ఏసురత్నం
కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకొని కలిపి సుఖంగా జీవించాలి. కానీ ఆ కుటుంబ సమస్యే కుల బహిష్కరణకు గురైన సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మేడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మేడిపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ల రాజరెడ్డికి ఇద్దరు భార్యలు మొదటి భార్య కూతురుకు పెండ్లి విషయంతో వచ్చిన గొడవతో మొదటి భార్య కుల పెద్దలను ఆశ్రయించింది. దీంతో కుల సంఘ సభ్యులు రాజరెడ్డిని కుల సంఘ సమావేశానికి రావాలని పలుమార్లు సూచించారు. ఎంతకూ రాజరెడ్డి అక్కడికి వెళ్లలేదు. దీంతో ఆయనతో ఎవరు మాట్లాడకూడదు, వారి వ్యవసాయ పనులకు ఎవరు వెళ్లవద్దనే నిబంధనలు విధించారు. దీంతో చేసేది లేక స్థానిక పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో కుల సభ్యులను పోలీసులు పోలీస్స్టేషన్కు పిలిపించారు. అక్కడ పోలనీసులు కౌన్సిలింగ్ చేయడంతో రాజరెడ్డిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని, బహిష్కరణలు అలాంటివి చేయకూడదని, అందరూ కలిసిమెలసి ఉండాలని ఒప్పంద పత్రంపై 8.6.2018న రాసుకున్నారు. 19.12.2018న మళ్లీ గుడేటి కాపు సంఘం సభ్యులు సమావేశం నిర్వహించి రాజరెడ్డిని మళ్లీ పంచాయతీకి పిలిచారు. అక్కడ రూ.33వేల జరిమానా కట్టాలని తీర్మానించారు. తాను కట్టలేనని అని రాజరెడ్డి ఖరాఖండిగా చెప్పడంతో ఆయనతో ఎవరు మాట్లాడవద్దని, వారి వ్యవసాయ పనులకు ఎవరు వెళ్లవద్దని కుల సంఘం సభ్యులు తీర్మానించారు. దీంతో మళ్లీ ఠాణాను ఆశ్రయించాడంతో ఆ కుల సంఘం సభ్యులైన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయినప్పటికీ బహిష్కరణ కొనసాగుతూనే ఉంది.
సెల్ : 9948163703
బహిష్కరించిన వారిపై కేసు నమోదు చేశాం
ఇబ్రహీంపట్నం మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల రాజరెడ్డిని కుల బహిష్కరణకు గురిచేసింది నిజం. అది కుటుంబ పంచాయితి. అందులో అనవసరం గా కుల పెద్దలు జోక్యం చేసుకున్నారు. పెద్ద లు తగాదాలను పరిష్కరిస్తే మంచిది. కానీ ఇలా కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కర ణలు చట్ట విరుద్దం. రాజరెడ్డిని కుల బహిష్క రణ చేసిన వారిపై కేసు నమోదు చేశాం. వారిని త్వరలో కోర్టుకు హాజరు పర్చి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
- రామ్నాయక్, ఎస్ఐ
Authorization