ఎండి.అయూబ్
దళిత బాలికను మూడ్రోజులు ఇంట్లో బం ధించి ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వెలుగులోకొచ్చింది. బాపూజీనగర్కు చెందిన దళిత బాలిక ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. ఈ నెల 9న మధ్యా హ్నం సమయంలో కిరాణా షాపుకు వెళ్లిన బాలిక అదృశ్యమైంది. అదే వీధిలో ఉంటున్న పిన్నపురెడ్డి నితిన్రెడ్డి నోట్లో గుడ్డలుపెట్టి బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికను బంధించాడు. సాయ ంత్రం వరకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రు లు చుట్టుపక్కల వారితోపాటు, బంధువుల ఇండ్ల ల్లో కూడా వెతికారు. అప్పటికీ కన్పించకపోవ డంతో సోమవారం స్థానిక కౌన్సిలర్ ఆంజనేయ రాజు సహకారంతో మరో మారు వెతికారు. అదే వీధిలో నివాసముంటున్న నితిన్రెడ్డిపై అనుమా నం వచ్చి అతని వద్దకు వెళ్లి పలుమార్లు ప్రశ్నించా రు. తనకు తెలియదంటూ బుకాయించడంతో బాలిక తల్లిదండ్రులు సోమవారం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సోమవారం రాత్రి మరోమారు నితిన్రెడ్డి ఇంటికెళ్లి ప్రశ్నించారు. అయినప్పటికీ బాలిక విషయం తనకు తెలియదని బుకాయిం చాడు. మంగళవారం ఉదయం బాధిత బాలిక ఆ ఇంట్లో నుంచి బయటికొచ్చి తల్లిదండ్రుల వద్దకు చేరింది. మూడ్రోజులుగా తనపై జరిగిన అఘాయి త్యాన్ని వివరించింది. ఆదివారం మధ్యాహ్నం తనను నోట్లో గుడ్డలు పెట్టి కిడ్నాప్ చేశారని, ఇంట్లో బంధించి మూడ్రోజుల పాటు నితిన్రెడ్డి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులకు వివరించింది. పోలీసులు వెంటనే నితిన్రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నితిన్రెడ్డి పై 376 సెక్షన్ 5 రెడ్విత్ 6, పోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై రజినికర్ తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సెల్ : 7013755606
బాధిత బాలికకు న్యాయం చేయాలి
బాధిత బాలికకు న్యాయం చేయాలని దళిత స ంఘాల నాయకులు ముండ్లగిరి కాంతయ్య, మొండి కత్తి లింగయ్య, ఎడ్ల రమేశ్లు కోరారు. స్థానిక పోలీ స్స్టేషన్లో బాధిత బాలికను పరామర్శించారు. కే సు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ బాలికను కిడ్నాప్ చే సి ఇంట్లోనే అఘాయిత్యానికి పాల్పడుతున్నా నితిన్ రెడ్డి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. చట్టపరమైన చర్యలు తీసుకొని బాధి త బాలికకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రం లో దళిత బాలికలు, మహిళలపై జరుగు తున్న దా డులు అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- దళిత సంఘాలు
దళితులపై జరిగే దాడులను రాష్ట్రపతికి నివేదిస్తా
దళితులపై జరిగే దాడులను రాష్ట్రపతికి నివేదిస్తానని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యులు కె.రాములు అన్నారు. శనివారం ఆయన బాధిత బాలిక కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, అత్యాచారాలు, హత్యలు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటివరకూ జరుగుతున్న దాడులపై రాష్ట్రపతిని కలిసి వివరిస్తానని చెప్పారు. ఇటీవలకాలంలో ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడు ప్రణరును కులదురహంకార హత్య చేశారనీ, మెదక్ జిల్లాలో 16 ఏండ్ల అమ్మాయిపై గ్యాంగ్రేప్ చేశారని గుర్తు చేశారు. కడపలో ఐఐటీ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగిని వేధించి పదోన్నతి రాకుండా అడ్డుకున్నారని, ఇతర ప్రాంతాల్లో కూడా అనేకచోట్ల దళిత బాలికలు, మహిళలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. కేవలం దళిత మహిళలు, బాలికలపై ఇలాంటి దాడులకు పాల్పడం దారుణమన్నారు. మిర్యాలగూడలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా గదిలో నిర్బంధించి మూడ్రోజుల పాటు లైంగికదాడికి పాల్పడ్డారని, ఆ నిందితుడి నితిన్రెడ్డితోపాటు, సహకరించిన తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించాలని డిమండ్ చేశారు. అగ్రవర్ణాలు దళితులను ప్రలోభపెట్టి మానసికంగా, శారీరకంగా లొంగదీసుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. కమిషన్ ద్వారా రావాల్సిన అన్ని సౌకర్యాలు, ఆర్థికసాయాన్ని త్వరితగతంగా అందేలా చర్యలు తీసుకుంటానన్నారు.
- ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యులు రాములు