గుమ్మడిరాజు నరేష్
రాష్ట్రంలో నేడు ఆడపిల్ల బయటకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చేంత వరకు గ్యారంటీ లేకుండా పోయింది. ప్రేమించమని ఒకడు, ప్రేమించకపోతే మరొకడు యాసిడ్, కత్తులతో దాడిచేసి చంపడం వంటి ఘటనలనేకం చోటు చేసుకుంటున్నాయి. ఆధునికత పేరుతో మన సినిమాలు, టీవీలు, సోషల్ మీడియా విశృంఖలత్వాన్ని ప్రేరేపిస్తుంటే మనుషుల్లో క్రూరత్వం వేళ్లూనుకుంటోంది. ఆడ పిల్ల ఆట వస్తువవుతోంది.
తెలంగాణలో బాలికలు, మహిళలపై లైంగికదాడులు, హత్యలు, దాడులు, వేధింపులు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. అభం శుభం తెలియని పసికందులను సైతం చిదిమేస్తు న్నారు. లోకం తెలియని చిన్నారిని ఎత్తుకెళ్లి పశువులా పైశాచికత్వాన్ని ప్రదర్శించాడో దుర్మార్ఘుడు. అంతటి తో ఆగకుండా చేసిన ఘోరం బయట పడుతుందని పాపను హతమార్చాడు. మేడ్చల్ జిల్లా అల్వాల్లోని తుర్కపల్లిలో జరిగిన ఈ ఘటన సంచనలం చేసింది. బతుకుదెరువు కోసం మెదక్ జిల్లా నుండి వలసొచ్చిన బాధిత కుటుంబం తుర్కపల్లిలో నివాసముంటున్నది. దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. హోళి పండుగకావడంతో పిల్లలు ఆరుబయట ఆడుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో కుమార్తె (6)ను బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్ అనే యువకుడు మాయమాటలు చెప్పి పక్క నున్న షాపుకు తీసుకెళ్లాడు. కొని తినుబండారాలు కొనిచ్చాడు. అనంతరం చిన్నారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడిచేసి చంపేశాడు.
ఇటీవల పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి 50 ఏండ్లకుపైబడిన ఓ ఇన్విజిలేటర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. సూర్యాపేటలోని ఓ పాఠశాలలో టెన్త్ చదువుతున్న బాలిక అరవై అడుగుల రోడ్డులోని ప్రైవేటు పాఠశాలలో పరీక్ష రాసింది. సూర్యాపేట మండలంలోని ఓ తండాలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇన్విజిలేటర్గా విధుల్లో ఉన్నాడు. బాలిక పరీక్షలో చూసి రా సేందుకు సహ కారించి అన ంత రం మాయమాటలు చెప్పి పరీక్ష అయ్యాక కేంద్రం బయట వేచి ఉండాలని అమెకు సూచించాడు. తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తప్పిం చుకొని అక్కడి నుంచి ఇంటికి చేరుకొని విషయం తన పెద్దమ్మకు వివరించింది. ఈ విద్యార్థినికి తల్లిదండ్రులు లేకపోవడంతో పెద్దమ్మ ఇంటివద్ద ఉంటూ చదువుకుంటోంది. పెద్దమ్మ వెంటనే 100 నంబరుకు ఫోనుచేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఉపాధ్యయుడి తరుపున రంగంలోకి దిగిన పెద్ద మనుషులు చిన్నారి బంధువులకు నచ్చచె ప్పారు. పెద్ద మనుషులు బాధితులకు కొంత నగదు ముట్టజెప్పి విషయం బయటకు పొక్కకుండా దాచే ప్రయత్నం చేశారు.
ఈ సంఘటన మరువకముందే జనగామ జిల్లాలో మరో ఘటన... రఘునాధపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో జరిగింది. నర్మెట్ట మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని బుధవారం నిడిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష రాసిన అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు రఘునాధపల్లి బస్టాండ్ వద్దకు వచ్చింది. స్థానికుడైన ఇబ్రహీం (35) ఆమెను పరిచయం చేసుకొని తాను ద్విచక్రవాహనంపై ఆ గ్రామానికి వెళ్తున్నానని చెప్పాడు. అనుమానించిన విద్యార్థిని వెంటనే తన తండ్రితో ఫోన్లో మాట్లాడించింది. ఆయన యువకుడి మాటలు నమ్మి బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చేందుకు సమ్మతించాడు. ఇబ్రహీం మార్గమధ్యలో ఎర్రగడ్డ తండా వద్దకు వచ్చిన తర్వాత విద్యార్థినిని రహదారి పక్కన పొదల్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి యత్నించాడు. విద్యార్థిని కేకలు వేస్తూ రహదారిపైకి వచ్చి వాహన చోదకులకు విషయం చెప్పింది. ఇబ్రహీం అక్కడి నుంచి పరారుకాగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా చెప్పుకుంటూపోతే ఘడియకో ఘటన మనలను వెక్కిరిస్తూనే ఉంది. మహిళల రక్షణకు టీ షీమ్స్ ఏర్పాటుచేసి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చింది ప్రభుత్వం. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. కాని నేటికీ బాలికలపై, మహిళలపై బీభత్సంగా లైంగికదాడులు, వేధింపులు, హత్యలు జరుగుతూనే వున్నాయి. శుశ్రుత, మధురిమ లాంటి అమ్మాయిలపై అత్యంత దారుణంగా దాడిచేసి చంపారు. సభ్యసమాజం తలదించుకొనేలా అరాచక వాదుల ఆగడాలకు ఎదురులేకుండా పోతోంది.
ఆడపిల్లలను స్కూలు, కాలేజీలకు పంపించాలంటే కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి దాపు రించింది. ఈ విషయాలపట్ల రాష్ట్రంలో చర్చలే దు. మహిళల భద్రత ఏ పార్టీ ఎన్నికల ఎజెండా లోనూ లేదు. నూటికి 50 శాతంగా ఉన్న మహిళల ఓట్లు మాత్రం వారికి అవసరమే కానీ వారి భద్రత అక్క రలేనిదయ్యింది. ఇంకా ఎంత కాలం ఈ వివక్ష?. పై ఘటనలేవీ మన ప్రభుత్వానికి పట్టవా? రాజకీయ పా ర్టీలు స్పందించడానికి అర్హమైనవి కావా. మన ప్రభుత్వ యంత్రాంగం శిశుసంక్షేమం నిద్రపోతున్నాయా?.
రాష్ట్రంలో నేడు ఆడపిల్ల బయటకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చేంత వరకు గ్యారంటీ లేకుండా పోయింది. ప్రేమించమని ఒకడు, ప్రేమించకపోతే మరొకడు యాసిడ్, కత్తులతో దాడిచేసి చంపడం వంటి ఘటనలనేకం చోటు చేసుకుంటున్నాయి. ఆధునికత పేరుతో మన సినిమాలు, టీవీలు, సోషల్ మీడియా విశృంఖలత్వాన్ని ప్రేరేపిస్తుంటే మనుషుల్లో క్రూరత్వం వేళ్లూనుకుంటోంది. ఆడ పిల్ల ఆట వస్తువవుతోంది. మూడేండ్ల పసికూనలు సైతం ఈ మృగాళ్ల బారినపడి మొగ్గలుగానే నేలరాలుతున్నారు. అందుకే ప్రత్యేకించి చిన్న పిల్లలపై హింసను ఆపడం కోసం 2012లో ఫోక్స్ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఫోక్స్ చట్టంలో కఠిన నిబంధనలున్నాయి. 2013లో నిర్భయ చట్టం పేరుతో కొన్ని కఠిన శిక్షలు చేర్చారు. కతువా సంఘటన తర్వాత 12 ఏండ్ల వయస్సులోపు పిల్లలపై అఘాయిత్యం చేస్తే ఉరిశిక్ష విధించే విధంగా చట్టం తెచ్చారు. 1989లో చిన్న పిల్లల హక్కులను యునెస్కో ఆమోదించగా దానిని భారత ప్రభుత్వం ధృవీకరించింది. 1990లో చిన్న పిల్లల రక్షణ, వారి అభివృద్ధికోసం ఐక్య రాజ్య సమితి చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం ఆమోదించింది. 1992 బాలల హక్కుల గురించి, 2002లో బాలల స్వేచ్ఛ గురించి, 2012లో నిర్భయ ఘటనలను నియంత్రించేందుకు జస్టిస్ వర్మ సిఫార్సులూ ఉన్నాయి. అయినా ఈ అఘాయిత్యాలు ఆగడం లేదు సరికదా... పైగా లైంగికదాడికి గురైన బాలికలు, స్త్రీలు ఇరుగు, పొరుగు సూటిపోటి మాటలు, సమాజం చిన్నచూపుతో జీవితాంతం నరకం అనుభవిస్తున్నారు. లోపం ఎక్కడ ఉన్నట్టు? ప్రభుత్వాలు, పౌర సమాజం ఆలోచించాలి.
సెల్ : 9491039520
Authorization