- దళిత కుటుంబాల గ్రామ బహిష్కరణ
మల్లేశ్
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయలేదని 40దళిత కుటుంబాలు, 8 ముదిరాజ్ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన సంఘటన కౌడిపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండల పరిధిలోని కంచాన్పల్లి గ్రామంలో దాదాపు 3వేలకు పైగా జనాభా ఉండగా 2000మంది బీసీలు, ఓసీలు 400మంది, ఎస్సీలు 300మంది, ఎస్టీలు 80మంది ఉండగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ నుంచి ముగ్గురు పోటీ చేయగా అందులో సర్పంచ్గా వర్రె రజినిసుధాకర్ గెలుపొందారు. గెలిపించిన తరువాత సర్పంచ్ భర్త సుధాకర్, ఉపసర్పంచ్ చల్ల సత్తయ్య, గ్రామ పెద్దలు చాకలి పోచయ్య, రొడ్డి లచ్చయ్యలు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో దళిత కుటుంబాలు 40, ముదిరాజ్ 8కుటుంబాలు ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వకపోవడంతో వీరికి గ్రామంలో ఎవరు సహకరించవద్దని హుకుం జారీ చేశారు. కనీసం ఆ కుటుంబాలకు గ్రామంలో ఎవరైనా చనిపోతే దళితులే అక్కడకు వెళ్లి వాటి కార్యక్రమాలు చేసే బాధ్యత ఉండగా వారం రోజుల క్రితం కీసర ఆశాగౌడ్ చనిపోవడంతో అక్కడికి దళితులను రానివ్వకుండా అడ్డుకున్నారు. గ్రామంలో కటింగ్షాప్కు వెళితే మీకు కటింగ్, గడ్డాలు చేయవద్దని గ్రామ సర్పంచ్ భర్త, గ్రామ పెద్దలు తెలిపారని మంగలి మల్లేశం షాపు నుంచి తిరిగి పంపించారని గడ్డమీది సామేలు తెలిపారు. ఇప్పటికి గడ్డాలు కటింగ్లు పెంచుకొని ఇలాగే ఉన్నామని దళితులు తెలిపారు. ఆయనతో పాటు బైండ్ల శాకయ్య, బైండ్ల వంశీలను షాపు నుంచి తిరిగి వెళ్లగొట్టారు. 15రోజుల క్రితం జానకంపల్లి లింగమ్మ కొడుకు వివాహానికి గ్రామ దేవతల కోసం బోనాలు తీయడానికి కుమ్మరిదాసు ఇంటికి కుండల కోసం వెళ్లగా పలువురు గ్రామ పెద్ద మనుషులు కుండలు ఇవ్వవద్దని తెలుపడంతో వారు వెనుదిరిగారు. ఈ నెల 16వ తేదిన అదే గ్రామంలో దళిత అమ్మాయి బైండ్ల నర్సింలు కూతురు వివాహం ఉండడంతో వారికి కూడా కుండలు ఇవ్వమని కుమ్మరులు తేల్చిచెప్పేశారు. ఇటీవల కుల రాజకీయాలతో జరిగిన ఎన్నికల్లో ఎన్నికలు ముగిశాక గతంలో అందరు కలసిమెలసి ఉండేదని ఇప్పుడు కేవలం దళితులను పలువురు పెద్దలు ఇలా గ్రామ బహిష్కరణ చేయడం సరికాదని, మూడు నెలల నుంచి గ్రామంలో ఎలాంటి వివాహాలకు పిలువకుండా పలువురు గ్రామ పెద్దలు తమను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముదిరాజ్లలో గంపల బాలయ్య, రొడ్డి యాదయ్య, చెంది భూమయ్య, చెంది రాజయ్య, దుంపల సత్తయ్య, ఇట్టబోయిన చంద్రయ్య, దుంపల సువర్ణ, బెంది రాజయ్య కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు దండిగల్ల కిషన్, నర్సాపూర్ నియోజకవర్గ కార్యదర్శి పద్మారావు, రాష్ట్ర కార్యదర్శి సంజీవ్, మండల అధ్యక్షులు దావీద్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ తబితరాణికి వినతిపత్రం అందజేసినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.తమకు న్యాయం చేయాలంటూ గ్రామ మాజీ ఎంపీటీసీ శాకయ్య, సంగని నర్సింలు, ఎరుకలి శాకయ్య, యాదయ్య, బైండ్ల రాయగిరి, బైండ్ల సిద్దిరాములు, పోచయ్య, లక్ష్మి, కమలమ్మ, అంతారం పెద్దమ్మ, సంగని దుర్గమ్మలు తమకు న్యాయం చేయాలంటూ కోరారు.
సెల్ : 9494980799
కార్యాలకు రానివ్వడం లేదు
గ్రామంలో మూ డు నెలల నుంచి ఎలాంటి శుభకార్యాలకు త మను రానివ్వడం లేదు. ఇప్ప టివరకు గ్రా మంలో కల సిమెలసి ఉండ గా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దళితులం వారికి ఓట్లు వేయలేదని గ్రామ బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
-రాయగిరి, బాధితుడు
కటింగ్, గడ్డం కూడా చేయడం లేదు
తమకు మూడు నెలల నుంచి కటింగ్, గడ్డం కూడా చేయడం లేదు. షాపులలోకి వెళ్తే తమను వెళ్లగొడుతున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే మదన్రెడ్డికి తెలుపగా గ్రామ సర్పంచ్ భర్త వర్రె సుధాకర్ను గ్రామ పెద్దమనుషులతో మాట్లాడి ఎన్నికల తరువాత ఓట్లు వేసినా వేయకున్నా అందరు కలసి ఉండాలని సర్పంచ్ భర్తకు ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపినా వినిపించుకోకుండా మళ్లీ తమను గ్రామ బహిష్కరణ చేయడం బాధకరం.
-సామేల్, బాధితుడు