21వ శతాబ్దంలో కూడా డబ్బుకు, పరువుకు, కులానికి అధిక ప్రాధాన్యతనిస్తుండటం దురదృష్టకరం. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో గతంలో ఇలాంటి కుల దురహంకార హత్యలు జరిగాయని వినేవాళ్లం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటివి జరగడానికి ఆయా ప్రాంతాల వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, పేదరికం మొదలైనవి కారణాలుగా చెప్పవచ్చు. కానీ ఇటీవల ఈ విష సంస్కృతి అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఈ విష జాఢ్యం పాకింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక మంది యువకులు కుల జాఢ్యం కారణంగా పాశవికంగా హత్య చేయబడ్డారు. ప్రేమపేరుతో రెండు వేరువేరు సామాజిక వర్గాల మధ్య కులాంర వివాహాలు చేసుకుంటుంటే సహించలేకుండా హత్యలకు పాల్పడుతున్నారు. తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ తీవ్ర అభ్యంతరాన్ని హత్యల రూపంలో బయటపెడ్డటం, అమానవీయంగా, క్రూర మృగాలను చంపినట్టు వేట కత్తులతో మనుషులను చంపడం అంటే ఈ సమాజం ఎటుపోతోంది?
మానవుడు అధునాతన శాస్త్ర, సాంకేతిక రంగాలవైపు విజయవంతంగా దూసుకుపోతున్నాడో నైతిక విలువల విషయంలో అంత అధ: పాతాళానికి పడిపోతున్నాడో ఈ మధ్యకాలంలో జరిగిన ఘోరకలిని బట్టి చెప్పవచ్చు. భారతదేశంలో తరతరాలుగా వస్తున్న నిచ్చెన మెట్ల వ్యవస్థకు ప్రాణం పోసి ఇప్పటి వరకు దాన్ని సజీవంగా కాపాడుతున్నది మనుధర్మశాస్త్రమే. అగ్రకులానికి చెందిన పురుషులు అణగారిన బడుగు వర్గాలకు చెందిన స్త్రీలపై ఎన్ని ఆకృత్యాలకైనా పాల్పడవ్చు. ఎలాంటి దాడులకు పాల్పడినా అడిగేవారుండరు. కానీ అదే అణగారిన బడుగు, దళిత వర్గాలకు చెందిన మగవారు మాత్రం అగ్రవర్ణ స్త్రీలపై ప్రేమ ప్రకటించరాదు. పెండ్లి చేసుకోరాదు. అలా చేస్తే అతని కండ్లను తీసివేయాలని మనుస్మృతి బోధిస్తుంది. కులం, మతం అనేవి సంకర జాతికి పుట్టిన రెండు కవల రాక్షసుల్లాంటివి. కులం, మతం అనేవి భారతదేశానికి కుక్కమూతి పిందెలాంటివి.
21వ శతాబ్దంలో కూడా డబ్బుకు, పరువుకు, కులానికి అధిక ప్రాధాన్యతనిస్తుండటం దురదృష్టకరం. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో గతంలో ఇలాంటి కుల దురహంకార హత్యలు జరిగాయని వినేవాళ్లం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటివి జరగడానికి ఆయా ప్రాంతాల వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, పేదరికం మొదలైనవి కారణాలుగా చెప్పవచ్చు. కానీ ఇటీవల ఈ విష సంస్కృతి అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఈ విష జాడ్యం పాకింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక మంది యువకులు కుల జాఢ్యం కారణంగా పాశవికంగా హత్య చేయబడ్డారు. ప్రేమపేరుతో రెండు వేరువేరు సామాజిక వర్గాల మధ్య కులాంర వివాహాలు చేసుకుంటుంటే సహించలేకుండా హత్యలకు పాల్పడుతున్నారు. తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ తీవ్ర అభ్యంతరాన్ని హత్యల రూపంలో బయటపెడ్డటం, అమానవీయంగా, క్రూర మృగాలను చంపినట్టు వేట కత్తులతో మనుషులను చంపడంతో ఈ సమాజం ఎటుపోతోంది? మానవ విలువలన్నీ ఏమైపోతున్నాయి? అని యావత్ సభ్య సమాజం గుండెలమీద చేయివేసుకొని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ విలువలకీ ప్రస్థానం? దీని ద్వారా సమాజానికి మనం ఏం అందిస్తున్నామో తెలుసు కోవాలి. గౌతమబుద్ధుడు నడియాడిన పరమ పవిత్రమైన ధర్మ క్షేత్రంలో నేడు జరుగుతున్న దేమిటి? వరుసగా మంథని మధుకర్, స్వాతి, నరేష్, రాజేష్, ప్రణయ్ ల హత్యలు దళితులపై ఒక పథకం ప్రకారం హత్యలు జరుగుతున్నాయా? అనిపిస్తుంది. గతంలో ప్రేమ పెండ్లీలు చేసుకున్న దళిత యువకులను అగ్రవర్ణాలకు చెందిన వారు చంపినా నేటికీ ఆయా హత్యలలో ప్రధాన పాత్ర పోషించిన వారికి సత్వరమే కఠిన శిక్షలు పడకపోవడంతో వెనువెంటనే ఒకదాని తర్వాత ఒకటి అనగా మిర్యాలగూడలో ప్రణరు ఉదంతం నుంచి తేరుకోకపముందే హైదరాబాద్ ఎర్రగడ్డలో ప్రేమ పెండ్లి చేసుకున్న మాధవి, ప్రవీణ్కుమార్లపై దాడులకు తెగబడటం నిందితులకు భయం లేకుండా పోయి, పైగా ప్రోత్సహిచినట్టవుతుంది. అందుకే ఇటీవల మరికొన్ని ఘటనలు వెలుగుచూశాయి. అలా కాకుండా అగ్రవర్ణాలకు చెందిన దోషులకు గానీ, కుల దురహంకార హత్యలు చేస్తున్న దోషులకు వెంటనే శిక్ష పడాలంటే సిట్టింగ్ జడ్జీతో కేసు విచారణ వేగవంత చేసి నిందితులకు ఉరిశిక్షను అమలు చేస్తేనే కులాంతర వివాహాలు చేసుకున్న దళిత యువకులను కాపాడుకుంటాము. కులం కాకుండా మానవులలో గుణం ప్రధానంగా చూడాలి. సమ సమాజ స్థాపన జరగాలంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ బిఆర్.అంబేద్కర్, మహాత్మా, జ్యోతిరావు ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ల ఆశయాలకు అనుగుణంగా అనగా కులాంతర వివాహాలు ప్రభుత్వమే జరిపించి, ప్రతి ఊరిలో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ కల్పించి, వారికి తగిన జీవనోపాధి కల్పించాలి. కుల దురహంకారం, డబ్బు మదంతో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనే పద్ధతి వల్ల ఇంకా ఎంతమంది ప్రణయ్ లను బలి తీసుకుంటుందో ఏమో? కులాల మధ్య ఉన్న అడ్డుగోడల్ని తొలగించి, నీతి, మానవత్వమున్న మనుషులను తయారు చేసేందుకు కావాల్సిన కార్యాచరణ ప్రణాళికలను ప్రభుత్వమే స్వచ్ఛంద సంస్థలు, యువతీ యువకులు, మహిళా సంఘాలు ఇతర భావసారూపత్య కలిగిన సంస్థలను, వ్యక్తులను కలుపుకొని ప్రభుత్వమే ఆ దిశగా అడుగులు వేస్తే డా||బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నకలలు సాకారమవుతాయి. కుల జాఢ్యపు పీడ విరగడవుతుంది.
- పసుల స్వామి
సెల్ : 9652872885
Authorization