి మెల్లగా నిద్రలోకి జారుకుంటే ఏమైనా కలలు వచ్చాయా? అంతే సంగతులు పొద్దున లేవగానే ఇంట్లో వారంతగా ఉమ్మడిగా చర్చలు కొనసాగించి, విశ్లేషణ చేస్తుంటా రు. కలలో చిన్న పిల్లలు కనిపిస్తే బాలమ్మ దేవతని, ముత్తైదలు కనిపిస్తే పోశమ్మని వివిధ రకాల వాహనాలు, మేకలు కనిపిస్తే మైసమ్మ దేవతని, తెల్లచీర కట్టుకుని కలలోకి వస్తే ఇదమ్మని, ఫకీరులు, (ముస్లింలు)గానీ, గుర్రాలు గానీ కనిపిస్తే దర్గా దేవుం డ్లని నమ్మడం, ఏవో మొక్కులుండి తీర్చకపోయినందుకే ఇలా వచ్చాయని నమ్మి వెంటనే వివిధ రకాల కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. అంటే మన చదువులలో శాస్త్రీయత లోపించింది. వీటన్నిటినీ నమ్మడం మూలంగా సమయాన్ని, ధనాన్ని వధాగా ఖర్చు చేయవలసి వచ్చి, ఆర్థిక లేమితో బాధపడాల్సిరావడం సాధారణమైంది.
గ్రామాల్లో జోస్యం అంటూ వివిధ రూపాల్లో, వివిధ వేష అలంకారాలతో వీధుల వెంట తిరుగుతూ, జరిగినది, జరుగు తుంది, జరగబోయేది చెబుతాం అంటూ సంచరిస్తూ, సామాన్య ప్రజానీకానికి సాధారణంగా వుండే సమస్యలు చెబుతూ, మాన సికంగా నమ్మకం కల్గించి, వివిధ దోషాలున్నాయనీ, వాటిని రూ పుమాపేందుకు కొంత ఖర్చు అవుతుందనీ, అవి జరిపించుకుంటే మీకు శుభఫలితాలొచ్చి మంచి జరుగుతుందనీ చెబుతుంటారు. అందులో భాగంగా రంగురంగుల ఉంగరాల రాళ్లను ఎక్కడెక్కడో తెచ్చామనీ అధిక ధరతో ఇవ్వడం, పంచవర్ణాల తాయత్తు ఇవ్వ డం, వివిధ రకాల పూజలు చేయించడానికి కావలసిన సరకులు తెప్పించి తతంగం నిర్వహిరస్తుంటారు. ఇలాంటివన్నీ సామాన్య ప్రజానీకంపై, పేదలపైననే, కష్టాలలో వున్న ప్రజానీకాన్ని లక్ష్యం గా చేసుకొని జరుగుతున్నాయి .ఇంకొంతమంది ఇంకొంచెం అతి తెలివితో, నిమ్మకాయలను కోసి రక్తం కారుతుందని చెప్పడం, కొబ్బరికాయతో విభిన్న రకాల భయాందోళనలకు గురిచేస్తూ, ఇంకా వివిధ రకాల మ్యాజిక్లతో సామాన్య ప్రజానీకం జీవితాలతో ఆడుకొని వారి శ్రమ ఫలితాలను లాక్కుంటారు.
మూఢనమ్మకాలను నమ్మవద్దని, ప్రజలలో చైతన్యం తేవ డానికి స్వచ్ఛంద సంస్థలు మరెన్నో పుట్టుక రావాల్సిన తరుణ మిది. నేడు గ్రామాల్లో, పల్లెల్లో నుంచి మేధావులు పుట్టుకొస్తున్న ఈ సందర్భంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దేనికి ఆదర్శమో ఆలోచించాల్సిన అవసరమున్నది. ప్రభుత్వాలు సైతం శాస్త్రీయ ఆలోచనలతో మూఢనమ్మకాల నిర్మూలనలో బాధ్యత వహించవల్సిన అవసరం వున్నది.నిరక్షరాస్యత, పేదరికం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేకపోవడం వలన గతంలో మూఢనమ్మకాల ప్రభావం అధికంగా ఉండేది. నేడు ఎంతో పురోభివద్ధి జరిగింది. అయినా ఇంకా పలుచోట్ల మూఢనమ్మకాల బారిన పడుతున్నాం. చేతబడి అనే మూఢనమ్మకం వలన దేశంలో 2008-12 మధ్య 770 మంది మహిళల ప్రాణాలు తీసారని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలలోనూ చేతబడి నెపంతో కలిగే ఘోరపరిస్థితిని జాతీయ స్థాయి నేర నమోదు సంస్థ గణాంకాలు కలవరపరుస్తున్నాయి. ఇంకా ఇవి ఇలాగే కొనసాగితే మనం సాధిస్తున్న ప్రగతికి విలువ లేకుండా పోతుంది. వీటిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. విద్యార్థి దశలోనే ప్రపంచ స్థాయి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనా కల్గించాల్సిన అవసరం ఉన్నది.
సెల్ : 944193036
Authorization