- చెత్త డంప్యార్డులో అంబేద్కర్ విగ్రహం
ఓగోటి కిరణ్కుమార్
భారత రాజ్యాంగ నిర్మాత జయంతి ఏప్రిల్ 14. ఆ రోజు భారతదేశ మంతా ఆ మహానుభావుడి జయంతిని ఘనం గా జరుపుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందిం చిన ఆ మహానుభావుడి మేధాశక్తిని, దేశ ఐక్యత కోసం ఆయన చేసిన సేవలను నెమరువేసుకుం టారు. అణగారిన వర్గాలకు ఏప్రిల్ 14 ఓ పండుగ రోజు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆ మహామనిషి జయంతికి ఒక్కరోజు ముందు ఏప్రిల్ 13న ఆయన విగ్రహానికి తీవ్ర అవమానం జరిగింది. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు పూనుకున్న దళిత సంఘాలకు ప్రభుత్వ అధికారులు అనుమతి ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శించి వివక్ష చూపారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ఎలా ప్రతిష్టిస్తారని వారి కిందిస్థాయి సిబ్బంది ఏకంగా ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేసి భారత రాజ్యాంగ నిర్మా తకు, దేశ అణగారిన వర్గాలకు అవమానం కలిగించడంతోపాటు, ఈ దేశంలో, ఈ పాలకుల ఏలుబడిలో నిమ్నవర్గాల స్థానం ఏంటో స్పష్టం చేశారు. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిందనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ట్ర రాజధాని, అత్యంత రద్దీ కూడలి అయిన పంజాగుట్టలో చోటు చేసుకుంది. ఘటనా ప్రాంతానికి కూతవేటు దూరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ ఉంటుంది.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో అంబే ద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో వివాదం ఏర్పడింది. ఈనెల 14న అంబేద్కర్ జయంతి నిర్వహించేం దుకు అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లో పంజాగుట్ట సర్కిల్లో శుక్రవారం అర్ధరాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ శనివారం ఉదయం తొలగించేం దుకు యత్నించారు. అక్కడే ఉన్న దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాదోపవాదాలు జరిగాయి. ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవ డంతో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ మోహన్, పశ్చిమండల టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, డీడీ విభాగం ఏసీపీ శ్రీదేవి, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. ధర్నా చేస్తున్న దళిత సంఘాల నాయకులను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విగ్రహాన్ని తొలగించారు.
చెత్తడంపింగ్ యార్డుకు ఎలా వెళ్లింది?
అంబేద్కర్ విగ్రహాన్ని చెత్త తరలించే వాహనం లో తీసుకెళ్లి జవహర్నగర్లోని రాంకీ డంప్ యార్డులో పడేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్ర హానికి కనీస గౌరవం ఇవ్వకుండా ధ్వంసం చేయడ మే కాకుండా చెత్తవేసే ప్రదేశంలో పడేయడం ఎంత వరకు సమంజసమని దళిత సంఘాల నాయకులు ప్రశ్నించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు మేడ రవి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారులపై స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట ప్రధాన కూడలిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ మార్చి 4వ తేదీన జీహెచ్ఎంసీ అధికారులకు వినతిప్రతం అందజేశారు. వారి నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశామని దళితసంఘాల నాయకులు తెలిపారు.
అంబేద్కర్ విగ్రహ అంశంపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విచారణకు ఆదేశించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ మాట్లా డుతూ.. అనుమతి లేకపోవడంతో విగ్రహాన్ని పోలీ సులు, జీహెచ్ఎసీ సిబ్బంది తొలగించారని చెప్పారు. విగ్రహాన్ని యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియానికి తరలించామన్నారు. అక్కడి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలియకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా కిందపడి విగ్రహం ధ్వంసమైందని చెప్పారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని నగర పోలీస్ కమిషనర్ను కోరారు. ఐఏఎస్ అధికారితో ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. యూసుఫ్గూడ నుంచి విగ్రహం బయటికి వచ్చిన ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం యూసుఫ్గూడ యార్డు ఆపరేటర్గా పని చేసే ఓ చిరుద్యోగిని విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. ఘటనా ప్రాంతానికి కూతవేటు దూరంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటున్నా ఈ ఘటనపై ఇంతవరకు నోరు మెదపకపోవడం అణగారిన కులాల పట్ల ఈ పాలకులకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.
సెల్ : 9666011107
Authorization