''అంటరాని వాళ్లమని అనిపించుకొనే మేము భ్రష్టులం. ఈ భ్రష్టులందరూ కులానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభిస్తున్నారు. ఉన్నత కులాలవారికి కులాన్ని మర్చిపోయే సౌలభ్యం ఉంది కానీ మర్చిపోలేరు. నేను నా కులాన్ని గురించి ఒక్క క్షణం మర్చిపోయినా సమాజం నాకు నేను అంటరాని వాడినని గుర్తు చేస్తుంది ఎక్కడైనా''
2016 మెగాసాసే అవార్డు గ్రహీత, సఫాయి కర్మచారి ఆందోళన్ వ్యవస్థాపకుడు, మనుషుల మలమూత్రాలను చేతులతో శుభ్రం చేసే దళిత ప్రజల అమానవీయ ఆచరణ నిర్మూలన కోసం పనిచేస్తున్న బెజవాడ విల్సన్వి ఈ మాటలు. అప్పుడు మేము ఫిలిపీన్స్లోని మనిలాలో ఒక ఇంటర్వ్యూ కోసం కూర్చొని ఉన్నాము.
దళితుల అభివృద్ధి కోసం పని చేస్తున్న వ్యక్తుల నుండి ఇలాంటి ఆలోచనలనే మనం విన్నాము. కానీ ఇంత నగ నత్యాన్ని విల్సన్ నోటి నుండి నేను విన్నప్పుడు నాలో ఏదో అలజడి చెలరేగింది. నేను కూడా నా కులాన్ని గుర్తు తెచ్చుకొంటానా అని ఆలోచించాను. కాసేపు 'నేను నా కులం గురించి ఆలోచించను. ఆ స్పృహ నాలో ఎప్పుడు మొలకెత్తలేదు' అని సమాధానపరచుకొన్నాను. కానీ అది సత్యదూరమని నేను వెంటనే గ్రహించాను.
నిజానికి నా కులం గురించి నేను గర్వపడతా ను. అంతరంగాలలో ఆ అస్తిత్వాన్నే అంటి పెట్టుకొని ఉంటాను. నేను ఆ కుల చరిత్ర వలన ఆధిపత్యం పొందాను. నా పూర్వికులు, వారి జీవితాల గురించిన ప్రతి సంభాషణ వారి కులపు అస్థిత్వంతోనే ముడిపడి ఉంది. అలాగే నా కుల అస్థిత్వం కూడా. ఈ బంధా న్ని నేను సంతోషంగా అనుభవిస్తాను. ఈ అనుభవం నన్ను దృవపరుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. నా విద్య, నామమాత్రపు ఖ్యాతి, మేధావితనం, సాంస్కృతిక శక్తి, సామాజిక ఆధిపత్యం- ఇవన్నీ నాలో లోతుగా చెరగని ముద్ర వేశాయి. ఇప్పుడు నేను ఉన్నట్టుగా అవి నన్ను తయారు చేశాయి. నేను ఈ స్వయం యోగ్యత అనే భాగ్యంతో పుట్టాను. జటిలమైన నాగరిక సామ్రాజ్యంతో బేరసారాలాడటం నాకు సులభమే.
కుల నిర్మూలన జరగాల్సిన ఆవశ్యకత గురించి నాకు మేధో జ్ఞానం ఉన్నప్పటికీ, కులం నేను చేస్తున్న ప్రతి పనిలో ఉంటుంది. నేను జీవిస్తున్న ప్రతి పరిసరాలలో నా అర్హత, నేను ఒక దానికి చెంది ఉండటం అనే స్పృహలు నా కులం నుండే వచ్చాయి. గర్భ గుడిలో పూజారి నన్ను గుర్తు పట్టాడని అర్థం అయినప్పుడే కాదు, లౌకిక స్థలాలు అనుకొనే షాపులు, ఆఫీసులు, పోలీస్స్టేషన్లు, హాస్పిటల్స్లలో కూడా నేను అన్ని అవకాశాలు ఉన్నవాడినని నాకు అర్థం అవుతుంది. నాకు ముందు ప్రాధాన్యత ఇవ్వకపోయినా, అవతలి వ్యక్తికి నేను ఎక్కడి నుండి వచ్చానో తెలిసి ఉండటం చాలు. నేను మిగతా వారికంటే నాగరికుడిగా గుర్తించబడతాను. ఒప్పుకొ న్నా ఒప్పుకోకపోయినా నేను అలా తెలిసి ఉన్నాననే విషయం నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను ఎక్కడికి పోయినా నా సంబంధీకుల వైపుకే చేరుతాను. అందులో నాకు తప్పు ఏమి కనిపించదు. 'ఇతరుల' గురించి నేను అలవాటుగా ఒక ఎరుకతో ఉంటాను. అందుకే వారితో కలయికలు యాంత్రికంగా ఉంటాయి. కులానికి పునాది ఆర్థికం కాదు. ఆ పునాది సాంస్కృతికపరమైన, మతపరమైన వివక్ష చూపించే సాధనం. చాటుగాను బహిరంగంగానూ మనుషులను విభజించేది. దాని కారణంగానే ఆర్థిక వెనుకబాటుతనం ఉంటుంది.
కులంలో దాగి ఉన్న ఇంకో విషయం 'దానం' చేయటం. దానం చేయటం అనేది దయకు ప్రతిరూపం కాదు. అది జాలికి హింసాత్మకమైన వ్యక్తీకరణ. అది చాలా మందికి స్వల్పకాలిక ఆర్థిక లాభాలు చేకూ ర్చవచ్చు. కానీ దాని అసలు ఉద్దేశ్యం అసమానతల పిరమిడ్ మధ్య ఉన్న తేడాలను కనపడనీయకుండా చేయటం. 'నేను పెద్ద కులం వాడినే. కానీ నాకు కులతత్వం లేదు. నేను అందరికీ సహాయం చేస్తాను' ఇలా సాగుతుంది ఆలోచన. ఇచ్చేవాడి చెయ్యి బలమైనదనీ, తీసుకొనే వాడు ఎప్పటికీ దానానికి అంటిపెట్టుకొని ఉండాలనే విషయాన్ని ఈ దానం చేయటం అనే విషయం బలీయం చేస్తుంది.
ఎప్పుడైనా ఉన్నత కులాల వ్యక్తులు ఈ పద్ధతిలో ఆలోచిస్తే దాన్ని వెంటనే వారి స్పృహ చెళ్లుమని తిరస్కరిస్తుంది. 'మా పూర్వికుల తప్పులకు మమ్మల్ని నిందించ కూడదు' అనుకొంటారు. కానీ ఇది గతం విషయం కాదు. ఇది స్వయం ఎరుక, ఆత్మ పరిశీలన కోసం ఇచ్చే పిలుపు. మనం ఉన్నత కులస్తులం, అనుకోకుండా ఈ పుట్టుక వలన వచ్చే సౌలభ్యాలను తిరస్కరిస్తామా? ఇప్పుడు మనకు సంప్రాప్తించిన అన్ని అవకాశాలు బలవంతపు అసమానతల బహు మానాలని ఒక్క క్షణమైనా గుర్తు పెట్టుకొంటామా? నేను ఇక్కడ ఆస్తుల విషయం మాట్లాడటం లేదు. గౌరవం, తేడా, పరువు, సౌలభ్యం లాంటి అదృశ్య విషయాల గురించి. ఇవన్నీ కొంత పరిమాణంగా మారినంత మాత్రాన గమనించకుండా దాటి పోవు. ఇదే పెద్ద అసౌకర్యం. ఈ సామాజిక సూచికలు నేను ఎవరో చెబుతాయి. నేను ధనవంతుడిని కాకపోయి నా నాకు బలాన్ని ఇస్తాయి. పెద్ద కులంలో ఉండే పేదవాడు దౌర్భాగ్యుడు. అతనికి అదృష్టం కలిసి రాలే దు. చిన్న కులంలో ఉండే పేదవాడు కూడా దౌర్భా గ్యుడే. కానీ అతను దౌర్భాగ్యుడిగా ఉండ తగినవా డు.. అలాగే సమాజం ఈ విషయాన్ని వివరిస్తుంది.
కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడేవారికి 'పెద్ద కులాలలో ఉండే వెనుకబడినవారి గురించి మర్చిపోవద్దు' అని చెబుతారు. కులాతీతంగా, వర్గాతీతంగా, జండర్ అతీతంగా మద్దతునిచ్చే హక్కు అందరికీ ఉందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు కానీ కులానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ఎదుర్కోవటానికి ఈ వాదనను వాడుకో వాల్సిందేనా? అలాంటి వాదనలు చేసేటపుడు ఆధి పత్య కులాలవాళ్లు, కులం 'ఉనికిలో ఉన్న సత్య మనే' విషయాన్ని ఒప్పుకోవటంలో వారి అశక్తతను వెలిబు చ్చుతారు. వెంటనే ఆ తగాదా నుండి అనుగ్ర హం ప్రవేశిస్తుంది. 'వారి కోసం కావాల్సినదంతా చేశాము' అని మనకు చెబుతారు. ఈ పద్ధతిలోనే హిందువులు ముస్లిం మైనారిటీల సందర్భంలో మాట్లాడటం ఆసక్తికరమైన విషయం.
ఎక్కడో మనసు లోపల లోతుగా ఉండే 'ఈ దేశం హిందూ దేశమనే' ఆలోచనా పద్ధతి, 'ఇది సాం స్కృతికంగా పెద్ద కులపు హిందూ దేశమని' కూ డా అనుకొంటుంది. నిజానికి అలా పూజిస్తుంది కూ డా. 'భారత్' ఇంకా చెప్పాలంటే 'మహా భారత్' టీవీ సీరియల్లో సంస్కృతంలో గంట కొట్టినట్లు మోగిన గొంతుని తప్పించుకోగలమా? అందుకే పౌరాణికాల నూ, మత గ్రంథాలనూ రెండవ తరగతి సమూహాలు బ్రాహ్మణేతరంగా చేసిన వ్యాఖ్యానాలను తుచ్ఛమైనవ నీ, నీచమైనవనీ, భ్రష్టమైనవనీ అంటారు.
కానీ ఇది బ్రాహ్మణ, బ్రాహ్మణేతర చర్చ కాదు. ఈ సమస్యకు ఒక కారణం ద్వంద్వవాదానికి విషయాన్ని ఈ రకంగా కుదించటం. ఈ కుదింపు పద్దతి కులం బయటకు జారిపోయే అవకాశం ఇస్తుంది. పెద్ద కులాల వారికి మిగతా వారంతా ఒక టే సమూహం. వారి ఉద్దేశ్యంలో అన్ని కుల సమస్యలు ఆ బ్రాహ్మణేతర కులాల్లోనే ఉంటాయి. అవి ఉన్నత కులాలకు అతీతంగా ఉంటాయి. ఎప్పుడైతే నేను అవతలి సమూహంలో ఎవరినైనా ఆమోదించానో, నేను కులం నుండి బయటకు వచ్చి కులరహితమై పోయినట్లే లెక్క.
మనమెప్పుడూ కొన్ని ఆకాంక్షలతో ఉన్న వారి పోరాటాలను అర్థం చేసుకోలేము. ఆ పోరాటాలు స్వీకరణ కోరుకొంటున్న వ్యక్తులలో మార్పులు తీసుకొని వస్తాయి. బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులను సాంస్కృతిక నమూనాగా చూస్తారు. ఈ బ్రాహ్మణేత రులు నిచ్చెన ఎక్కే కొద్దీ వారు తెలిసో, తెలియకొ తమ హౌదా కోసం వారిని వారు వదిలేసుకొం టారు. ఇది వారి గతాన్ని తుడిచివేయటమే కాకుండా, వారి జీవితంలో ఉన్న వ్యక్తులను కూడా తుడిచివేస్తుంది. ఈ సాంస్కృతిక ఆకాంక్ష, సమాజం ప్రజలపై రుద్దుతున్న ఒక భావోద్వేగ నేరం.
నిచ్చన మెట్ల సమాజంలో అట్టడుగున ఉన్న వారిని ఆవహించి ఉన్న భావోద్వేగ స్థితి ఇప్పటి గొప్ప విషాదం. వారి మీద మనం అన్ని రకాల అతి నీచమైన నేరాలను మోపుతాము. పై స్థాయి నుండి మొత్తంగా పోగైన వివక్ష అంతా వారిపైన పడుతుం ది. వారిని అధోపా తాళానికి తొక్కివేస్తుంది. ప్రతి కులపు సమూహం తమ మీద పైస్థాయి కులపువారు జరుపుతున్న అణచివేత దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. కానీ వారు వారికంటే కింద ఉన్నవారి గాయాలను గెలుకుతారు. ఈ పద్ధతి కింద కు వెళ్లేకొద్దీ ఒకదానికొకటి కలుస్తూ పోతుంది. ఎక్క డైతే జీవితం భావపరంగా, మానసికంగా, ఆర్ధికంగా బతకలేనట్లు ఉంటుందో అంత కింద వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. భారత సమాజంలో ఆ కిందనున్న స్థలమే దళితులది, ఆదివాసులదీ.
ఈ నిచ్చన మెట్ల సాంస్కృతిక నమూనా పై కులాల వారికి మంచి స్థానం ఇస్తుంది. మనం ఆదర్శవాదులుగా మిగిలిపోతాము. ఈ ఆదర్శవాదం కాలాన్ని బట్టి దుస్తులు మార్చుకొంటుంది. కానీ సా రం అదే. కాబట్టి నేనేమనుకొంటున్నానంటే.. ఈ పై స్థానంలో ఉన్నవారందరి మీద ఈ వ్యవస్థను కూల్చే భారం సమానంగా ఉంటుంది. దానికి ధైర్యం, మాన వత్వం, ఆత్మ పరిశోధన కావాలి. బెజవాడ విల్సన్ పాకీపనికి వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో ఉండే నమూనాను పునర్ రచించాడు. కానీ అతడు ఇంకో విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తున్నాడు. మనల్ని ఎప్పటికీ మర్చిపోనివ్వన్ని ఒక కురూపి కులం. దుర దృష్టవశాత్తు ఈ అంద విహీనాన్నే మన చేతులకు ధై ర్యంగా ధరించి, దాన్నే సంస్కృతి అని అంటున్నాము.
- టి.యం.కష్ణ
Authorization