- దళిత సర్పంచ్ అభ్యర్థికి పెత్తందారుల బెదిరింపులు
ఎం.రవిందర్:
మనది ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో ప్రతి పౌరుడూ స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎన్నికల్లో పాల్గొనవచ్చు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ కొందరు పెత్తందారులు దళితులను తమ కీలు బొమ్మల్లా వాడుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీకి కేటాయించిన స్థానంలో తమ తొత్తులుగా, తమ చెప్పుచేతుల్లో ఉండేవారిని నిలబెట్టి గెలిపించుకునేందుకు అన్ని రకాల కుతంత్రాలు పన్నుతున్నారు. అంతోఇంతో రాజకీయంగా చైతన్యవంతులైన దళితులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడితే తమ విధివిధానాలు ప్రజలకు తెలిపి ఓటు అభ్యర్థించకుండా అడ్డుపతున్నారు. వీధుల్లో తిరిగి ప్రచారం చేస్తే నీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్ర సిద్ధించి 70 ఏండ్లు దాటినా ఇంకా దళితుడు తమ చెప్పు చేతుల్లోనే ఉండాలని, తాము చెప్పినట్టే వినాలని పెత్తందారులు గ్రామాల్లో హుకూం జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కొరవడింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే అక్కడ పెత్తందారుల ఆగడాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
''అధికారంలో మేమున్నాం... మేము చెప్పిం దే ఇక్కడ వేదం. కాదంటే శాల్తీ లేచిపోతుంది. పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థినే గెలి పించుకుంటాం. కాదని ప్రచారం చేస్తే కాళ్లూ చేతులు విరుగుతారు'' అంటూ పెత్తదారులు దళిత సర్పంచ్ అభ్యర్థిని బెదిరిస్తున్నారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలోనే ఈ పరిస్థితి నెలకొంది. రాష్ట్రం లో ప్రజాస్వామ్యబద్దంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకవైపు కసరత్తు చేస్తుంటే అధికార పార్టీకి చెందిన నాయకులు ఎస్సీలకు రిజర్వు అయిన గ్రామ పంచాయతీలలో పెత్త నం చెలాయిస్తున్నారు. తమకు అనుకూలమైన అభ్యర్థిని గెలుపించుకోవడానికి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ ఎస్సీలకు రిజర్వు అయ్యింది. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన జోగు నర్సిములు, టీఆర్ఎస్ బలపర్చిన శేఖర్లు బరిలో ఉన్నారు. అయితే టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి శేఖర్కు పెత్తదారులు మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన బోగు నర్సిములును ఓడించడానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య పెత్తదారులు చిచ్చుపెట్టారు. అగ్ర వర్ణాలు పథకం ప్రకారం ఇరువురి మధ్య కొట్లాట పెట్టాయి. ఒకరిపైఒకరు దాడులు చేసుకునే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. అందులో భాగంగానే కిరాణ షాపు యజమాని జోగు చిన్నయ్యపై దాడి జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ బలపర్చిన జోగు నర్సిములు గ్రామంలో ప్రచారం నిర్వహించకుండా పథకం వేసి అడ్డుకుంటున్నారు. ఇంతటితో అగకుండా ''నీవు మా కాలనీలో అడుగు పెడితే నీ అంతు చూస్తామ''ని బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేమిలేక నామినేషన్ వేసిన జోగు నర్సిములు ప్రచారం చేయకుండా ఇంటికే పరిమితమయ్యాడు. రాహులపల్లి అను బంధ గ్రామంగా ఉన్న తిమ్మాపూర్ ఇటీవల గ్రామ పంచాయతీగా మారింది. ఈ గ్రామంలో 1550 మంది జనాభా ఉండగా 487 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రామంలో అగ్రవర్ణాలు ఏం చెబితే అది వినాల్సిందే. లేదంటే ఆ కుటుంబాన్ని ఏదో రకంగా హిసిస్తారు. ఇక్కడా అదే జరిగింది. వారికి అనుకూలంగా ఉన్న శేఖర్ను గెలిపం చుకొని అంతా వారే చూసుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నారు. కాని జోగు నర్సిములు వారి మాట వినకుండా నామినేషన్ వేశారు. ఎస్సీ రిజర్వుడు అయినా పెత్దదారులు ఓట్లే ఇక్కడ అధికంగా ఉం టాయి. గ్రామ సర్పంచ్ అభ్యర్థితోపాటు వార్డు మెంబర్గా నామినేషన్ వేసిన చంద్రపల్లి అంతయ్య ఇంటికి వచ్చి బెదిరించారు. ఈయన పొలాలు పెత్తదారులు పొలాల దగ్గర ఉండటంతో చేసేది ఏమి లేక ఆయన ప్రచారం చేసుకో కుండా ఇంటికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికి ప్రచారం చేస్తున్న జోగు చి న్నయ్య అనే దళిత కుటుంబ సభ్యులను బెదిరిం పులకు పాల్పడి గ్రామం నుంచి వెళ్లగొట్టే ప్రయ త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య కొట్లాట పెట్టారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే విధంగా అగ్రవర్ణాలు పథకం రూపొందించాయి. నేడు గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుంతోనని బాధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు ఈ తతాంగాన్ని నడిపిస్తున్నాడని గ్రామస్తులు అంటున్నారు. ఆయన కుమారులు రాత్రి వేళలో బాధితులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయందోళన గ్రామస్తుల్లో ఉంది. తమకు అనుకూలమైన అభ్యర్థిని గెలిపించుకొని ఉప సర్పంచ్గా ఎన్నికై పెత్తనమందా తామే చెలాయించాలనే ధోరణితోనే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఈ పథకం పన్నాడని కొందరు అంటున్నారు. మరోపక్క ఇతర ప్రాంతాల్లో ఉన్న పెత్తదారులు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదనే చెప్పవచ్చు. తాను మర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని అయినా నేటికి వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సర్పంచ్ అభ్యర్థి నర్సిములు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగకుంటే తాము ఊరు విడిచి వెళ్లవలసిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సెల్ : 9490099505
Authorization