కె.కె.
మహిళలపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహిళలపై జరిగే దాడులలో నిందితులకు సరైన శిక్షలు పడకపోవడం, లైంగికదాడులు జరిగిన చోట పెద్ద మనుషులుగా చెప్పుకునేవారు నయానో, భయానో రాజీ యత్నాలకు ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో ఈ దాడులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో అభంశుభం తెలియని పసిమొగ్గలపై కూడా లైంగికదాడులకు తెగబడే వరకు పరిస్థితి వెళ్లింది. ఇందుకు హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో జరిగిన చిన్నారిపై లైంగికదాడి, హత్య ఉదంతమే ఉదాహరణ.
6 ఏండ్ల చిన్నారిపై ఓ కామోన్మాది లైంగికదాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా విషయం బయటకు పొక్కకూడదని బాలికను గొంతు కోసి చంపేశాడు. ఈ దుర్ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది.
చంద్రయ్య, కష్ణవేణి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చి తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె. 15 రోజుల క్రితం ( హోలీ పండుగ రోజు) మధ్యాహ్నం వేళ ఆరేండ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లేదు. దీంతో వారు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి 12 గంటల సమయంలో పొదల్లో ఉన్న బాలిక మతదే హాన్ని అటు వైపుగా వెళ్తున్న స్థానికులు కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాలిక శవాన్ని పరిశీలించారు. అది చిన్నారి మతదేహ మేనని నిర్ధారించుకుని మతదేహానికి పంచనామా నిర్వహించారు. బాలికపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినట్టు పోస్టుమార్టంలో తేలింది.
తాగిన మత్తులో చిన్నారి బలి
చిన్నారి కన్పించడంలేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం ఏసీపీ నేతత్వంలో మూడు బందాలను ఏర్పాటు చేసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిం చారు. ఘటనా స్థలంలో డాగ్స్క్వాడ్, క్లూస్ టీమ్ల సహకారంతో ఆధారాలు సేకరించారు. అనంతరం చిన్నారి మత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి దగ్గర్లో ఏయే ఫంక్షన్లు జరిగాయి? కొత్త వ్యక్తులెవరైనా వచ్చారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసి ఈ కేసును 12 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు బిహార్కు చెందిన రాజేశ్ కుమార్ను అరెస్టు చేశారు. చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్థారించారు. చిన్నారి కేకలు వేయడంతో ఇనుప తీగతో గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్టు బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు.
రంగులు కొనిస్తానని నమ్మించి....
ఆ రోజు హోలీ పండుగ. చిన్నాపెద్ద అంతా హోలీ సంబరాల్లో మునిగిపోయారు. చిన్నారి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బిహార్కు చెందిన ధర్మేంద్ర వద్దకు కొందరు యువకులు వచ్చి హోలీ ఆడారు. ఆ పక్కనే ఇంటిముందు ఆ బాలిక తన ఏడేండ్ల అన్నయ్యతో కలిసి హోలీ వేడుకలో మునిగిపోయింది. వీరిని గమనిస్తున్న బిహార్కు చెందిన రాజేష్కుమార్ కన్ను ఆ అమ్మాయిపై పడింది. స్నేహితులకు చెప్పకుండానే రాజేష్ అక్కడి నుంచి ఈ చిన్నారుల వద్దకు వచ్చాడు. మద్యం తాగుతూ హోలీ ఆడుతున్న రాజేష్ వెళ్లిపోవడాన్ని గమనించలేదు. అయితే చిన్నారులు హోలీ ఆడుకోవడానికి రంగులు కొనిస్తాననని రాజేష్ వారిని మచ్చిక చేసుకున్నాడు. షాపు వద్దకు తీసుకెళ్లి రంగులు కొనిచ్చాడు. వాటిని తీసుకొని ఆ బాలిక అన్నయ్య వెళ్లిపోయాడు. మరిన్ని రంగులు కొనిస్తానని ఆ బాలికను పక్కనున్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో పక్కనున్న ఇనుప చువ్వతో గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత మరోసారి లైంగికదాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు. బిహార్ బ్యాచ్పై అనుమానం బలపడటంతో పోలీసులు ఆ దిశగా విచారణను వేగవంతం చేశారు. తమకు చెప్పకుండానే రాజేష్ మధ్యలోనే వెళ్లిపోయాడని స్నేహితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా గత శుక్రవారం ఉదయం 6గంటలకు కష్ణానగర్లోని అతడి గదికి వెళ్లి అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. చిన్నారులను ఎక్కడపడితే అక్కడ వదిలేయొద్దని, వారిని కనిపెట్టుకొని ఉండాలని తల్లిదండ్రులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సెల్ : 8639518341
Authorization