భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోలాలెన్నో,
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో!
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో,
కుల మతాల సుడిగుండాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో!!
అన్న దాశరధి గేయంలోని వాక్యాలు భూమి ఆవిర్భావం, తదనంతర పరిణామాల గురించి తెలియజేస్తున్నాయి. దేశం స్వేచ్చా, స్వాతంత్య్రాలు సాధించి ఇప్పటికి 7 దశాబ్దాలు దాటినా, ఆ ఫలాలు ప్రజలకు నేటికీ చేరలేదు. దానికి ప్రధాన కారణాలు కులాలు, మతాల మధ్య గొడవలు, అజ్ఞానం తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా చెప్పవచ్చు. వీటికి సమాధానాలుగా ఇప్పటికే మానవాళి ఆవిర్భావం గురించి ఎన్నో శాస్త్రీయ సిద్ధాంతాలు వెలువడ్డాయి. వాటిలో ఒకటి పరిణామవాద సిద్ధాంతం. కానీ తరచూ కొందరు తమ ప్రయోజనాల కోసం పరిణామవాద సిద్ధాంతం తప్పని చెబుతుంటారు. నిజంగా అది తప్పో, ఒప్పో తెలియాలంటే ముందు ఆ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి.
వాస్తవానికి పరిణామం అనేది, అందునా నరావతారం అనేది చాలా సుదీర్ఘమైన చరిత్ర. వరుసగా కొన్ని శతాబ్దాలు నిశితంగా పరిశీలిస్తే జీవుల్లో మానసిక మార్పులను స్వల్పంగా తెలుసుకోవచ్చు. కానీ సంపూర్ణంగా తెలుసుకోలేము. పూర్తిగా తెలియాలంటే కొన్ని వేల, లక్షల సంవత్సరాలు గమనించాలి. మానవ జీవితానికి గల పరిమితి అంత సుధీర్ఘ కాలం జీవించలేకపోవడం. మహా అంటే మనిషి 100 సంవత్సరాలు జీవించగలడు. పరిణామం గురించి సూత్రబద్ధమైన దశలను అర్థం చేసుకోవాలంటే ఈ కాలం సరిపోవచ్చు, కానీ ప్రత్యక్షంగా చూడాలంటే మాత్రం అది చాలా పరిమితమైన సమయం.
మతవాదులు, దైవం పని గట్టుకుని గ్రహవ్యవస్థను, అందులో భూమిని, భూమిపైన ఎలాంటి అస్పష్టత లేకుండా మానవున్ని తయరుచేశాడని బలంగా విశ్వసిస్తారు. అంటే పుట్టిన వెంటనే మనిషి సంపూర్ణ రూపంతో జీవించడం మొదలుపెట్టినట్టు అర్థం. ఇది ఎంత మాత్రం నిజం కాదనేది శాస్త్రవేత్తల భావన. ప్రతి జీవి కూడా పరిణామం చెందాల్సిందే. అది అనివార్యం. అంతెందుకు పుట్టిన శిశువు కొంతకాలం వెల్లకిల పడుకోవడం, తర్వాత ప్రయత్నం ద్వారా బోర్లా పడటం, ఒక చేతి సహాయంతో చేపలా ముందుకు ఈదడం, తర్వాత చేతులు కాళ్లు ఉపయోగించి జంతువులా దేకడం, తర్వాత రెండుకాళ్లతో నిలబడటం, పెరిగే కొద్దీ స్పష్టంగా ఆలోచించడం, వద్ధాప్యంలో కర్ర సహాయంతో అతి కష్టంతో నడవడం అన్నీ పరిణామంలో భాగంగానే చెప్పుకోవాలి. శాస్త్రజ్ఞులకు వివిధ తవ్వకాల్లో వివిధ జీవుల పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరాలు లాంటి ఆధారాలు లభిస్తున్నాయి. వీటిని సుదీర్ఘకాలం పరిశోధన చేసి తేల్చిన విషయం ఏమంటే నేటి మానవ రూపానికి అతిదగ్గర పోలికలు ఉన్న జీవులు కూడా భూమిమీద లక్షల సంవత్సరాలు జీవించాయి. లక్షణాల ఆధారంగా శాస్త్రజ్ఞులు వాటికి ఇచ్చిన పేర్లు మానవుని నుంచి వెనుకకు వరుసగా క్రోమాన్యాన్ మానవులు, నియండర్తల్ మానవులు, హోమో ఎరెక్టస్, అస్త్రలోపితికాస్, చిపాంజి, గొరిల్లా, ఒరాంగుటాన్, గిబ్బన్ మొదలైనవి. ఇవన్నీ ఏప్ జాతికి చెందినవి. ఏప్ అంటే తోకలేని కోతి అని అర్థం. పరిణామ సిద్ధాంతంలో అతిముఖ్యమైన విషయం ప్రాథమిక జీవులు పరిణామం చెందుతూ 2 ప్రధాన జాతులుగా విడిపోవడం. అందులో మొదటిది వక్ష జాతి కాగ, రెండవది జంతు జాతి. అందులో జంతు జాతి మళ్లీ తోక ఉన్న జాతి, తోకలేని జాతిగా విడిపోయింది. ఆ జాతి నుండి నరజాతి పరిణామం చెందినది. ఇది పూర్తిగా యాదచ్చికం.
వానరాలలో అత్యంత ప్రాచీనమైనవి గిబ్బన్లు. ఇవి పూర్తిగా చెట్లను ఆధారంగా చేసుకుని జీవించేవి. పూర్తిగా శాఖాహారులు. పొట్టి కాళ్లు, పొడుగు చేతులుండి ఒక చెట్టునుంచి ఇంకో చెట్టుపైకి సులభంగా దూకే శరీర నిర్మాణం కలవి. వీటి బరువు 18 కిలోలకు మించదు. ఇవి చెట్లపై దొరికే ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. గిబ్బన్లు తర్వాత కాలంలో బహుశ లక్షలసంవత్సరాల తర్వాత భారీ దేహం గల జీవులుగా మార్పు చెందాయి. ఈ జీవులు కూడా గిబ్బన్లవలె వనాధారిత జీవులు, శాఖాహారులు. చిన్న కుటుంబాలుగా జీవించాయి. శాస్త్రజ్ఞులు వీటికి ఒరాంగుటాన్ అనే పేరు పెట్టారు. గిబ్బన్లతో పోలిస్తే వీటిలో కనిపించే స్పష్టమైన మార్పు శరీర బరువు అధికంగా ఉండటం. గిబ్బన్ల వలే ఇవి కూడా కొమ్మనుండి కొమ్మకి దూకుతూ ఆహార అన్వేషణ చేస్తాయి. ఇవి తర్వాత కాలంలో ఏప్ జాతిలో అన్నింటికన్నా పెద్దవైన జీవులుగా మారాయి. వీటి బరువు ఒరామ్గుటాన్ కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ. కావున చెట్లపై సంచరించడం అంత సులువు కాకపోవడం వలన అనివార్యంగా నేలమీద జీవించడం అలవాటు చేసుకున్నాయి. ఇవి సాధారణంగా 4కాళ్లతో సంచరిస్తాయి. కాని అప్పుడప్పుడు రెండు కాళ్లతో కూడా నడవడం వీటి ప్రత్యేకత. వీటికి గొరిల్లా అని నామకరణం చేశారు. గొరిల్లాలు పగటి సమయంలో నేలపై గడిపినా, నిద్రా సమయంలో మాత్రం చెట్లపై ఆకులలములు, చెత్త చెదారం పోగేసుకుని గూళ్లు కట్టుకుని జీవించడం వీటికి అలవాటని లభ్యమైన అస్థిపంజరాలతో పాటు, గూళ్ల నిర్మాణ ఆనవాళ్లు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
గొరిల్లాలకు దగ్గరి పోలికలు ఉన్న జీవులను చింపాంజీ అని పిలిచారు. గొరిల్లాల లక్షణాలన్నీ వీటిలో కనిపిస్తాయి. వీటికి శాఖాహారంతోపాటు అప్పుడప్పుడు మాంసం భుజించడం కూడా అలవాటు. రెండు కాళ్లతో గొరిల్లాలకన్నా ఎక్కువ దూరం నడువగలవు. ఇవి మహా చురుకైనవి. ప్రతి దాంట్లో వేలు పెట్టి రౌడీలుగా ప్రవర్తించడం వీటికి సరదా. మునుపటి జీవులతో పోలిస్తే వీటిలో కొంత మానసికమైన మార్పు వచ్చిందని చెప్పవచ్చు. వీటికి గల ప్రత్యేక లక్షణం చేతితో పనిముట్లు పట్టుకోగలగడం. మిగతా జీవరాశితో పోల్చితే ఇది అమూల్యమైన నైపుణ్యం. చేతితో వస్తువులు పట్టుకునే జీవుల్లో ఆలోచన శక్తి అధికం. ఇలా ఆలోచన శక్తి బాగా ఉన్న జీవుల్లో మెదడు కూడా బాగా అభివద్ధి చెందుతుందని పరిశోధనల్లో తేలింది. కారణం చేతికి కంటికి సమన్వయం జరుగుతుంది. కాబట్టి చింపాజిలకు చిన్నపాటి శిక్షణ ఇచ్చి సులువైన పనులని చేయించుకోవచ్చు. చింపాంజీలో దవడలు ముందుకు పొడిచి వచ్చినట్టు ఉంటాయి. పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాలలో చింపాంజీలతో పోల్చదగిన జీవుల ఎముకలు, అస్థిపంజరాలు ఎన్నో బయటపడ్డాయి. శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించి వాటి లక్షణాల ఆధారంగా వాటిని చింపాంజీలు కావని తేల్చేసారు. వాటికి అస్త్రలోపితికస్ అనే పేరు పెట్టారు. వీటి దవడలు మానవులకంటే బరువుగా, పొడవైనవిగా ఉండి చింపాంజీలకన్నా చిన్నవిగా ఉంటాయి. రెండు కాళ్లతో సంచరిస్తాయి. దీనికి కారణం భూమిపై కొన్ని లక్షల సంవత్సరాలకొకసారి మహాయుగాలు వస్తాయి. ఒక్కొక్క మహాయుగంలో 4 హిమయుగాలు వస్తాయి. ఒక హిమయుగం ముగిసి మరో హిమయుగం ఆరంభంయ్యేలోపు కొంత సాధారణ వాతావరణం ఉంటుంది. దానిని సంధి కాలం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నది మానవ మహాయుగం, వాతావరణం వెచ్చగా ఉంటుంది. భవిష్యత్తులో మరొక హిమయుగం రావచ్చు. హిమయుగాలు వచ్చినప్పుడు ప్రకతిలో పెనుమార్పులు సంభవిస్తాయి. ప్లీస్ట్ ఒసీన్ మహాయుగంలో ప్రపంచ శీతోష్ణస్థితి పూర్తిగా మారిపోయింది. చలి విపరీతంగా పెరిగింది. దట్టమైన అరణ్యాలు అంతరించిపోయాయి. పరిస్థితులను తట్టుకోలేక పెద్ద మొత్తంలో స్తన్య, భారీ దేహం గల జీవులు అంతరించాయి. ఆ పరిస్థితులకు తట్టుకున్న జీవులు మాత్రమే బతికి బట్టకట్టాయి. ఆ క్రమంలో చెట్లు ఆధారంగా జీవించే జీవులు తప్పనిసరిగా నేలపై జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆహార సేకరణ సమయంలో యాదచ్చికంగా రెండుకాళ్ల నడక సౌకర్యవంతంగా అన్పించి, దానినే అలవర్చుకున్నాయి. పూర్తిగా శాఖాహారులైన ఆ జీవులు, చెట్లు అంతరించే సరికి ఆహారం దొరకక, కనిపించిన చిన్న జీవులను ఆహారంగా తీసుకుని ఉండవచ్చు. వాటి దంత నిర్మాణం దీన్ని బలపరుస్తుంది.
చైనాలోని చౌకూతియన్ గుహలో జీవుల ఆధారాల కోసం తవ్వకాలు జరుపుతుండగా భూఉపరితలానికి 160 అడుగుల లోతులో గుర్రాలు, ఎలుగుబంట్లు, ఒంటెలు, రైనోసిరస్లు, ఏనుగుల అవశేషాలతోపాటు పరిణామం చెందిన అస్త్రలోపితికస్ల అవశేషాలు దొరికాయి. వాటికి హోమో ఎరెక్టస్ అని నామకరణం చేశారు. అంటే అక్కడ దొరికిన జీవులను వారు ఆహారం కోసం సంహరించి ఉండవచ్చు. దీన్నిబట్టి చూస్తే హోమో ఎరెక్టస్లు కిందటి జీవులకన్నా వేటలో మంచి నేర్పు సాధించిన వారు అని తెలుస్తున్నది. మానవుని మెదడు బరిణే సగటున 1350గ్రాములుంటే వీటిది 1000 గ్రాములు ఉండటం విశేషం. అంటే మనకు అతి సమీప లక్షణం.
మనవ పూర్వుని అవశేషం మొట్టమొదటిసారిగా 1848 సంవత్సరంలో ఒక గుహలో దొరికింది. దాని ఎముకలు దళసరిగా, కనుబొమ్మలు ఉబ్బెత్తుగా, ముక్కు వెడల్పుగా, దవడలు బరువైనవిగా ఉన్నాయి. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 1856లో నియండర్ తల్ గుహలో ఒక అస్థిపంజరం దొరికింది. ఇంతకుముందు చెప్పుకున్న లక్షణాలు సరిగ్గా దీనికి కూడా పోలిఉన్నాయి. దీనికి నియానడర్ తల్ మానవుడు అనే పేరు పెట్టారు. నాలుగో హిమయుగానికి ముందు అవతరించిన వీరు తర్వాత వచ్చిన హిమ ప్రళయ పరిస్థితుల్లో కూడా తట్టుకున్నారు. ఆ చలిని తట్టుకోవడానికి జంతుచర్మంతో తయారు చేసిన దుస్తువులు ధరించారు. వీరి అవశేషాలు ఉత్తరాఫ్రికాలో, రష్యాలో, పలేస్తినాలో, ఇరాక్లో, ఇంకా చాలాచోట్ల దొరికాయి. ఆధునిక మానవులతో వీరికి పోలికలు తక్కువ. ప్రత్యేక సందర్భాలలో నరమాంస భక్షణ చేసే వారని తెలుస్తుంది. యుగోస్లేవియలోని క్రపినా అనేచోట చితగ్గొట్టబడిన, కాల్చిన మనవ శల్యాలు దొరికాయి. కాలి, చేతి ఎముకలను పగులగొట్టి లోపలి గుజ్జును తినేవారని అర్థం చేసుకోవచ్చు. అప్పటికి భాష అభివద్ధి చెందలేదు. సమూహంతో బతికేవారు ఏమైనా అవసరం వస్తే చేతులతో, వేళ్లతో, కండ్లతో, మొత్తం శరీరంతో సంజ్ఞలు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. ఈ ఆధిమ లక్షణంతో జీవించే మానవులు నేటికి ప్రపంచంలో అక్కడక్కడ ఉన్నారు.
యూరప్లోని లేవేజిస్ అనే గ్రామం వద్ద వేజీర్ నది తీరాన క్రోమన్యాన్ (పెద్దగొయ్యి) అనే పేరుగల గుహ ఉంది. 1868లో రైలుమార్గం వేయడానికి కాంట్రాక్టర్లు తవ్వుతుండగా కొన్ని ఆస్థిపంజరాలు, శిలా పరికరాలు దొరికాయి. వాటికి క్రోమన్యాన్ మానవులు అని పేరుపెట్టారు. ఆధునిక మానవులకు అతి దగ్గరి పోలికలు కలవారు వీరు. మొరటుగా ఉండేవారు. వేట వీరి ప్రధానజీవిక. దానికోసం రకరకాల పనిముట్లు తయారు చేసుకునేవారు. వాటిలో కొన్ని దూరంగా ఉన్న జంతువుల మీదికి విసిరి చంపే విధంగా ఉండగా, మరికొన్ని దొరికిన మతకళేబరాన్ని కోసేవిధంగా పదునుగా ఉండేవి. వేటాడటం మానవులలో ఆలోచన శక్తిని విస్తృతపర్చింది. వీరు పెద్దపెద్ద జంతువుల సమూహాలను మూకుమ్మడిగా దాడి చేసి అందరూ కలిసి పంచుకునేవారు. అడవి గుర్రాలను వీరు అంత్యంత నేర్పుతో వేటాడేవారని ఒక లోయ అడుగులో దొరికిన గుర్రాల అస్తిపంజరాల గుట్ట తెలియజేస్తుంది. వీటితోపాటు లేళ్ళు, ఏనుగులు, అడవిపందులు మొదలైన వాటిని సునాయాసంగా వేటాడి తినేవారు. అలా దొరికిన ఆధారాలు కోకొల్లలు. చేతితో బాణాన్ని ఉపయోగించడం, మానవులలో అనూహ్యమైన మానసిక మార్పులను కలుగజేసింది. తర్వాత కాలంలో వేటాడటం వలన జీవులు త్వరగా కనుమరుగవుతున్నాయని అనుభవం ద్వారా తెలుసుకుని, తమ స్వభావంలో మార్పులు చేసుకుంటూ కొన్ని జంతువులను పెంచుకోవడం నేర్చుకుని అవసరమైనప్పుడు చంపి తినడం అలవర్చుకున్నారు. ఇది పశు పోషణకు దారి తీసింది. ఇదే క్రమంలో పంటద్వారా వచ్చే గింజలను కూడా ఆహారానికి ఉపయోగించవచ్చని తెలుసుకొని నదీ తీరాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకుని పంటలు పండించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో తిండికోసం ఎక్కువకాలం వెచ్చించాల్సిన అవసరం తప్పింది. భాషనూ కళలనూ, కట్టుబాట్లనూ, సంస్కృతిని అభివద్ధి చేసుకోవడానికి ఆ సమయాన్ని మనిషి వాడున్నాడు. ఈవిధంగా మానవుడు పశు ప్రవృత్తి నుండి సున్నిత స్వభావిగా వేరై సరికొత్త నాగరికతకు బీజాలు వేశాడు. అదే మనిషి, నేడు టెక్నాలజీని ఉపయోగిం చుకుని ఇతర గ్రహాల మీదకు రాకెట్లు పంపి అక్కడి పరిస్థితు లను అధ్యయనం చేస్తున్నాడు. ఇది భూగ్రహం మీది పరిస్థితి.
పరిణామవాదం స్థూలంగా చెప్పేది మానవ సమూహం అంతా ఒకే కుటుంబానికి చెందినదని. కావునా కుల, మత కల్లోలాల నుండి నేడు సమాజం బయటపడాలంటే శాస్త్రీయంగా కనిపిస్తున్న ఏకైక బలమైన వాదంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇంత శాస్త్రీయంగా ఉన్న పరిణామవాదాన్ని ఒప్పుకోలేని వారు ఏ ఆధారాలు లేని సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, అవే నిజాలని చెప్పి జనాలను ఎలా భ్రమల్లోకి నెడుతున్నారో ఆలోచించవల్సిన అవసరం ఎంతైనా ఉంది. మతవాదులు మాయలు, మహిమలు, అద్భుతాల గురించి నూరుమాటలు చెబుతారు. విజ్ఞానశాస్త్రాన్ని ఎంతో తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కాని వారికేదైన అసాధారణ జబ్బు చేస్తే వెంటనే తగ్గించుకోవటానికి వైద్యశాలను ఆశ్రయిస్తారు. ఇలాంటి తప్పనిసరి సమయాలలో మాత్రం వారికి విశ్వాసాలు, శక్తులు, మహిమల మీద నమ్మకం ఉండదు. ఎందుకో మనం ఆలోచించాలి. ఎవరెన్ని చెప్పినా పూర్తిగా విని, వాస్తవ అంశాలనే అనుసరించాలి. అదే ప్రగతికి బాటలు వేస్తుంది.
- రవికుమార్ సంగనమోని
సెల్ : 7893903740
Authorization