డాక్టర్ కాలి చిట్టిబాబు
డబ్భై సంవత్సరాల స్వతంత్య్ర భారతంలో ఇంకా అంటరానితనమా? తరతరాల నుండి దళితులను అంటరానివారిగా, హీనంగా పరిగణించటం ద్వారా, వరసగా దళితులపై జరుగుతున్న లైంగికదాడుల ద్వారా కుల కంపు పెచ్చరిల్లుతూనే ఉంది. అంటరానితనానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో పరిరక్షణ హక్కులు పొందుపర్చినప్పటికీ, అంబేద్కర్ 128వ జయంతికి ఒక్క రోజు ముందు పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహాన్ని అమానుషంగా పగలగొట్టి, అగౌరవంగా తొలగించి చెత్తను తరలించే బండిలో వేయడం ద్వారా మరో మారు బాబాసాహెబ్ అంబేద్కర్ను అంటరానివాడిని చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కింది. దేశ నాయకులను అవమానించకూడదని రాజ్యాంగం చెప్తున్నా, తాజాగా పదవుల్లో ఉన్నవాళ్లే భారతరత్న బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఇలా చెత్తలో పడేసి అవమానిస్తే ఎలా?. అగ్రకుల పాలకులు, అధికార యంత్రాంగం ఇంత బాధ్యతారహితంగా విధులు నిర్వహిస్తారా?. తెలంగాణ ముఖ్య మంత్రి చంద్రశేఖర్రావుకు గల చిన్న చూపు దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. ఇలా దళితులను, దళిత నాయకులను, దళిత ఉద్యమకారులను కించపరచటం తెలుగు రాష్ట్రాల్లో అగ్రకుల పాలకులకు కొత్తేమీకాదు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని చెప్పటానికి చిన్న ఉదాహరణ ఏమిటంటే.. 2003లో విదేశీ కంపెనీల పెట్టుబడుల వ్యామోహంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. అది దోమలగూడ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా సచివాలయం వరకు నిర్మించాలనీ, మొత్తం నిర్మాణం నాలుగు నెలలో పూర్తి చేయాలనీ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) సూపరింటెండింగ్ ఇంజనీర్ వివేక్ దేశ్ముఖ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ భవనం ముందు ఉన్న మొత్తం జంక్షన్ ప్రదేశాన్ని, అంబేద్కర్ విగ్రహం మీదుగా సిమెంటు స్తంభాల నిర్మాణం జరుగుతున్న సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్కు ఎదురుగా అభివృద్ధి చేయబడుతున్న బుద్ధుని పార్కుకి మార్చటానికి ప్రయత్నం చేసారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ భవనం ముందు ఉన్న మొత్తం జంక్షన్ ప్రదేశాన్ని అంబేద్కర్ జంక్షన్గానూ, ప్రతి ఏటా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా దళితులందరు ఒక పండుగల జరుపుకునే వారు. కానీ అక్కడి అంబేద్కర్ విగ్రహాన్ని బదిలీ చేయడాన్ని అనేక దళిత సంఘాలు వ్యతిరేకించాయి. అదే సమయంలో కొంత కాలం తాత్కాలికంగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని నిలిపి వేశారు. దళిత సంఘాలు ఆనాడు ప్లాను మార్చి అంబేద్కర్ విగ్రహం మీద నుండి కాకుండా కొంచెం దూరంగా ఫ్లైఓవర్ నిర్మిం చాల్సిందిగా ప్రాధేయపడినా వాటిని ఏ మాత్రం పరిగణలోనికి తీసుకోకుండా వారిని ఉక్కుపాదంతో అణచివేసి దళితులను అక్రమంగా అరెస్ట్ చేసి, దళితుల ఆత్మ గౌరవాన్ని, మనోభావాలను ఏ మాత్రం పరిగణలోనికి తీసుకోకుండా ఆ నిర్మాణాన్ని పూర్తి చేసారు. దానికి నిరసనగా దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి నల్ల రంగు వేశారు. ఇప్పటికి ఆ విగ్రహం నలుపు రంగులోనే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం అకస్మాత్తుగా ఈ ముఖ్యమంత్రికి అంబేద్కర్ మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకంటే దళితుల ఓట్లు కావాలి కదా. 2017లో బాబ్ సాహెబ్ అంబేద్కర్ 125 సంవత్సరాల జయంతి వేడుకల సందర్భంగా వరసగా పత్రిక సమావేశాలు పెట్టి గుంటూరు జిల్లాలోని కష్ణానది ఒడ్డున అమరావతిలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్కు 125 అడుగుల పొడవైన విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించబోతోందని, అసెంబ్లీలో సైతం పద్దెనిమిది నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని ప్రకటన చేశారు. ఈ విగ్రహం కోసం 20 ఎకరాల భూమిలో 'అంబేద్కర్ స్మతివనం, స్మారక ధ్యాన కేంద్రం, లైబ్రరీ, ఓపెన్-ఎయిర్ థియేటర్ నిర్మాణం కోసం దాదాపు రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ''ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధులకు పర్యాటక ఆకర్షణగా అమరావతిని అభివద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం'' అని ఆర్భాటంగా 'భూమి పూజ' కూడా చేసారు. అనుమానం ఏమిటంటే అసలు ఈ నిర్మాణం పూర్తిచేస్తారా అని. ఎందుకంటే ఇదే ప్రకటన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కూడా చేసారు. అదే సమయంలో ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి చైనా నిర్మాణాల పరిజ్ఞానాని ఉపయోగిస్తున్నామని పలు పత్రిక ప్రకటనల్లో కేసీఆర్ చెప్పారు. ఈసారి తెలుగు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలో ఈ విగ్రహాల నిర్మాణానికి తాము ఇచ్చిన వాగ్ధానాన్ని ఒక్క ముఖ్యమంత్రి కూడా కనీసం ప్రస్తావించలేదు. ప్రస్తుత హైదరాబాద్లోని దోమలగూడలో ఉన్న అంబేద్కర్ భవనం శిథిలావస్థలో ఉంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ దానివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దళితులను దారుణంగా దగా చేయటంలో ఈ ఇద్దరు 'చంద్రులు' దిట్టలు అనడానికి ఇది ఒక ఉదాహరణ. తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన వాగ్దానాలలో ''దళితుడే తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి'' అని, ''దళితులకు మూడు ఎకరాల భూమి పంచుతాం'' అని చేసిన బాసలన్నీ మోసాలేనని తేలిపోయింది. ఇది ముమ్మాటికీ దళితులను దగా చేయటమే. వీరికి దళితుల ఓట్లు కావాలి కానీ వారి సంక్షేమం, ఆత్మగౌరవం మాత్రం పట్టదు. దళితులకు సంబందించిన రాజ్యాంగ హక్కుల గూర్చి ఏవిధమైన అవగాహన లేని కనీసం నాగరికత విలువలు తెలియని, సమాజం పట్ల కనీసం అవగాహనా లేని శాసనసభ్యులుగా రాజ్యాంగ బాధ్యతలు చేపట్టిన వీరు, వీరి వందిమాగదులంఆ వీళ్లకు భారత రాజ్యాంగం ద్వారానే పాలకులయ్యారనే సత్యం గుర్తించాలి. దేశంలో ఫెడరల్ వ్యవస్థ చిన్నాభిన్నమైనది అని ఒకరు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని మరొకరు దేశా వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఓ సూటి ప్రశ్న. రాజ్యాంగం పట్ల గాని, దళితుల పట్ల గాని ఏవిధమైన గౌరవం లేని మీ పక్షపాత ధోరణి చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రమాదకరం. అంత పెద్ద మహానగరమైన హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహమే అడ్డమొచ్చిందా?. అదే పంజాగుట్టకు ఎటూ పదిహేను కిలోమీటర్ల మేర వందల ఎకరాలు సినిమా స్టూడియోలకు, మల్టీఫ్లెక్స్ ధియేటర్స్కు, పార్టీ నాయకులకు స్మతి వనాలకు, షాపింగ్ కాంప్లెక్స్లకు, ఎన్నో అక్రమ కట్టడాలకు ఎకరాల కొద్ది భూమి కేటాయించిన వీరు అంబేద్కర్ విగ్రహానికి కొంచెం జాగా ఇవ్వలేకపోతు న్నారే... ఇది దళితుల పట్ల వీరి చిన్న చూపుకు, దురహంకారానికి నిదర్శనం కాదా?
Authorization