మల్లేశ్:
భారత రాజ్యాంగం ప్రకారం 21 సంవత్సరాలు నిడిన పురుషుడు, 18 సంవత్సరాలు నిండిన మహిళ ఎవరైన వారి ఇరువురికి ఇష్టమైతే పెండ్లి చేసు కోవచ్చు. అందులో ఎలాంటి కుల,మతాలకు తావు లేదు. ఇరువురికి ఇష్టమై పెండ్లి చేసుకోవాలని అనుకుంటే, అవసరమైతే చట్టం కూడా భద్రత కల్పిస్తుంది. చట్టం ఇలా చెప్తున్నా ఆ ధైర్యం యువతలో కల్పించలేకపోతోంది..? ప్రస్తుత సమాజంలో కులమతాల కట్టుబాట్లతో పరిస్థితి చట్టానికి పూర్తి విరుద్దంగా ఉంది. సమాజంలోని కుల మతాల కట్టుబాట్లు దాటుకొని, చట్టం ప్రకారం నడుచుకునే వ్యవస్థ మన వివాహ వ్యవస్థలో కొరవడింది. కట్టుబాటు అడ్డుగోడల్ని దాటుకొని పెండ్లి చేసుకోలేక యువత బలవన్మరణాలకు పాల్పడుతుంది. అందుకు ఉదాహరణ మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సి లింగాపూర్ గ్రామ శివారులో ఇటీవల జరిగిన ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్య. ఈ ఘటన హృదయాలను కలచివేసోంది. మండల పరిధిలోని రాయిలాపూర్ గ్రామానికి చెందిన ఎండీ ఫర్వీన్(19) ముస్లిం కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. ఝాన్సి లింగాపూర్ గ్రామానికి చెందిన నల్ల బాలేష్(21) హిందూ కమ్యూనిటీకి చెందిన యువకుడు. నిరుపేద కుటుంబాలకు చెందిన వీరిరువురు ప్రేమించుకున్నారు. పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. మతాలు వేరైనందున సమాజంలోని కట్టుబాట్లను దాటి పెండ్లి చేసుకొని, ఒక్కటిగా జీవిస్తామనే నమ్మకం వారికి కలగలేదు. దీంతో విడిగా ఉండలేక, కలిసి బతుకుతామనే బరోసాలేక ఇద్దరు ప్రేమికులు అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికులు ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి.
తల్లిదండ్రులకు కడుపుకోత
చేతికందిన కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు హఠా త్తుగా బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులు తుంది. చిన్నప్పనుండి ఎన్నో కష్టనష్టాలకోరుస్తూ, పెంచుకున్న కొడుకు, కూతు రు, వయసుడిగిన సమయంలో తమకు చేదోడుగా ఉంటారనుకుంటే, ఇలా బలవన్మరణాలకు పాల్పడితే వారి తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. చట్టం ప్రకారం మేజర్ అయిన యువతీ యువకులు తమకిష్టమైన వారితో పెండ్లి చేసుకునే సమాజం రావడానికి చట్టం పరంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.
సెల్ : 9948123292
సమాజంలో మార్పు రావాలి
ప్రేమ పెం డ్లిల్లపై సమా జంలో మార్పు రావాలి. ఆధు నిక విజ్ఞానంలో మన భారత దేశం ఎంతో ప్ర గతి సాధిస్తుంటే, పెండ్లిల్ల వ్యవ హారంలో మా త్రం తాత ముత్తాతల నాటి ఆచారాలను పాటిస్తున్నాం. కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా కుల, మతాల వల్ల ప్రేమికులు చావడం బాధకరం. ఈ విషయంలో సమాజంలో మార్పు తేవడానికి ప్రభుత్వాల పరంగా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
- లింగోళ్ల సత్యం,సిపిఎం మండల కార్యదర్శి
ప్రేమపెండ్లిలపై అవగాహన కల్పిస్తాం
ప్రేమ పెండ్లిలపై సమాజంలో అవగాహన కల్పిస్తాం. మేజర్ అయిన యువతీ యువకులు ఇష్టపడితే పెండ్లిచేసుకొనే హక్కు చట్టం కల్పించిందన్నారు. ఆత్మహత్య చేసుకోవడం మంచి పని కాదు. తమ వద్దకు వస్తే తప్పకుండా రక్షణ కల్పిస్తాం. అలాగే వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తాం.అలాగే మైనర్లు ప్రేమ పెండ్లి చేసుకోవడం కూడా చట్టం ప్రకారం చెల్లదు.
- రామాయంపేట ఎస్ఐ మహేందర్
Authorization